10కేసులు నమోదు….1800రూపాయలు ఫైన్ చిలకలూరిపేట పట్టణంలో వాహనాలు తనిఖీ క్షుణ్ణంగా పరిశీలించిన అర్బన్ SI చేన్నకేసువులు బృందం పట్టణంలో ని కళామందిర్ సెంటర్, NRT సెంటర్, గడియార స్తంభం సెంటర్ లలో బైక్లు తనిఖీ వాహనాలు కు సంబంధించి సరైన పత్రాలు, లైలెన్స్ లేని వాహనాలు కు జరిమానా విధించారు. 10కేసులు ఫైల్ చేసి, వారి వద్ద నుంచి 1800 రూపాయలు ఫైన్ వేశారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
పేదలకు పెన్నిధి.. సీఎం సహాయ నిధి : చీఫ్ విప్ జీవి సీఎం సహాయనిది పేదల పాలిటి పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 101 మంది లబ్ధిదారులకు, 52,54,652 లక్షలు చెక్కులను శుక్రవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి గారు పంపిణీ చేశారు. వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించిన నిధులు, తమకు అందేలా కృషిచేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారికి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు నాయకులు పాల్గొన్నారు.
చిలకలూరిపేటలో మహా న్యూస్ కి, వాసుకి బాధ్యతలు ప్రముఖ టీవీ ఛానల్ మహా న్యూస్ కి చిలకలూరిపేట నియోజకవర్గ రిపోర్టర్ గా బాధ్యతలు తీసుకున్న మా మిత్రుడు బొందలపాటి వాసుకి ముందుగా శుభాకాంక్షలు… ఈ సందర్భంగా వాసు, మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, వాసుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా మహా న్యూస్ కి వార్తలు ఇచ్చేలా వాసు తమ బాధ్యతలను నిర్వర్తించాలని భవిష్యత్తులో మహా న్యూస్ లో మరెన్నో బాధ్యతలు తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పుల్లారావు తెలిపారు.
పంచాయతీ ల అభివృద్ధి కి నిధులు మంజూరు-కమిషనర్ కృష్ణ తేజ గణపవరం గ్రామంలో పర్యటించి న పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ గణపవరం గ్రామంలో నెలకొన్న సమస్యల పై గ్రామస్తులు తో చర్చ, పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి గణపవరం గ్రామం చిలకలూరిపేట మున్సిపాలిటీ తో విలీన మైనప్పటి నుంచి నేటి వరకు వివిధ రకాల సమస్యలు తో ఇబ్బందులు పడుతున్నా గ్రామస్తులు త్రాగునీటి ఇబ్బందులు సమస్యను కమిషనర్ కృష్ణ తేజ దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు, గ్రామానికి వాటర్ సరఫరా చేసే వాటర్ బెడ్లను, సమ్మర్ స్టోరేజ్ ట్యాన్క్ లను పరిశీలించి న కమిషనర్ కృష్ణ తేజ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి సమస్య పరిష్కరించి, గణపవరం గ్రామానికి ఇబ్బందులు లేకుండా చూడాలని పంచాయితీ రాజ్ అధికారులు ను, ఎంపీడీఓ లను ఆదేశించిన- కమిషనర్ తేజ అదేవిధంగా మానుకొండ వారి పాలెం గ్రామంలో వాటర్ ట్యాన్క్ నిర్మాణం పనులు త్వరితగతిన మొదలు పెట్టాలని…
మున్సిపల్ నిధుల స్వాహాలో విడదల రజనీ పాత్రపై సమగ్ర విచారణ జరిపించండి ఇటీవల చిలకలూరిపేట మున్సిపాలిటీలో వెలుగుచూసిన నిధుల స్వాహాలో మాజీమంత్రి రజనీ, అమె మరిది గోపిలే అసలు దోషులని, వారి పాత్ర, ప్రమేయం తేలాంటే నిదులు కాజేసి పరారైన ఇక్తుర్తి గంగాభవాని, ఆమె భర్త పవన్ లను విచారించాలని స్థానికుడు షేక్ మాబు సుభాని మరియు స్థానికులు మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని కోరారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాజీమంత్రి ప్రత్తిపాటి ప్రజావేదిక నిర్వహిం చారు.
