Author: chilakaluripetalocalnews@gmail.com

పిడుగుపాటుతో మహిళ మృతి – ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పరామర్శ నరసరావుపేట మండలం నల్లగార్లపాడు పంచాయతీ పరిధిలోని పాలపాడు రోడ్డులో పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గట్ల చిన్నమ్మ (వయస్సు 55) అనే మహిళ దుర్మరణం చెందారు. మృతురాలు భర్త పెద్ద అంకిరెడ్డి భార్య కాగా, వారికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ విషాద ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం తెలిసిన వెంటనే నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read More

తెలుగు మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరులకు సన్మానంపట్టణంలోని తెలుగు మీడియా ఫెడరేషన్.పి శివ. మనోహర్అధ్యక్షతనబీసీ ఆఫీస్ నందు ప్రపంచ విలేకరుల స్వేచ్ఛ పరిరక్షణ దివస్ లో భాగంగా యువ విలేకరులని ఘనంగా సన్మానించడం జరిగింది మొదటిగా ఇమ్మడి సురేంద్ర బిఆర్కె న్యూస్ మాట్లాడుతూ జర్నలిస్టులను స్వేచ్ఛగా వారి విధులను చేసుకోవాలని తెలియపరిచారు మరియు అమరావతి విలేకరి మనోహర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు వైద్య పరమైన సౌకర్యాలు గృహాలను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించారు అల్లడి హరిబాబు మాట్లాడుతూ మీడియాను గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుభాని . బాలు. బొబ్బబెల్లివెంకటనారాయణ. షబ్బీర్ . వీరయ్య . దేవరకొండ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

అవమానభారంతో రైతులకు ముఖం చూపించలేకే .. రాజధాని సభకు జగన్ ముఖం చాటేశాడు : మాజీమంత్రి ప్రత్తిపాటి- అధికారంలో ఉండి కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించారు.. నేడు ప్రజల కళ్లలోని సంతోషం చూడలేకే రాజధాని వేడుకకు దూరమయ్యారు.: ప్రత్తిపాటి.- నిత్యకల్యాణంలా జరిగే అమరావతి పనుల్ని చూస్తూ, వేధించిన రైతుల ఎదుటే తన రాజకీయ కార్యకలాపాలు సాగించాలనే వాస్తవాన్ని జగన్ గ్రహించాలి : ప్రత్తిపాటి“ అమరావతి పున: నిర్మాణ ఘట్టాన్ని యావత్ భారతావని ఉత్సుకతతో తిలకించింది. 5 కోట్ల ఆంధ్రుల కళ్లు చెదిరిపోయేలా, అమరావతిపై అకారణంగా అక్కసువెళ్లగక్కిన వారు కళ్లలో నిప్పులు పోసుకునేలా రాజధాని సభ నభూతో అన్నట్టుగా భారీస్థాయిలో విజయవంతమైంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలు, రాజధానికి అండగా ఉంటానన్న ఆయన భరోసా తెలుగుజాతిలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మతృప్తిని నింపాయి. ప్రధాని ప్రసంగంపై ప్రజల్లో హర్హాతిరేకాలు వ్యక్తమవుతుండటమే దానికి నిదర్శనం. దైవానుగ్రహంతో అన్నీ అనుకూలించి, సకాలంలో అమరావతి నిర్మాణం పూర్తై, ఆ మహానగరం తమ…

Read More

చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం, ఈవూరివారిపాలెం గ్రామానికి చెందిన కేతినేని ప్రమీల గారు ఇటీవల మరణించగా, ఈరోజు ఈవూరివారిపాలెం గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుచున్న వారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు… ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్, పఠాన్ సమద్, ధూళిపాళ్ళ పద్మ, కేతినేని శ్రీహరి, నాగభైరు ఆంజనేయులు, కేతినేని శ్రీహరి ( కాటన్ ), ఈవూరి బ్రహ్మానందం, నాగభైరు సాంబశివరావు, దూళిపాళ్ళ శ్రీనివాసరావు, నాగభైరు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు…

