Author: chilakaluripetalocalnews@gmail.com

నిస్వార్థ సేవకు నీరాజనం ‘ప్రదాత’గా చరణ్ తేజ ప్రకటించిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల కంటే సామాజిక బాధ్యతకు, నిస్వార్థ సేవకు పెద్దపీట వేశారు. చిలకలూరిపేట యువ నాయకుడు చరణ్ తేజ విద్యార్థుల కోసం సాగిస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ‘ప్రదాత’ – ఆ బిరుదు వెనుక ఉన్న అంతరార్థం సాధారణంగా రాజకీయాల్లో పదవులు, హోదాలు సహజం. కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చరణ్ తేజను ‘ప్రదాత’ అని సంబోధించడం వెనుక లోతైన కారణం ఉంది. ఏ ప్రతిఫలం ఆశించకుండా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న చరణ్ తేజ తీరును ఈ పదం ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు. “స్వార్థం లేని సేవ ఎప్పుడూ గుర్తింపు పొందుతుంది. విద్యార్థుల కోసం చరణ్ తేజ పడుతున్న…

Read More

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ భాగంగా పల్నాడు జిల్లా కార్యాలయం లొ పిర్యాదు ఇవ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి నేతృత్వంలో 17-02-2026 వ తేది మంగళవారం రోజున నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం లొ dpro గారికి పల్నాడు జిల్లా లొ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది . వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులు ఈ సమస్యపై నివేదికను ప్రభుత్వం వారికి మరియు ముఖ్య మంత్రినారా చంద్రబాబు నాయుడు గారికి సమస్యపై నివేదిక పంపిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనతా వారధి జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ…

Read More

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో గురువారంజరిగిన జనతా వారధి కార్యక్రమ సందర్బంగా దూర్గి మండలం పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 12-02-2026 వ తేది గురువారం రోజున దుర్గి మండలం లో జరిగిన జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రజల వద్దనుండి పిర్యాదులు స్వీకరించి ప్రజల వద్ద నుండి వచ్చిన పిర్యాదుల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ అధికారులు తో మాట్లాడి త్వరతాగతిన పరిష్కారం చేయాలని బీజేపీ నుండి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లొ జనతా వారధి కో కన్వినర్ మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు గంజార్ల ఆదిలక్ష్మి మరియు బీజేపీ స్థానిక…

Read More

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ పంజా.. అచ్చంపేటలో భారీగా బియ్యం స్వాధీనం. పల్నాడు జిల్లా అచ్చంపేటలో 82 బస్తాల (37.25 క్వింటాళ్లు) PDS బియ్యం సీజ్. సీతారాంపురం వాగు వద్ద నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. అక్రమ వ్యాపారం చేస్తున్న ముండ్రు వీరభద్రరావుపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం. నిందితుడిపై ఈసీ యాక్ట్ (6A) కింద కేసు నమోదు చేసిన అధికారులు. గత వారం భట్టిప్రోలులో 404 బస్తాల బియ్యం సీజ్.. నేడు అచ్చంపేటలో వరుస దాడులు. రేషన్ మాఫియాపై విసృత తనిఖీలు చేపట్టిన గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ బృందం.

Read More

పేట పట్టణంలో ఆక్రమణలు బోర్డులకే పరిమితమైన నిబంధనలు! చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి అధికారులు చేపట్టిన చర్యలు “మూడు రోజుల ముచ్చట”గా మారుతున్నాయి. నర్సరావుపేట సెంటర్ నుండి రిజిస్టర్ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణ, ఆక్రమణల నివారణ కోసం ఏర్పాటు చేసిన బోర్డులు నేడు కేవలం అలంకారప్రాయంగా మిగిలాయి.అట్టహాసంగా మార్కింగ్.. ఆపై మౌనంకొద్ది రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు నర్సరావుపేట సెంటర్ నుంచి రిజిస్టర్ ఆఫీస్ వరకు రహదారికి ఇరువైపులా ఆక్రమణలు జరగకుండా స్పష్టమైన మార్కింగ్ ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల మొదటి పది రోజులు రహదారి ఎంతో విశాలంగా, వాహనాల రాకపోకలకు అనువుగా కనిపించింది.అద్దె దందా: ఆక్రమణలే ఆదాయ మార్గంనిబంధనలు అమలులోకి వచ్చిన కొద్ది రోజులకే పరిస్థితి మళ్ళీ మొదటికి చేరింది. షాపుల యజమానులు తమ షాపుల…

