Author: chilakaluripetalocalnews@gmail.com

12 న పెద్ద రథం తిరునాళ్ల…. తిరుణాల జయప్రదం చేయాలని కోరుతున్న జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ చిలకలూరిపేట లక్ష్మీ నరసింహ స్వామి పెద్ద రథం తిరుణాల భక్తుల కొంగుబంగారంపల్నాడు జిల్లాలో చిలకలూరిపేట ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిఎంతోమహిమాన్వితుడుగా భక్తుల నమ్మకాన్ని పొందాడు. ప్రతి సంవత్సరం స్వామివారికి జరిగే తిరుణాల ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం, మే12/06/2025 తేదీ సోమవారం సాయంత్రం 5:30 ని||లకు జరిగే పెద్ద రథం తిరుణాల మరింత ప్రత్యేకమైనది.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరుణాల ఒక గొప్ప ఆధ్యాత్మిక వేడుక. ఈ తిరుణాలకు మతాలకతీతంగా చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా, రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. స్వామివారిని దర్శించుకోవడం, రథం లాగడంలో పాల్గొనడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తారు. భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు, స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఈ తిరుణాల ఒక పండుగ…

Read More

చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ఎంఎస్ షాది ఖానా వెనుక వైపున ఉన్న ఈనాడు ఉమర్ లేఔట్ నందు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్ అన్నారు.గతంలో పాదాచారులు దాహం వేస్తే ఇళ్లల్లో మంచినీరు అడిగి త్రాగే వారిని నేడు మారుతున్న పరిస్థితుల్లో అటువంటి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. మంచినీటి చలివేంద్రాలు అందుబాటులో ఉండటంవల్ల ఎంతోమంది బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి, పరిసర ప్రాంతాలలో పనుల కోసం వచ్చిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈనాడు ఉమర్ లేఅవుట్ నందు మంచినీటి చలివేంద్రం క్రమం తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట లైసెన్సుడు ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అధ్యక్షులు డేవిడ్, ఉపాధ్యక్షులు శ్యామ్, శ్రీనివాస్, ఫిరోజ్, సాయి, ఈనాడు ఉమర్ కుటుంబ సభ్యులు మరియు సాదిక్, బాజీ తదితరులు పాల్గొన్నారు..

Read More

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి నాదెండ్ల మండల కేంద్రమైన కనపర్రు గ్రామంలో కరెంటు షాకు తగిలి వ్యక్తి మృతి గ్రామానికి చెందిన మొగిలి రమేష్ మరియు ఆయన భార్య విజయలక్ష్మి శుక్రవారం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన అనంతరం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగా కరెంట్ షాక్ తగిలి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు చిలకలూరిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే రమేష్ మృతి చెందాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read More

వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి గ్రామంలో MSME పార్క్‌ను శంకుస్థాపన చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు ఈ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ పార్క్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరియు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Read More

వినుకొండ మండలం తిమ్మాయిపాలెం గ్రామంలోని రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

భారతదేశం మీద పాకిస్తాన్ జరిపే ఉగ్రవాద దాడులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు కల్పించాలని ఆపరేషన్ సింధూర్ విజయవంత0 కావాలని, భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పేరు మీద మరియు త్రివిధ దళాలు,, భారత సైన్యానికి మనోధైర్యాన్ని అందించాలని , దేశానికి విజయం చేకూర్చాలని దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలలో విజయ సంకల్ప పూజకు భారతదేశం పేరు మీద పూజలు నిర్వహించబడుచున్నవి. బాల త్రిపుర సుందరి సమేత నాగేశ్వరస్వామి దేవాలయం లో, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నందు పూజ కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి, కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, ఓ బి సి మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, BJYM రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్,మాజీ మండల అధ్యక్షులు పోత్తూరు బ్రహ్మానందం , సీనియర్…

Read More

దేవస్థానం చైర్మన్ గా భాస్కరరావు నియామకంచిలకలూరిపేట ::పట్టణంలోని మెయిన్ బజార్ నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా భాస్కర్ ఫ్యాన్సీ అధినేత గ్రంధి భాస్కరరావు గారు నియమితులయ్యారు. వీరి నియామకం పట్ల ఆర్యవైశ్య సంఘాల నాయకులు, పుర ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు

Read More

బాల్య వివాహాలతో మానసిక, శారీరక సమస్యలు– ఏసీడీపీవో నిర్మలారాణి– బోయపాలెం, ఉప్పరపాలెంలో అవగాహన సదస్సు యడ్లపాడు మండలంలోని బోయపాలెం, ఉప్పరపాలెం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం కిశోరి వికాసం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసిడిఎస్‌ ఏసీడీపీవో నిర్మలా రాని ముఖ్య అతిథిగా హాజరై పునరుత్పత్తి ఆరోగ్యం, బాల్యవివాహాల కారణంగా కలిగే దుష్ప్రభావాలపై గ్రామస్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మతృ,శిశు మరణాలను తగ్గించేందుకు బాల్యవివాహాలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వలన బాలికల శారీరక, మానసిక పరిస్థితులపై దుప్రభావాన్ని చూపుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ నిర్మలరాణి, సూపర్‌వైజర్‌ ఎం. జోజమ్మ, ఏఎన్‌ఎం ఏ. జోజి మేరీ, అంగన్వాడీ కార్యకర్తలు షేక్‌ జరీనా, వివి సుబ్బాయమ్మ, వి.ఆర్‌. కోటేశ్వరి, ఆశ వర్కర్లు షేక్‌ మస్తాన్‌బి తదితరులు పాల్గొన్నారు.

Read More

చిలకలూరిపేట పట్టణం 19వ వార్డు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరావతి సుభాని అనారోగ్యంతో మరణించగా ఈరోజు వారి నివాసం వద్ద ఉన్న వారి పార్దవదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని

Read More

ఈ నెల 12న చిలకలూరిపేట లో పెద్దరధం తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం అధికారులు. పెద్ద రథం తిరునాళ్ల కు ఈ ఏడాది అధిక సంఖ్య లో భక్తులు హాజర వుతారని అంచనా. కళామందిర్ సెంటర్ కొమరవల్లి పాడు లో వెంచేసి ఉన్నశ్రీ భూనీల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండుగ గా జరుగనుంది. ఈ నెల 12వ తేది సోమవారం సాయంత్రం 6గంటలకు పెద్దరధం తిరునాళ్ల ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవస్థానం లో స్వామి వారి కల్యాణమహోత్సవాలు జరుగుతున్నాయి. దేవస్థానం ప్రధాన అర్చకులు భావన్నారాయణ నెత్రుత్వం లో ఈ తిరునాళ్ల మహోత్సవ పూజలు కొనసాగుతున్నాయి.

Read More