• పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి ఎల్నినో పరిస్థితులు ప్రభావం పై జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు రక్షణ నీటి నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి బట్టరుశెట్టి సులోచన పల్నాడు జిల్లా మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు చిలకలూరిపేట మాజీ మండల అధ్యక్షులు దడబడ పుల్లయ్య నరసరావుపేట బిజెపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగింది

జనతా వారధి
ది. 01.02.2026 సోమవారం

విషయం : ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు రక్షణ – నీటి నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.

రాష్ట్రంలో 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వాతావరణ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం భారీ వర్షాల అవకాశాలను దృష్టిలో ఉంచుకొని చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాల పెంపు కోసం చర్యలు చేపడుతోంది.

ఈ రెండు అంశాలు రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకుంటున్న చర్యలే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు స్పష్టమైన అవగాహన లేకపోతే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు మరియు రైతులు భాగస్వామ్యంతో ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయవలసిన అవసరం ఉంది.

భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమం ద్వారా రైతులను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటుంది. వారి నుంచి వచ్చిన సందేశాలు దృష్ట్యా మరియు నిపుణులతో మేము చర్చించిన దృష్ట్యా ఎల్నినో పరిస్థితుల్లో వర్షాభావం లేదా భారీ వర్షాలు రెండూ సంభవించే అవకాశం ఉన్నందున, “పంట ప్రణాళికలో జాగ్రత్త – నీటి నిర్వహణలో ముందుచూపు” అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగాలి. స్పష్టమైన లక్ష్యం, సమన్వయంతో కూడిన కార్యాచరణ, క్షేత్రస్థాయి అవగాహన ద్వారా మాత్రమే రైతులను నష్టాల నుండి కాపాడగలం.

అందువల్ల ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.

మా వినతులు:

  • రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎల్నినో ప్రభావంపై ఏకీకృత మార్గదర్శకాలను విడుదల చేయాలి.
  • జిల్లా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
  • రైతులకు పంటల ఎంపిక, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలు, నీటి పొదుపు పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించాలి.
  • జిల్లాకు ప్రత్యేక వాతావరణ-వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
  • చెరువులు, కాలువలు, వాగులు, నీటి వనరుల పునరుద్ధరణను వేగవంతం చేసి వర్షపు నీటి నిల్వకు సిద్ధం చేయాలి.
  • వ్యవసాయ, జలవనరుల, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  • రైతులకు వారానికొకసారి వాతావరణ సూచనలు, పంటల సలహాలు అందించే ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  • గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
  • ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి “రైతు రక్షణ – నీటి భద్రత కార్యాచరణ ప్రణాళిక” ప్రకటించాలి.

“ఎల్నినో సవాళ్లను అవకాశాలుగా మార్చుకుందాం – రైతు రక్షణ, నీటి భద్రతకు సమగ్ర కార్యాచరణ అవసరం”
అని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా పిలుపునిస్తున్నది.

పల్నాడు జిల్లా జనతా వారధి టీం

Share.
Leave A Reply