పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసిన పల్నాడు జిల్లా జనతా వారిది టీం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలుషితమైన నీటి సమస్యపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది

గత ప్రభుత్వంలో వివక్షతకు గురైన కలుషిత నీటి సమస్యపై పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నబాట్ల ఆదిత్య పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నార్స శ్రీనివాసరెడ్డి రాష్ట్ర యువ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ వంకాయలపాటి వంశీధర్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వారికూటి రాజేశ్వరరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ చిలకలూరిపేట ఉపాధ్యక్షులు కోట చంద్ర చిలకలూరిపేట మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది

సదరు ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ గారు వెంటనే బిజెపి ఆధ్వర్యంలో ఇచ్చిన ఫిర్యాదును పలనాడు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి ఆర్ డబ్ల్యు ఎస్ డిపార్ట్మెంట్ వారికి పంపించడం జరిగింది

విషయం : కలుషిత తాగునీటి వల్ల వ్యాధుల వ్యాప్తి, రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర నీటి శుద్ధి కార్యక్రమం చేపట్టాలి
…..భారతీయ జనతా పార్టీ డిమాండ్

రాష్ట్రంలో కలుషిత తాగునీటి కారణంగా వ్యాధుల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని బిజెపి వినతి.

భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం జనతా వారధి ద్వారా గ్రామాలు నగరాల్లో పర్యటనలు చేయగా త్రాగు నీరు ద్వారా వ్యాధుల వ్యాప్తి పై ప్రజల నుంచి ఆందోళన కనిపిస్తుంది. ప్రజలు పెద్దఎత్తున మాకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగునీటి కలుషితం కారణంగా డయేరియా, కలరా, సీజనల్ జ్వరాలు వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు పలుచోట్ల నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కలుషిత తాగునీటి కారణంగా పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరడం మరియు మరణాలు కూడా చోటు చేసుకోవడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం.

అధికారిక నివేదికలు మరియు ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం 2019 నుంచు 2024 వరకు కలుషితం త్రాగు నీరు ద్వారా వచ్చే వ్యాధుల పెరగడమే కాకుండా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. 2024 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా నీటి ద్వారా వ్యాధి వ్యాప్తి ఘటనలు సుమారు 59 వరకు నమోదయ్యాయి. 2025 సంవత్సరంలో ఇటువంటి ఘటనలు 21 నమోదు అయ్యాయి, వీటిలో వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు మరియు కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. 2026 సంవత్సరంలో కూడా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇటువంటి ఘటనలు నమోదవుతున్నాయి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్దఎత్తున డయేరియా వ్యాప్తి జరిగింది. ఈ ఘటనలో 70 నుంచి 100 మందికి పైగా ఆసుపత్రిలో చేరారు. ఒక మరణం నమోదైంది. సుమారు 20 జిల్లాల్లో త్రాగునీరు ద్వారా వ్యాధులు గుర్తించబడ్డాయి. అంతే కాదు అధికారిక ఘనాంకాలలో 10% మాత్రమే నమోదవుతున్నాయి. త్రాగునీటి ద్వారా వచ్చే వ్యాధిని ఎదుర్కున్న వ్యక్తిగత ఘటనలు నమోదు అవ్వడం లేదు

ఇలాంటి ఘటనలు ప్రధానంగా ఈ క్రింది కారణాల వల్ల జరుగుతున్నట్లు కనిపిస్తోంది అని మా బిజెపి నాయకుల ” జనతా వారధి” పర్యటనలలో గమనించాము.

  • పాత మున్సిపల్ తాగునీటి పైపులైన్లు లీక్ అవడం
  • డ్రైనేజ్ నీరు తాగునీటి పైపుల్లో కలవడం
  • పట్టణాలు మరియు గ్రామాల్లో శుభ్రం చేయని ఓవర్ హెడ్ ట్యాంకులు
  • సరైన నియంత్రణ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ RO ప్లాంట్లు
  • గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధి చేయని బోర్‌వెల్ నీటి వినియోగం
  • గృహాల్లో శుభ్రం చేయని వాటర్ ట్యాంక్ లు మరియు అవగాహన లోపం.

ఈ సమస్యల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రజలు ఆరోగ్యపరమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో నమోదవుతున్న వివిధ వ్యాధులకు కల్తీ ఆహారం ఒక సమస్య అయితే రెండవ అతిపెద్ద సమస్య శుద్ధిలేని త్రాగునీరు

తాగునీటి భద్రత అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని భావించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులిస్తుంది. ప్రతి గ్రామీణ ఇంటికి Functional Household Tap Connection (FHTC) ద్వారా శుద్ధమైన తాగునీరు అందించడం లక్ష్యంగా జల్ జీవన్ మిషన్, పట్టణ ప్రాంతాల్లో శుద్ధమైన తాగునీటి సరఫరా మరియు డ్రైనేజ్ వ్యవస్థలు మెరుగుపరచడం కోసం అమృత్ 2.o , పరిశుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థల అభివృద్ధి ద్వారా నీటి కలుషితాన్ని తగ్గించడం ధ్యేయంగా స్వచ్ఛ భరత్ మిషన్ , భూగర్భ జలాల నిర్వహణ మరియు నీటి వనరుల సంరక్షణ కోసం అటల్ భూ జల్ యోజన, తదితర పధకాలతో నేరుగా ఆర్థిక సహాయం, నీటి సరఫరా, ప్రాజెక్టులకు నిధులు , నీటి నాణ్యత పరీక్ష ల్యాబ్‌లు, నీటి శుద్ధి ప్లాంట్లు నిర్మాణం, టెక్నికల్ మార్గదర్శకాలను కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. కలుషిత త్రాగునీరు వ్యాధులు వ్యాపించడం లో పై స్థాయి అధికారుల జవాబుదారీతనం లేకపోవడం మరియు క్రింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తత కనిపిస్తున్నది.

కాబట్టి ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తక్షణ చర్యలు చేపట్టడం అవసరం.

అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ క్రింది చర్యలు తక్షణమే చేపట్టాలని వినమ్రంగా కోరుతున్నాము

  • రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తాగునీటి నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.
  • పాత మరియు లీకేజీ ఉన్న పైపులైన్లను తక్షణమే మరమ్మతు చేయాలి లేదా మార్చాలి.
  • అన్ని పట్టణాలు మరియు గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రతను నియమితంగా నిర్వహించే విధానం అమలు చేయాలి.
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ RO ప్లాంట్లపై కఠిన తనిఖీలు చేసి నాణ్యత ప్రమాణాలు అమలు చేయాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి.
  • ప్రతి జిల్లాలో నీటి శుద్ధి మరియు అవగాహన కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలి.
  • ప్రజలకు తాగునీటి భద్రతపై ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని నీటి శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. నీరు తగ్గిపోవడంతో మలినాలు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. తర్వాత వర్షాల సమయానికి త్రాగు నీరు వలన వచ్చే వ్యాధులు మరింత పెరుగుతాయి

రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి రాష్ట్రవ్యాప్తంగా నీటి శుద్ధి కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేయాలి అని వినమ్రంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.

Share.
Leave A Reply