చిలకలూరిపేట వైస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేసిన వైస్సార్సీపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నా మాజీ మంత్రి విడదల రజిని జూన్ 4వ తేదీకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా…. ఇంత వరకు పథకాలు అమలు చేయలేదని,మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. వైస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి ఉందని… కూటమి నేతల మోసల్ని తిప్పి కొడతామని… రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ తీరు కు వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాలు చేపడతామని విడదల రజిని తెలిపారు. నరసరావుపేట రోడ్ లోని రజిని ఇంటి వద్ద నుంచి ఈ ర్యాలీ బయలుదేరి…. NRT సెంటర్, భాస్కర్ సెంటర్, చౌత్ర, కళామందిర్,గడియార స్తంభం, విశ్వనాద్ సెంటర్ మీదగా తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. చిలకలూరిపేట తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు
Author: chilakaluripetalocalnews@gmail.com
పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య ..దూరం పెట్టిందని తీవ్ర మనస్తాపం చిలకలూరిపేట రూరల్ మురికిపూడి విషాదంచోటుచేసుకుంది. పెళ్లైన నెల రోజులకే భార్య తనను దగ్గరకు రానివ్వడం లేదనే తీవ్ర మనస్తాపంతో ఓ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మురికిపూడి గ్రామంలో జరిగింది.మురికిపూడికి చెందిన బొమ్మన బోయిన వీరాంజనేయులు (23) అదే గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. పెళ్లై నెల రోజులు గడుస్తున్నా భార్య తనను దగ్గరకు రానివ్వకపోవడంతో వీరాంజనేయులు తీవ్రంగా కుమిలిపోయేవారు. ఇదే విషయాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.పురుగుల మందు తాగిన విషయాన్ని వీరాంజనేయులు తన స్నేహితులకు తెలియజేశారు. వెంటనే వారు వీరాంజనేయులును పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మరణ వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.తన భార్య మరొక వ్యక్తిని ప్రేమించిన కారణంగా…
ఈజిప్టులో పర్యటిస్తున్న బృందం ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ప్రపంచ పర్యటన నిర్వహిస్తున్న అఖిలపక్ష బృందాల్లో ఒకటైన సుప్రియా సులే నేతృత్వంలోని బృందం ఈజిప్టులో పర్యటిస్తోంది. ముందుగా కైరోలోని జమాలెక్లోని అల్-హోర్రెయా పార్కులో మహాత్మా గాంధీ గారికి ఈ ప్రతినిధి బృందం నివాళులర్పించింది. ఈ బృందం ఆ దేశంలోని ప్రస్తుత, మాజీ మంత్రులు, ప్రముఖ రచయితలు, సమాజకర్తలు, నాయకులతో సహా ఈజిప్టులోని కీలక సంభాషణకర్తలతో కూడా చర్చలు జరుపుతోంది. ఉగ్రవాద నిరోధకతపై సన్నిహిత ద్వైపాక్షిక సహకారం గురించి వివరిస్తూ, దేశ సహకారాన్ని కోరారు.ఈ బృందంలో :ఎంపీలు.. సుప్రియా సులే, లావు శ్రీకృష్ణ దేవరాయలు, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనీష్ తివారీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, విక్రమ్జీత్ సింగ్ సాహ్నే, ఆనంద్ శర్మ, వి. మురళీధరన్, సయ్యద్ అక్బరుద్దీన్ (ఐక్యరాజ్యసమితికి భారతదేశ మాజీ శాశ్వత ప్రతినిధి) ఉన్నారు.
నాగర్జునసాగర్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీ కట్టిందనో, జవహర్ లాల్ నెహ్రు కట్టాడనో అనుకుంటున్నారు కదూ. కానీ అది పూర్తిగా తప్పు నాగర్జున సాగర్ డ్యామ్ ను నిర్మించింది వల్లుట్ల (గోత్రం) వాసిరెడ్డి గృహనామానికి చెందిన ముక్త్యాల సంస్థానానికి చెందిన శ్రీ రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ …. వీరి విగ్రహం కూడా ఈ డ్యామ్ పరిసరాల్లో నేటికీ ఉంటుంది. అసలు ఈ డ్యామ్ ను కట్టాలని ఆనాటి ప్రభుత్వానికి ఎంత మాత్రం ఆశక్తి లేదు. రాజా వారు లక్షల ఎకరాలు, కోటి రూపాయల డబ్బు ప్రభుత్వానికి దానంగా ఇచ్చేసరికి చివరికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మాచర్ల అటవీ ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు వెళ్ళడానికి రోడ్డు వేయించారు రాజా వారు. ప్రజలకు మంచి చెయ్యటం కోసం చరిత్రలో ఎన్నో లక్షల ఎకరాల భూములు, ఎంతో సంపదను దానం చేశారు. ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్రదేశంలో పేరు…
ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేత.చిలకలూరిపేట, నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశ్రీలక సభ్యుడు గజ్జ. శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అతడు జనసేన పార్టీ క్రియా శిలక సభ్యత్వం ఉండటం వలన పార్టీ నుండి ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు సోమవారం మంగళగిరిలోని ఆర్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా ఎమ్మెల్సీ శ్రీ కె .నాగబాబు గారు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ గారిని కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగ రాజా రమేష్ మాట్లాడుతూ దేశంలోనే రాజకీయ పార్టీల కార్యకర్తల బాగోగులు గురించి ఆలోచించే పార్టీ జనసేన అని…
రేపు కరెంటు కట్ చేసే ఏరియాలు రేపుచిలకలూరిపేట టౌన్ వన్ సెక్షన్ పరిధిలో విద్యుత్ లైన్లకు మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ప్రాంతాల వివరాలు ఇలా విద్యుత్ నిలిపివేత సమయం ఈ అంతరాయం పట్ల వినియోగదారులుసహకరించవలసిందిగా విద్యుత్ శాఖ తరపున ఆర్. అశోక్ కుమార్, డీఈఈ, చిలకలూరిపేట విజ్ఞప్తి చేశారు.
