పల్నాడు జిల్లా వినుకొండ
వినుకొండలో రైల్వే స్టేషన్, బస్టాండ్లో పోలీసుల తనిఖీలు
వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్లలో ఆదివారం సాయంత్రం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
పట్టణ సీఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ (BD) టీమ్ మరియు డాగ్ స్క్వాడ్తో కలిసి ఈ తనిఖీ చేపట్టారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్లోని ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు ఏమైనా ఉన్నాయా అని డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సీఐ శోభన్ బాబు మాట్లాడుతూ, ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు.
రానున్న రోజుల్లో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రయాణికులు మరియు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ తనిఖీలలో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ వస్తువులు లేదా వ్యక్తులను గుర్తించలేదని వారు తెలిపారు



