జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి
జిల్లాలో నిర్దేశిత గడువులోగా సర్ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలనిజిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ అంశాలపై మంగళవారం క్యాంపు కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ సంజన సింహ,ఎలక్షన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో , స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బీఎల్వోలు తప్పనిసరిగా ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలను సేకరించి వాటిని 2002 ఓటరు జాబితాతో క్షుణ్ణంగా మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ అంశంపై బిఎల్వోలు పోలింగ్ కేంద్రాల పరిధిలోని వివిధ పార్టీల బూత్ ఏజెంట్ (బిఎల్ఏ) లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయా నియోజకవర్గాల ఈఆర్ఓలు తమ పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఈ మ్యాపింగ్ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా వారి సహకారం తీసుకోవాలన్నారు.అల్ ఈ ఆర్ ఓ లు లాగ్ ఇన్ ను వారే ఉపయోగించాలన్నారు. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆన్లైన్లోకి ఇచ్చేటప్పుడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలన్నారు బి ఎల్ వో లకు ఏ ఈ ఆర్ వో లు సెలవులు మంజూరు చేస్తేనే వెళ్లాలన్నారు జిల్లాలోని ఎలక్షన్ డి టీల వివరాలను జిల్లా కలెక్టర్ కు అందజేయన్నారు. బి ఎల్ వో లు బిఎల్ఎ ల సహాయంతో క్షేత్రస్థాయిలో వెళ్లారన్నారు.



