వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయం, నందు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతిని నిర్వహించనున్న నాటకోత్సవాల పాంప్లెట్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు వారి సతీమణి శ్రీమతి గోనుగుంట్ల లీలావతి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి గారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడని, ఆయన కేవలం ఒక నటుడిగానే కాకుండా గొప్ప పరిపాలకుడిగా, ప్రజా నాయకుడిగా తెలుగు జాతికి అందించిన సేవలు అపారమని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నాటకోత్సవాలు నిర్వహించడం ఆయనకు ఘనమైన నివాళిలు ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply