ఉల్లాసంగా, ఉత్సహాం గా జాతీయ స్థాయిలో పోటీలు హాజరైన ఐదు రాష్ట్రాల కళాకారులు, చిన్నారులు గత40సంవత్సరాల నుండి కొనసాగుతున్న నవరస జానపద సంగీత నృత్య పోటీలు మూడు రోజుల పాటు పండుగ వాతావరణం లో జరుగుతున్న పోటీలు చిలకలూరిపేట పట్టణంలో గత 40 సంవత్సరాలుగా జాతీయస్థాయి నవరస శాస్త్రి జానపద సంగీత నాట్య కళారూపాలు పోటీలు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. ఈనెల 24 25 26 తేదీల్లో ఈ పోటీలు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక నిర్వాహకుడు 1984 నుండి ప్రగడ రాజ మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కళారూపాలు ప్రదర్శించబడుతున్నాయి. ఈ పోటీలకు ఆంధ్ర ,తెలంగాణ ,కర్ణాటక, కేరళ ,చెన్నై రాష్ట్రాల నుండి కళాకారులు వచ్చి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పగలు, రాత్రి ఈ సంగీత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి
Author: chilakaluripetalocalnews@gmail.com
చిలకలూరిపేట పురపాలక సంఘంలో అవినీతి పై సమగ్ర విచారణ చేయాలి.. బీజేపీ కో కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావుగత ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట మున్సిపాలిటీలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం కో కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు.గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ తరఫున టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఏడు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వాటిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న ఎటువంటిచర్యలు తీసుకోకుండా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కూడా పలు అనుమానాలకు తావు తీస్తా ఉంది.గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో మాజీ మంత్రి విడుదల రజిని అలాగే మాజీ కౌన్సిలర్ విడుదల గోపి హయాంలో ఎన్నో అవకతవకలు మున్సిపల్ కార్యాలయంలో జరిగినాయి వాటిలో మచ్చుతునక అయినటువంటి టౌన్ ప్లానింగ్ అలాగే రెవెన్యూ సెక్షన్లో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయి వాటిలో…
జగన్ ఉనికి రాష్ట్రప్రగతి… ప్రజల మనుగడకే ప్రమాదం : మాజీమంత్రి ప్రత్తిపాటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో జరుగుతున్న తొలి మహానాడుని కనీవినీ ఎరుగని విధంగా దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.మహానాడు జనసమీకరణ కమిటీ సభ్యుడిగా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా రాజంపేటలో పర్యటించిన ప్రత్తిపాటి, స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్, ప్రజలు మెచ్చేలా ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలతో దేశం గర్వించేలా పార్టీని నడిపారని పుల్లారావు చెప్పారు. ఆ మహానుభావుడి ఘనతను, చరితను స్మరించుకుంటూ ఏటా తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించుకునే గొప్ప పండుగ మహానాడు అని ప్రత్తిపాటి చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ బాటలో పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు అనతికాలంలోనే తన పనితీరు, పాలనాసంస్కరణలతో ప్రజల మనసుల్లో చెరగని స్థానం…
రేపటి నుండి రోహిణి కార్తే ప్రారంభం..రోహిణి కార్తె అంటే ఏంటీ..!? ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ? రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు.మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి.మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏలా ఉంటుందో గమనిద్దాం. తేదీ. ఈ సంవత్సరం రోహిణి కార్తే మే 25 న ప్రారంభమై జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది.రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు , ఎండ తీవ్రతలు , అగ్ని…
పేట లో కోదండరామాలయం వద్ద కోడిగుడ్డు అట్ల విక్రయంపై భక్తుల ఆగ్రహం – చర్యలు తీసుకోవాలని డిమాండ్ కోదండ రామాలయం ఒక వైపు చికెన్ కిచిడి పరోట కబాబ్ చిలకలూరిపేట పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ బజార్, మద్ది మల్లయ్య వీధి శ్రీ కోదండరామాలయం గుడి ముందు కోడిగుడ్డు అట్లు విక్రయిస్తుండటంపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన దేవాలయం ఆవరణలో, మరీ ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో నిషిద్ధమైన మాంసాహార పదార్థాలను విక్రయించడం తమ మనోభావాలను దెబ్బతీస్తోందని పలువురు భక్తులు మండిపడుతున్నారు. భక్తుల ఆవేదన దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు. భక్తులు పవిత్ర భావనతో ఆలయాలకు వస్తారు. అటువంటి ప్రదేశంలో, ముఖ్యంగా రామచంద్రుడు కొలువై ఉన్న గుడి ముందు కోడిగుడ్డు అట్లు వంటి ‘నీచ పదార్థాలను’ విక్రయించడం దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది దేవాలయ పవిత్రతను, భక్తుల విశ్వాసాలను అవమానించడమేనని వారు వాదిస్తున్నారు. హిందూ ధర్మంలో దేవాలయాల పరిసరాల్లో…
ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన.. దివ్యాంగురాలికి ట్రైసైకిల్ అందజేత దాతృత్వంచాటుకున్న క్లబ్ సభ్యులు చిలకలూరిపేట:సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే, ప్రజలకు ముఖ్యంగా మహిళలకు న్యాయ పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తున్న ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సేవలు ప్రశంసనీయమైనవని న్యాయవాదులు మాదాసు భానుప్రసాద్, శ్రీనివాసరావు చెప్పారు. ఇన్నర్వీల్ క్లబ్ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని సుగాలికాలనీ అంగన్వాడీ కేంద్రం వద్ద మహిళలకు వివిధ అంశాలపై న్యాయవాదులు మాదాసు భానుప్రసాద్, శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షురాలు గట్టు సరోజిని అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రాధమిక న్యాయ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవడం వల్ల సమాజం మెరుగవుతుందని, ప్రజలకు వారి హక్కులు తెలుసుంటే, వారు వారి హక్కులను కాపాడుకోవచ్చుని, సమాజంలో న్యాయం కోసం పోరాడవచ్చుని వెల్లడించారు.
