చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు స్వామివారి బింబపు విమాన శిఖరము, జీవ ధ్వజ పునః ప్రతిష్టా మహోత్సవం దైవజ్ఞుల నిర్ణయం మేరకు జరుగుచుండగా ఈ మహత్తర ప్రతిష్టా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మరియు గ్రామ ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి, తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ ప్రతిష్టా మహోత్సవంలో వారికి సాదర స్వాగతం పలికిన కట్టా జవహార్ బాబు గారు, కందిమళ్ళ శ్రీనివాసరావు గారు, గణేషుని లక్ష్మీనారాయణ గారు, నార్నె హనుమంతరావు గారు, దేవరకొండ గోపి గారు,కంతేటి హనుమంతరావు గారు, కొండ్రగుంట కృష్ణయ్య గారు, బోడ వీరరాఘవులు గారు, గణేషుని యజ్ఞ నారాయణ గారు, కందిమళ్ళ సత్యనారాయణ గారు తాళ్లూరి సింగారావు గారు, కట్టా నాగేశ్వరరావు గారు తదితరులున్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
నేర ప్రవర్తన కల్గిన వ్యక్తులకు ప్రోత్సహించడం సిగ్గుచేటు. సోషల్ మీడియా వేదికగా కులాల మధ్య చిచ్చుపెట్టడం మానుకోవాలి. రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పునరాలోచన చేయాలి.బి.శ్రీను నాయక్. చిలకలూరిపేట:తెనాలిలో ఐత నగర్ లో పలు కేసుల్లో ముద్దాయిలు, నేల ప్రవర్తన కలిగిన యువకులు గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారు.సంఘటనను దృష్టిలో పెట్టుకొని యువకులను రోడ్డుమీదకి తీసుకొచ్చి సీఐ రాములు నాయక్, రమేష్ బాబులు కొట్టడం జరిగింది. ఆ యువకుల పట్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వారు చేస్తున్నటువంటి కొన్ని పనుల వలన భయభ్రాంతుకు లోనే ఉన్నారు. కాబట్టి సిఐలు ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన తొలగించడం కోసం రోడ్డు మీదకు తీసుకువచ్చి కొట్టడం జరిగింది. దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు కులాన్ని ఆపాదించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కులం పేరుతో తిట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చూస్తున్నారని, వారి ఆలోచన…
బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం కారు-స్కూటర్ ఢీ….ఇద్దరు యువతులు కు తీవ్ర గాయాలు ఘటన స్థలాన్ని పరిశీలించి న యడ్లపాడు పోలీసులు ఇద్దరు యువతులలో ఒకరికి పరిస్థితి విషమం స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులు హైవే అంబులెన్స్ లో గుంటూరు వైద్యశాల కు తరలింపు గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం గాయపడిన వారు సూరవరపు పల్లి గ్రామానికి చెందిన మహిళా విద్యార్థులుగా గుర్తింపు
వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామం నందు శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థాన ప్రతిష్ఠా మహోత్సవం లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. వారితో పాటు మాజీ ఎంపీ మోదుగుల వేణు గోపాల్ రెడ్డి గారు. మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి తొలిసారిగా సర్కార్ ఆఫీసులలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నివాళి అర్పించిన మున్సిపల్ ఉద్యోగులు, కౌన్సిలర్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి నివాళి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదలకు, అణగారిన వర్గాలకు చేసిన ప్రజా సేవల గురించి గుర్తు చేసుకున్నా కౌన్సిలర్లు, ఉద్యోగులు..
గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపండి! ..లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్.. తెనాలిలో గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇకనైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలను తీసుకొని నేరాలు జరగకుండా చూడాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు.గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై రౌడీ షీటర్ అనుచరులు చేసిన దాడిని మాత్రమే డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంటే సరిపోదని, గంజాయి ఇతర మత్తు పదార్థాల వలన నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అనేక కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయని విషయాన్ని గుర్తించి, గంజాయి క్రయవిక్రయాలను జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలైనా వారు కుటుంబాలలో వృద్ధులైన తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యని చావబాదుతున్న సంఘటనలు నిత్యం…
నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు…. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్… పల్నాడు జిల్లా నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. పమిడిమర్రు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ తనిఖీ లలో సరైన పత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, గొడ్డళ్లు, కర్రలు, పలుగులు మారణాయుధాలు స్వాధీనపర్చుకోవడమైనది. ఫుట్ పెట్రోలింగ్, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన చేశారు. అంతేకాకుండా… రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు…
ఓకే సర్కిల్ లొ రెండు విధానాలు దళితులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తే ఊరుకొం :ఎమ్మార్పియస్ రాష్త్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన కోట సాగర్ బాబు తన గృహ అవసరం నిమిత్తం 30ట్రిప్పుల మట్టిని తీసుకుంటే 200 ట్రిప్పుల మట్టి అక్రమానికి పాల్పడ్డాడని బుటకపు కేసు నమోదు అదే సర్కిల్ అడిగోప్పల గ్రామంలొ ఎస్సి సామాజిక వర్గానికి చెందిన లిడ్ క్యాప్ భూముల్లో సుమారు 500 ట్రిప్పులు అగ్రకులస్తులు తొలికెళ్ళినప్పుడు ఎందుకు కేసు నమోదు చెయ్యలేదు, అదే కారంపూడిలొ లింగంగుంట్ల బడువా అనే వాగును పుడుస్తుంటే కేసు ఎందుకు నమోదు చెయ్యలేదు.దళితులకో చట్టం, అగ్రకులస్తులకో చట్టం ఏమైనా కారంపూడి సర్కిల్ లొ ఉందా, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దళితులపై జరుగుతున్న దాడులు,అక్రమ కేసుల పరంపరపై చర్యలు తీసుకోవాలని, అక్రమ కేసు నమోదు చేసిన ఎస్సై పై శాఖ పరమైన చర్యలు…
కడప గడపలో జరుగుతున్న చారిత్రక మహానాడు కార్యక్రమం రెండో రోజున ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గారు, డీసీసీబీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గారు.
రాష్ట్రీయ జన క్రాంతి పార్టీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 102 వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, కీర్తిశేషులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు 102 వ జయంతి వేడుకలను రాష్ట్రీయ జన క్రాంతి పార్టీ ఆధ్వర్యంలో తిట్కో గృహ సముదాయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని రాష్ట్రీయ జనకాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ గౌస్ అన్నారు. మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది బైరా హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక ప్రతి ఏటా మే 28న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఒక గొప్ప…