Read More

పదవీ గండమే టీమ్ 11 ను అసెంబ్లీ గడప తొక్కిస్తోంది : ప్రత్తిపాటి “ పదవీ గండమే టీమ్ 11ను అసెంబ్లీ గడప తొక్కేలా చేస్తోంది. తమను గెలిపించిన ప్రజల్ని పట్టించుకోని ప్రజాప్రతినిధుల్ని ఉపేక్షించకూడదన్న స్పీకర్ నిర్ణయమే.. జగన్ & టీమ్ ను ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చేలా చేసిందనే చెప్పాలి. ఉన్న ఎమ్మెల్యే పోస్టు కూడా ఊడితే.. ప్రజల్లో మరీ చులకన అవుతామన్న భయంకూడా మరో కారణం. ప్యాలెస్ లు, విలాసాలపై ఉన్న మోజులో పదోవంతు కూడా జగన్ కు ప్రజాసమస్యలపై లేకపోవడం విచారకరం. ఎన్నికలప్పుడు తప్ప మరెప్పుడూ తనకు ప్రజలతో పనిలేదని తన చర్యలతో జగన్ పదేపదే నిరూపిస్తున్నాడు. గతంలో తమకు జీతాలతో పనిలేదు…స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా వుయ్ డోంట్ కేర్ జగన్.. ఇప్పుడు ఏ ఉద్దేశంతో, ఎవరిని ఉద్దరించడానికి అసెంబ్లీకి వస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. వైసీపీ నేతలు ఆందోళన చెందాల్సింది జగన్ భద్రతపైకాదు..ప్రజల భద్రతపైతనను దారుణంగా…

Read More

కొండవీడు ఉత్సవాల ముగింపు ప్రత్యేక కథనం చరిత్రను వర్తమానానికి అన్వయించి.. కొండవీడు ఉత్సవాల నిర్వహణతో ప్రత్తిపాటి తన సమర్థత చాటుకున్నారు : బీసీ జనార్ధన్ రెడ్డి14వ శతాబ్దంలో రెడ్డిరాజులు నిర్మించిన కొండవీడు కోటను ప్రత్తిపాటి నేడు పునర్నిర్మించారు : డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు తరచూచెప్పే మాటను మాజీమంత్రి ప్రత్తిపాటి ఆచరణసాధ్యం చేశారని, గతాన్ని విస్మరించకుండా, ఆ జ్ఞాపకాలు, అనుభవాలతో వర్తమానాన్ని సంతోషంగా మార్చుకోవాలనే సీఎం సూచనను కొండవీడు ఉత్సవాల నిర్వహణతో ప్రత్తిపాటి నిజం చేశారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి అంబరాన్నంటేలా సాగిన కొండవీడు ముగింపు ఉత్సవాల వేడుకకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో కొండపైకి వెళ్లడానికి మంత్రి, డిప్యూటీ స్పీకర్…

Read More

కొండవీడు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో ప్రత్తిపాటి అభినవ అణిపోతారెడ్డిగా నిలిచారు: కందుల దుర్గేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల కృషి వల్లే రాష్ట్రంలో ఈ 18 నెలల్లో అనేక ఉత్సవాలు నిర్వహించామని, ప్రజల జీవితాల్లో కూడా ఉత్సవ వాతావరణ కనిపిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేశ్ తెలియచేశారు. ఈ తరహా ఉత్సవాలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయన్నారు.ఆదివారం ఆయన కొండవీడు ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా హాజరై, కొండపైన..దిగువన ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికాశుక్లా, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావుతో కలిసి వీక్షించారు. అనంతరం కొండపైన ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగాన్ని వైవీ సుబ్బారెడ్డే అంగీకరించారుతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించింది…

Read More

ప్రముఖ శైవ క్షేత్రంగా పేరుగాంచిన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్రప్రసాద్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు స్వామివారి సన్నిధికి విచ్చేసిన ఆయనకు బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు ఆలయ ప్రాంగణంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రికోటేశ్వర స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలలో సినీ నటుడు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కోటప్పకొండ వైభవం, మహాశివరాత్రి తిరుణాళ్ల సందర్భంగా చేపడుతున్న విస్తృత ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు రాజేంద్రప్రసాద్‌కు వివరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 20 నుంచి 25 లక్షల మంది భక్తులు కోటప్పకొండకు విచ్చేసే అవకాశముందని తెలిపారు.

Read More

చిలకలూరిపేటలో వినూత్న మోసం: వ్యాపారులు జాగ్రత్త చిలకలూరిపేట: పట్టణంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక వ్యాపారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వేల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఒక చికెన్ సెంటర్‌లో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందంటే?మున్సిపాలిటీ గదుల్లో చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్న దస్తగిరి అనే వ్యాపారి వద్దకు ఒక వ్యక్తి సూటు, బూటు ధరించి నాగరికుడిలా వచ్చాడు. తొలుత రూ. 1000 విలువైన మాంసాన్ని కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లించాడు. ఆ డబ్బులు ఖాతాలో జమ కావడంతో వ్యాపారి అతడిని నమ్మాడు.ఆ తర్వాత, తనకు అత్యవసరంగా నగదు కావాలని, మీ ఖాతాకు రూ. 20,000 పంపిస్తానని, అది చూసుకుని తనకు నగదు ఇవ్వాలని సదరు వ్యక్తి కోరాడు. వ్యాపారి సరేననడంతో, తన మొబైల్‌లో డబ్బులు పంపినట్లుగా ‘సక్సెస్‌ఫుల్’ అని మెసేజ్ చూపించాడు. వ్యాపార తొందరలో ఉన్న దస్తగిరి, ఆ…

Read More