తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా 14 వ వార్డులో కార్యవర్గ ఎన్నిక చిలకలూరిపేట తెలుగుదేశంపార్టీ సమస్థాగత ఎన్నికలలో మాజీ మంత్రి,రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షలు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా పట్టణంలోని 14 వార్డులో నూతన కార్యవర్గoను ఎన్నుకోవడం జరిగింది.14 వ వార్డుకు అధ్యక్షులుగా బాజీ (Army) , ప్రధాన కార్యదర్శిగా షేక్ బారిసైదా , ఉప అధ్యక్షులుగా పసుపులేటి రమేష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, టీడీపీ కరిముల్లా,పఠాన్ సమద్, మద్దుమల రవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ముల్లా కరీముల్లా,యూనిట్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ బీడింగ్ కరీముల్లా, బూత్ కన్వీనర్ ఇబ్రహీం,ITDP సభ్యులు అబూబకర్ సిద్ధిఖ్, అన్వర్ పాల్గొన్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ గిరిప్రదక్షిణలో అపశృతి. గిరిప్రదక్షిణ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి భక్తుడు ప్రసాదు 51 మృతి మృతుడు ప్రసాదు స్వగ్రామం చిలకలూరిపేట పురుషోత్తపట్నం ప్రతి పౌర్ణమి రోజు జరిగే కోటప్పకొండ గిరిప్రదక్షిణ. గుండెపోటు రావడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్న తోటి భక్తులు. భక్తులు స్పందించి CPR చేసిన ఫలితం లేకపోయింది
చిలకలూరిపేట:సీఆర్ క్లబ్,చిలకలూరిపేట కళాపరిషత్, సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 16,17,18 తేదీలలో తెలుగు రాష్ట్రాల స్థాయి తొమ్మిదవ ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు శుక్రవారం రాత్రి నాటిక పోటీలు ప్రారంభమౌతాయి. మొదటి రోజు నాటిక పోటీలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించనున్నారు. మొదటి రోజు హైదరాబాద్ కళాంజలి వారి రైతే రాజు నాటిక, చిలకలూరిపేట కు చెందిన మద్దుకూరి ఆర్ట్ క్రియేషన్ వారి మా ఇంట్లో మహాభారతం నాటిక, హైదరాబాద్ యవభేరి వారి నా శత్రువు నాటిక ప్రదర్శించనున్నారు. రెండోవ రోజు 17వ తేదీ శనివారం రాత్రి హైదరాబాద్ మిత్ర క్రియేషన్స్ వారి ఇది రహదారి కాదు నాటిక, కరీంనగర్ , కళాభారతివారి చీకటిపువ్వు, విశాఖపట్నం భద్రం పౌండేషన్ వారి దొందు దొందే నాటిక లు ప్రదర్శించనున్నారు. మూడో రోజు ఆదివారం 18 తేదీ గుంటూరుకు చెందిన అమరావతి ఆర్డ్స్ వారి చిరుగుమేఘం, చిలకలూరిపేటకు…
చిలకలూరిపేట:పట్టణంలోని కొమరవల్లిపాడులో వేంచేసియున్న శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రాచీన కాలం నుంచి ప్రాముఖ్యత కలిగి ఉన్నది. 1712వ సంవత్సరంలో చిలకలూరిపేట జమీందారులైన రాజామానూరి వంశీకులు ఆలయాన్ని నిర్మించారు. పట్టణానికి పక్కనే ఉన్న పసుమర్రు గ్రామంలో ఒక ఇంట్లో కాకర పొద తవ్వుతుండగా స్వామివారి విగ్రహం దొరికినదని నానుడి. ఈ విగ్రహాన్ని యడ్లపాడు మండలంలోని చెంఘీజ్ఖాన్పేటలో ప్రతిష్టించేందుకు తీసుకువెళుతుండగా కొమరవల్లిపాడు చేరుకోగానే అక్కడ నుంచి స్వామివారు కదలలేదని ఆ రాత్రి కలలో జమీందార్కు కనిపించి ఇక్కడే ప్రతిష్టించమని కోరినట్లు ఆలయ చరిత్ర తెలుపుతున్నది. దీంతో స్వామివారి విగ్రహంతోపాటు జమీందారుల ఇలవేల్పు అయిన శ్రీఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. దీంతోపాటుగా స్వామివారికి పెద్దరథం నిర్మించారు. పెద్దరథం నిలిపేందుకు గడియారం స్థంబం సెంటర్లో 1918వ సంవత్సరంలో పెద్దరథశాల నిర్మించారు. అప్పటి నుంచి స్వామివారు ఒకచేత శంఖాన్ని, మరోచేత చక్రాన్ని ధరించి లక్ష్మీదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ పాలక వర్గ సభ్యులైన గోరంట్ల బాపయ్య 1986లో గాలిగోపురం…
