గత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ఫలితాలే ఈ బలవన్మరణాలు – తెదేపా నేతలు
నాదెండ్ల గ్రామం మరియు నాదెండ్ల మండలంలోని తుబాడు గ్రామంలో ఇరువురు రైతులు సోమవారం బలవన్మరణానికి పాల్పడటానికి కారణం గత వైకాపా ప్రభుత్వం పాలించిన 5 సంవత్సరాలలో , వారు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలే కారణం అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజిని మరియు వైకాపా నేతలు ఇటివల కొద్ది కాలం నుండి శవ రాజకీయాలు మొదలు పెట్టారని, గత 5,6 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ, నష్టాల పాలై అప్పుల ఊబిలోకి కూరుకుపోయి, తప్పని పరిస్థితులలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు ఏ విధంగా సాయం అందించి ఆదుకోవాలి అనే స్పృహ కోల్పోయి, కేవలం పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఎవరూ చనిపోయిన రైతులను పరామర్శించలేదు, ఆదుకోలేదు అని అవాకులు, చవాకులు పెడుతుందని వారు తెలిపారు. ఇరువురు రైతుల ఆత్మహత్యల పట్ల మాజీ మంత్రి వర్యులు, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తన సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసారని, పార్టీ నేతలను తక్షణమే వెళ్లి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన సాయాన్ని వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలనని కోరారు
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు
- ప్రజల కోసం ఇంటింటి జనగణనపై యానిమేటర్లకు ప్రత్యేక శిక్షణ.. హాజరైన అధికారులు.
- అనితర సాధ్యుడు అజరామరుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- యడవల్లి వద్ద జరిగిన సంఘటనలో అనుమానస్పద మృతిగా శ్రీరామ హరిప్రసాద్ న్యాయవాది
- జనగణన 2027 పై శిక్షణ తరగతులు ప్రారంభం



