గత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ఫలితాలే ఈ బలవన్మరణాలు – తెదేపా నేతలు
నాదెండ్ల గ్రామం మరియు నాదెండ్ల మండలంలోని తుబాడు గ్రామంలో ఇరువురు రైతులు సోమవారం బలవన్మరణానికి పాల్పడటానికి కారణం గత వైకాపా ప్రభుత్వం పాలించిన 5 సంవత్సరాలలో , వారు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలే కారణం అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజిని మరియు వైకాపా నేతలు ఇటివల కొద్ది కాలం నుండి శవ రాజకీయాలు మొదలు పెట్టారని, గత 5,6 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ, నష్టాల పాలై అప్పుల ఊబిలోకి కూరుకుపోయి, తప్పని పరిస్థితులలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు ఏ విధంగా సాయం అందించి ఆదుకోవాలి అనే స్పృహ కోల్పోయి, కేవలం పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఎవరూ చనిపోయిన రైతులను పరామర్శించలేదు, ఆదుకోలేదు అని అవాకులు, చవాకులు పెడుతుందని వారు తెలిపారు. ఇరువురు రైతుల ఆత్మహత్యల పట్ల మాజీ మంత్రి వర్యులు, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తన సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసారని, పార్టీ నేతలను తక్షణమే వెళ్లి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన సాయాన్ని వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలనని కోరారు
Trending
- చిలకలూరిపేట మండలం పోతవరం, మద్దిరాల గ్రామాల్లో విజయవంతంగా “రెండేళ్ల పాలన” కార్యక్రమం
- మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గోవధ నిషేధ చట్టంపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పల్నాడు జిల్లా పర్యటక అభివృద్ధి గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- చిలకలూరిపేట పట్టణం 9వ వార్డులో ఘనంగా ప్రారంభమైన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమం
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ
- బ్యాంకుల సహకారంతోనే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. ప్రత్తిపాటి
- పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి



