పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది
ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది
వచ్చిన పిర్యాదులు
అచంపేట్ మండలం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి ఫిర్యాదులు రావడం జరిగింది
పాల్గొన్న నాయకులు:
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి కో కన్వీనర్ గంజార్ల ఆదిలక్ష్మి గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ గారు ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా కార్యదర్శి జెవిశెట్టి బ్రహ్మయ్య గారు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్చార్జి కోమటి వాసు మరియు బిజెపి నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే బిజెపి లక్ష్యమని, ‘జనతా వారధి’ ద్వారా ప్రతి సామాన్యుడికి పార్టీ అండగా ఉంటుందని ముఖ్యఅతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు తెలిపారు



