గత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ఫలితాలే ఈ బలవన్మరణాలు – తెదేపా నేతలు
నాదెండ్ల గ్రామం మరియు నాదెండ్ల మండలంలోని తుబాడు గ్రామంలో ఇరువురు రైతులు సోమవారం బలవన్మరణానికి పాల్పడటానికి కారణం గత వైకాపా ప్రభుత్వం పాలించిన 5 సంవత్సరాలలో , వారు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలే కారణం అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజిని మరియు వైకాపా నేతలు ఇటివల కొద్ది కాలం నుండి శవ రాజకీయాలు మొదలు పెట్టారని, గత 5,6 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ, నష్టాల పాలై అప్పుల ఊబిలోకి కూరుకుపోయి, తప్పని పరిస్థితులలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు ఏ విధంగా సాయం అందించి ఆదుకోవాలి అనే స్పృహ కోల్పోయి, కేవలం పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఎవరూ చనిపోయిన రైతులను పరామర్శించలేదు, ఆదుకోలేదు అని అవాకులు, చవాకులు పెడుతుందని వారు తెలిపారు. ఇరువురు రైతుల ఆత్మహత్యల పట్ల మాజీ మంత్రి వర్యులు, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తన సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసారని, పార్టీ నేతలను తక్షణమే వెళ్లి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన సాయాన్ని వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలనని కోరారు
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