చిలకలూరిపేట పట్టణంలోని, బొందిలిపాలెం, ఓగేరు రోడ్డు నందు వేంచేసియున్నా శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ పోలేరమ్మ తల్లి ఏకాదశ జాతర మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ఆలయ కమిటీ వారు నిర్వహించిన పంచామృత అభిషేకములు, మరియు కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ షేక్ రఫ్ఫాని గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, పఠాన్ సమద్ గారు, మద్దుమాల రవి గారు, ఆలయ కమిటీ సభ్యులు బీకాం శ్రీనివాస్, మిద్దెల పూర్ణ సింగ్, గిరి, హనుమాన్ సింగ్, బి.రామాంజనేయ సింగ్, ప్రతాప్ సింగ్, చేజర్ల శ్రీనివాస్ సింగ్, ఉదయ్ సింగ్ మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…
ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రక్త దాన శిబిరానికి విశేష స్పందన ముందుకొచ్చి రక్తాన్ని దానం చేసిన యువత చిలకలూరిపేట ఎమ్మార్వో ఆఫీస్ లో జరిగిన రక్త దాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయంలో శనివారం మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. పట్టణంలో ని పలు ప్రాంతాల నుంచి యువకులు ముందుకొచ్చి రక్తాన్ని దానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో ఈ రక్త దాన శిబిరం జరిగింది. ఆపద సమయంలో,అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు కు గురవుతున్నారని, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని,అలాంటి వారి కోసం ఈ రక్త దాన శిభిరాలు ఉపయోగ పడతాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి అన్నారు. రక్తం ఇచ్చిన యువతను ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎమ్మార్వో హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి పలువురు…
విస్తృత స్థాయిలో వాహనాలు తనిఖీ చేసిన మూడు శాఖల అధికారులు భారీగా అపరాధ రుసుం వసూలు… కేసులు నమోదు చిలకలూరిపేట పట్టణంలో ని పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు బృందం 18కేసులు నమోదు….5 వాహనాలు సీజ్….91,720 జరిమానా విధించిన అధికారులు చిలకలూరిపేట రవాణా శాఖ ,పోలీసు,మోటార్ వెహికిల్ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన దాడులు. సరైన అనుమతి పత్రాలు లేని 18 ఆటో,సరుకు రవాణా వాహనాలపై కేసులు నమోదు ఐదు వాహనాలు సీజ్ చేసి,91720 రూపాయల అపరాధ రుసుం విధించిన అధికారులు బృందం వాహనాలు కు సంబంధించిన పలు రకాల పత్రాలు…లేని వాహనాలు పై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎట్టకేలకు పోస్టింగ్ సాధించినTPO సుజాత తాడిపత్రి పట్టణ ప్రణాళిక అధికారిణి ( TPO)గా కుంజా సుజాత నిన్నటి వరకు చిలకలూరిపేట పురపాలక సంఘం TPS గా విధులు నిర్వహించిన సుజాత పదోన్నతి పై రేపల్లె కు బదిలీ కాగా…. అక్కడ కొన్ని కారణాల రీత్యా ,ఖాళీ లేక ,రేపల్లె లో చేరలేదు.. ఈ నెల14న చిలకలూరిపేట నుంచి బదిలీ అయిన సుజాత…. వారం పాటు వెయిటింగ్ లో ఉంది. ఆ తదుపరి ఈ నెల 22న శుక్రవారం సాయంత్రం తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో TPO గా భాద్యతలు స్వీకరించారు .