ప్రజల అభివృద్ధికి సమాచారమే పునాది. ముఖ్యంగా స్థానిక సమాచారం సక్రమంగా అందకపోతే ప్రజలు తమ హక్కులు, అవకాశాలు గురించి పూర్తిగా తెలుసుకోలేరు. ‘చిలకలూరిపేట లోకల్ న్యూస్’ అనే వెబ్సైట్ ఏర్పాటు చెందింది ఇదే అవసరాన్ని గుర్తించి – చిలకలూరిపేట పట్టణానికి సంబంధించిన వార్తలు, సంఘటనలు, విశేషాలు, ప్రభుత్వ సమాచారాన్ని నిఖార్సైన నిజాయితీతో ప్రజల ముందుకు తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ వెబ్సైట్ ఒక వార్తా వేదిక మాత్రమే కాదు – ఇది చిలకలూరిపేట ప్రజల గొంతుక, అనుభూతుల అద్దం, స్థానిక ప్రజల హక్కులకు రూపం. చిన్న విషయమైనా సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తే, అది మా వార్తల్లో ప్రాధాన్యత పొందుతుంది. చిన్న వ్యాపారులు, యువత, మహిళలు, ఉద్యోగార్థులు, వృద్ధులు – ప్రతి వర్గానికి ఉపయుక్తమైన సమాచారం అందించాలన్నదే మా సంకల్పం. ప్రపంచం ఎంత విస్తరించినా, ప్రతి మనిషికి తన ప్రాంతం, తన గడప ముందర జరిగే సంగతులే ముందుగా…
మాచర్లలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఈ సోమవారం (12.05.2025) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను మాచర్ల పట్టణంలో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. సోమవారం ఉదయం 10.00 గం.లకు నెహ్రూ నగర్ లోని వివియన్ గార్డెన్స్ నందు పీజీఆర్ఎస్ ప్రారంభమవుతుందన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నియోజక వర్గాల స్థాయిలో నిర్వహించదలిచామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే చిలకలూరి పేట, నరసరావు పేట నియోజక వర్గాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పుడు మాచర్లలో పీజీఆర్ఎస్ అవకాశాన్ని నియోజక ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల ధర్నా—-రైతుల ధర్నా యడ్లపాడు మండలం తహసీల్దారు కార్యాలయం వద్ద 12-05-2025 , సోమవారం, ఉదయం 10 గంటలకు రైతుల ధర్నా .రైతులు, రైతునాయకులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రైతుల పంటలకు న్యాయమైన ధరరావాలనే వారంతా ధర్నా లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం.మన కోర్కెలు
శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరు నాదెండ్ల మండలం జంగాలపల్లి లో వైఎస్ఆర్సిపి కు చెందిన శ్రీకాంత్ రెడ్డిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేసి ఆదివారం చిలకలూరిపేట కోర్టులో హాజరు పరిచారు. శ్రీకాంత్ రెడ్డి కి బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి. మూడు రోజుల్లో సూరీటీ లు సమర్పించవలసిందిగా ఆదేశించినట్లు తెలిసింది…
[5:14 PM, 5/11/2025] aapstatekapunadu99: పల్నాడు జిల్లా పోలీస్ నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి SRKT నందు కార్డెన్ సెర్చ్ … నరసరావుపేట డి.ఎస్.పి అయిన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 సిఐ లు,14 మంది ఎస్సైలు, పోలీసు సిబ్బంది మరియు ANS సిబ్బందితో కలిసి ఈరోజు తెల్లవారుఝామున 4.30 గంటల నుండి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు… ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 41 మోటార్ సైకిల్లు, 1 కారు,1 ఆటో 10 రాడ్లు,కత్తులు పోలీసులు గుర్తించారు …ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 41 మోటార్ సైకిల్లు, 1 కారు,1 ఆటో 10 రాడ్లు,కత్తులు పోలీసులు గుర్తించారు … నరసరావుపేట రూరల్ పోలీస్టేషన్ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్…
చిలకలూరిపేట మండలం, కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన గుత్తా శ్రీనివాసరావు గారి కుమారుని వివాహం సందర్భంగా ఈరోజు వారి ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా అక్కడికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్మోహన్ గారు , గ్రామ నాయకులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.