నరసరావుపేటలో ప్రజా సమస్యల ప్రజావేదిక పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ నరసరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజావేదిక (PGRS) కార్యక్రమన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు నియోజకవర్గంలోని ప్రజల వద్ద నుండి వినతి పత్రాలను అందుకున్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు ప్రజల సమస్యలు తెలుసుకొనుటకు ప్రజా వేదిక నిర్వహిస్తున్నామని ప్రజా వద్ద నుండి పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తున్నాయని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు వచ్చే నెల నుండి రైతులకు 20.000/- రూపాయల ఆర్ధిక…
యడ్లపాడు–1 సచివాలయాన్ని సందర్శించిన తహశీల్దార్– రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి పరిశీలన యడ్లపాడు మండల తహశీల్దార్ జెట్టి విజయశ్రీ గురువారం యడ్లపాడు–1 సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై అక్కడి సిబ్బందితో సమావేశమై దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత నిర్ణయం తదితర ప్రక్రియలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతికుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేయాలని, అనర్హుల వద్ద నుంచి పథకాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్న విషయాన్ని విస్మరించ వద్దన్నారు. రేషన్కార్డుల మంజూరుపై సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఆమె వెంట ఉపతహశీల్దారు అనురాధ, మండల రెవెన్యూ ఇన్సె్పక్టర్ సుబ్బారావు, వీఆర్వో కేఏ చారి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6 స్వాతిప్రియ, జీఎంఎస్కే రేవతి తదితరులు ఉన్నారు.
నేడు పోలేరమ్మ తల్లి జాతర ఈ నెల23,24తేదీ లలో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం కమిటీ సభ్యులు రెండు రోజులు పూజలు అనంతరం ఈ నెల 26వ తేదీ సోమవారం రాత్రి మహా అన్నదాన కార్యక్రమం పట్టణంలో ని బొందిలి పాలెం లో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థాన జాతరకు సర్వం సిద్ధం రెండు రోజుల పాటు పోలేరమ్మ తల్లికి విశేష పూజలు జరిపేందుకు సిద్ధంగా ఉన్న భక్తులు రంగు రంగుల విద్యుత్ కాంతులు తో దేవస్థానం ప్రాంగణం
కొన్ని సమస్యలకు పరిష్కారం ముందుగా మేల్కొవటమే. రానున్న సమస్యను ముందుగా గుర్తించి వాటిని పరిష్కరించటమే. ఇందుకు అధికారులకు కావల్సింది ముందు చూపే. ఆ చూపు కరువైనప్పుడు ప్రజలకు ఇక్కట్లు తప్పవు. 2013 అక్టోబర్లో వచ్చిన అకాలవర్షాలు పట్టణాన్ని ముంచెత్తాయి. జనజీవనం అస్థవ్యస్థమైంది. పట్టణ నడి బొడ్డున గడియారస్థంబం సెంటర్, మార్కెట్ సెంటర్లో సైతం వర్షపు నీరు దుకాణాల్లో చేరి లక్షలాది రూపాయాల నష్టం మిగిల్సింది. లోతట్టు ప్రాంతాలల్లో గుడిసెలు నీట మునిగి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు అంతా అయిపోయాక అధికారులు ఇందుకు గల కారణాలేమిటని ఆరా తీసారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రధాన కాల్వల్లో పూడికలు తీయకపోవటమే అని గుర్తించారు. చిన్నపాటి వర్షాలకే చిలకలూరిపేట ముంపుకు గురౌతుంది. ఇందుకు కారణమేమిటి..? ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయట పడే అవకాశం ఉంది.పట్టణంలో గమ్యం లేని కాల్వలు, కాల్వలను ఆక్రమించుకొని కట్టిన భవనాలు, పూడికలు తీయక వదిలివేయటం, శిధిలమైన కాల్వలతో…
ఇప్పుడు సీజన్ మారింది.. . వానలు మొదలయ్యాయి. వానాకాలంలో వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, మలేరియా, చికెన్గున్యా, కామెర్లు, డెంగీ తదితర వ్యాధులు సులబంగా వ్యాపించే ప్రమాదం ఉంది.సమావేశాలు పెడితే సరిపోతుందా..పట్టణం గతం కంటే విస్తరించింది. గతంలో 34వార్డుల్లోనే పారిశుధ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు 38 వార్డుల సువిశాలమైన పట్టణం పారిశుధ్య సమస్య జఠిలంగానే ఉంది. సీజన్ వ్యాధులపై మున్సిపల్ అధికారులు సమావేశం పెట్టి మమ అని పించారు. ఇంతటితో తమ పని అయిపోయిందనిపించుకున్నారు. పారిశుద్ద్యంపై నిర్లక్ష్యం వీడాలి. వర్షాలు కురుస్తున్నా అధికారులు పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోకపోవడం, అనేక ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. గత ఏడాది డెంగీవ్యాది లక్షణాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొంతమంది మృత్యువాత పడ్డారు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పలు ప్రాంతాల్లో నీటి కాలుష్య సమస్య ఉంది. లీకులతో కలుషిత నీరు సరఫరా అవుతుంది. అధికారులు వెంటనే స్పందించకుంటే పెను ప్రమాదం పొంచి…