Read More

చిలకలూరిపేట పట్టణంలోని, పాటిమీద వేంచేసియున్న అంకమ్మతల్లి, పోతురాజు స్వామివార్ల 24వ తిరుణాళ్ళ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అమ్మవారి తిరుణాళ్ళ వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ వారిని సత్కరించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, …

Read More

చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జ్ మద్ది శివ శంకర్ గుప్తా గారు మరణించగా వారి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…

Read More

చిలకలూరిపేట పట్టణం, 9వ వార్డ్, రజక కాలనీలో వేంచేసియున్న శ్రీ ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన దశమ వార్షిక మహోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానంపై స్వామివారిని దర్శించుకొని, కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు… ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, పఠాన్ సమద్ గారు, మద్దుమాల రవి గారు, గంగా శ్రీనివాసరావు గారు, గట్టినేని రమేష్ గారు, పుటిగంపు వెంకటేశ్వరరావు గారు, మండవ వెంకట్రావు గారు, ఒంటిపులి వెంకట్ గారు, మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Read More

ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.1886లో అమెరికాలోని చికాగోలో* హే* అనేటువంటి మార్కెట్లో 18 గంటలు పని చేయడం నుండి సమయం తగ్గించాలని మొదలైన ఉద్యమం ఆరుగురు కార్మికులు ఏడుగురు పోలీసులు చనిపోవడం, తర్వాత కార్మికుల నాయకుల్ని నలుగురిని ఉరి తీయడం తో మొదలైన ఈ ఉద్యమం యూరప్ దేశాల్లో మొట్టమొదటిసారిగా మే 1 న సెలవు దినంగా ప్రకటించడం జరిగింది.మన భారతదేశానికి 1923న మద్రాస్ రాష్ట్రంలో “కిసాన్ పార్టీ ఆఫ్ ఇండియా” వారు మొట్టమొదటిగా సెలవుదినంగా ప్రకటించడం తరువాత భారతదేశమంతటా సెలవు దినంగా ప్రకటించటం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి కార్మికుల ఐక్యత కోసం కార్మికుల ఉన్నతి కోసం మానవ హక్కుల సంఘం తరఫున సంఘీభావ ర్యాలీని చేయటం జరిగింది ర్యాలీలో పాల్గొన్న అందరికీ చైర్మన్ అబ్దుల్ మునాఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Read More

కళమాతల్లీ ముద్దుబిడ్డ తెలుగుభాష కోవిధుడు..ఎస్పీ బాలు మృతి పట్ల దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు…గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వ‌రలోనే పూర్తి ఆరోగ్యంతో వ‌స్తాడ‌నుకున్న అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాల‌కు బాలు వెళ్లిపోయారనిమాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అశ్రు నివాళులు తెలిపారు, బాలు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్‌ మీడియా ముందు ధృవీకరించారు. చెన్నైలోని మౌంట్‌రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సందర్శకుల కోసం చెన్నై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ బాలుకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆగ‌స్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరారు. 50…

Read More

కుల మత సాంప్రదాయాలను గౌరవించాలి: మాజీ స్టేట్ వేజిలెన్స్ చేవూరి కృష్ణమూర్తిచిలకలూరిపేట పట్టణంలోని 8 వ వార్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వెలుపల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాజీ స్టేట్ వేజిలెన్స్ చేవూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి పెద్దపీట వేసే భారతదేశంలో మతాల మధ్య, వారి ఆచార వ్యవహారాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేడు ప్రాచీన సాంప్రదాయాల అవసరం లేదంటూ గౌరవ హోదాలలో ఉన్న వైకాపా పార్టీ నాయకులు అనిచిత వాఖ్యలు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఒకరి సాంప్రదాయాలను మరొకరు పరస్పరం గౌరవిస్తూ నేటివరకు శాంతి భద్రతల మధ్య ప్రజలందరూ జీవనం కొనసాగిస్తూoటే, నేడు రాజకీయ లబ్ధికోసం కులాల, మతాల పేరిట వైకాపా ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం…

Read More