రేపు నాగార్జున సాగర్ వద్ద యోగాంధ్ర నరసరావు పేట,జిల్లాలోని ప్రముఖ పర్యాటక పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ వద్ద రేపు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకూ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా అవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. మే 28న ఇప్పటికే కోటప్పకొండపై సామూహిక యోగా నిర్వహించామన్నారు. జూన్ 11న కొండవీడు కోటపై, జూన్ 18న అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఈ నెల 5 న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నందు శంకు ప్రతిష్ట మహోత్సవం జరుగు చున్నది. ఈ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ని కోరిన గణపవరం అయ్యప్ప సేవా సంఘం మరియు అయ్యప్ప భక్తులు… ఈ ఆహ్వాన కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు మండలనేని వెంకటేశ్వర్లు, గురుస్వామి తులం పూర్ణచంద్రరావు , మాదినేని చంద్రమౌళి , కెల్లంపల్లి రెడ్డియ్య మాస్టర్ , సిద్దు హనుమంతరావు , అధికారి వెంకటేష్ , చక్రవరం శివరాజు తదితరులున్నారు.
సిద్ధి గణపతి, అభయాంజనేయస్వామి వార్ల గ్రామోత్సవంలో పాల్గొన్న ప్రత్తిపాటి శ్రీ సిద్ధిగణపతి, శ్రీ అభయాంజనేయస్వామి, సీతలాంబ తల్లి బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా తలపెట్టిన గ్రామోత్సవాన్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మంగళవారం యడ్లపాడు మండలం జగ్గాపురంలో జరిగిన గ్రామోత్సవంలో పాల్గొన్న ప్రత్తిపాటి ప్రజలతో కలిసి స్వామివార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన హోమంలో పాల్గొని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతం ప్రతిష్ఠా మహోత్సవ ఏర్పాట్లపై గ్రామస్తులు, కార్యక్రమాల నిర్వాహకులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, స్వామివార్ల అనుగ్రహాం లభించేలా శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా ప్రతిష్టామహోత్సవం నిర్వహించాలని ప్రత్తిపాటి సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, ముద్దన నాగేశ్వరరావు, వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కందిమళ్ళ రఘురామారావు, సుబ్బారావు, శంకర్రావు, గట్టినేని విజయ్ సాయి, పోపూరి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ముద్దన పార్థసారథి, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా… నరసరావుపేట నరసరావుపేట ఎమ్మెల్యే డా’చదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం వైసీపీ తీరు మారాలి తీరు మారకపోవటం వల్ల 11 సీట్లకి పరిమితం చేశారు మాజీ సీఎం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కి ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే అరవింద్ బాబు 2029లో కూడా నరసరావుపేట కి నేనే ఎమ్మెల్యేని మా నాయకుడు చంద్రబాబే సీఎం గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎవరినైనా ప్రశాంతంగా వుండనిచ్చారా ప్రజలు చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పినా వైసీపీ తీరు మారలేదు అమరావతికి పోలవరానికి మూడు రాజధానుల పేరిట తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా ఆలోచించుకోండి మీ హయాంలో మాచెర్లలో ఎన్ని హత్యలు జరిగాయి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు గోపిరెడ్డి రియల్ ఎస్టేట్ మున్సిపాలిటీలో నువ్వు చేసిన అవినీతి ప్రజలు మరిచి పోలేదు ఇండ్ల మీద పడి చేసిన దాడులను ప్రజలు గుర్తుపెట్టుకొనే ఉన్నారు ఇప్పటి కైనా మీలో మార్పురాకపోతే 11…









