మృతదేహాలను సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు.. వినుకొండ మండలం శివాపురం – రామిరెడ్డిపాలెం మధ్య జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదిపల్లి గ్రామానికి చెందిన పగడాల రామిరెడ్డి, సుబ్బులు, రామాంజి, అంకమ్మ దంపతులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు. సమాచారం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ బాబు గారు స్పందించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాల దంపతులు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, చంద్రన్న బీమా ద్వారా కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు…
Author: chilakaluripetalocalnews@gmail.com
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 5 కూలీలు మృతి వినుకొండ: గుంటూరు- కర్నూలు జాతీయ రహదారి వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి నలుగురు మహిళ కూలీలు, డ్రైవర్ మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీద పల్లి గ్రామాన్ని చెందిన నలుగురు మహిళా కూలీలు నరసరావుపేట వద్ద బొప్పాయి కోతకు బొలెరో పార్సిల్ వాహనంలో వెళుతుండగా శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో మరో ఇద్దరు మహిళ కూలీలను, బొలెరో వాహనం డ్రైవర్ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీ భావన్నారాయణ స్వామి వారి ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం, ఇనిమేళ్ళ గ్రామంలో వేంచేసి యున్న శ్రీ భావన్నారాయణ స్వామి వారి తిరుణాళ్ళ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు చొరవతో పల్లె బాటలకు మరోసారి మహర్దశ నరసరావుపేట ఎంపీ,టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీ కృష్ణ దేవరాయలు చొరవతో మరోసారి పల్నాడు గ్రామాల్లోని డొంకలు, పొలాలు రోడ్లు అభివృద్ధి బాట పట్టనున్నాయి. తరచు రైతులు, గ్రామస్థుల నుండి వస్తున్న అభ్యర్థణల మేరకు.. గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నప్పుడు మంచి ఆలోచన చేసి.. తన సొంత నిధులు, కొంత రైతుల సహకారం తీసుకుని మంచి ప్రణాళికలతో గ్రామాల్లోని రోడ్లను, డొంకలను అభివృద్ధి చేయించిన విధానాన్ని మరలా పునరావృతం చేయిస్తున్నారు.కేవలం 10 నెలల్లో 86 గ్రామాల్లో,, 435 కి. మీ మేర గతంలో అభివృద్ధి చేసి.. ఆ గ్రామాల్లో కొత్త కళను తీసుకు వచ్చారు. అలాగే మరలా పల్నాడు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో శ్రీ కృష్ణ దేవరాయలు.. ఈరోజు అభివృద్ధి పనులను ప్రారంభింప చేశారు. ఎంపీ కృష్ణ దేవరాయలు తన సొంత నిధులని వెచ్చించి.. మెషినరీ (…
ఓల్డ్ గన్ని యూత్ అధ్యక్షులు షేక్ నాసర్ వలి గారి కుమారుని వివాహం నిన్న జరుగగా ఈరోజు వారి స్వగృహం నందు జరుగుతున్న వలీమా వేడుకలో పాల్గొని నూతన వధూవరులు నయీమ్ – కరిష్మాలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వాసు గారు.. ఈ వేడుకలో యూత్ జిలాని గారు, పఠాన్ సుభాని గారు (గోల్డ్), సాతులూరి కోటి గారు, అడ్వకేట్ జిలాని గారు, పేర్ల శరత్ చంద్ గారు, సయ్యద్ జమీర్ గారు, షేక్ మహబుల్లా గారు, షేక్ హమద్ గారు, షేక్ నాగూర్ గారు తదితరులు ఉన్నారు.
జిల్లా ఎస్పీకి 75 ప్రజా ఫిర్యాదు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని శ్రీ ఎస్పీ గారు సూచించారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి చెందిన బీసుపోగు మరియమ్మ భర్త అయిన ఎలమంద సుమారు 24 సంll క్రితం ఆక్సిడెంట్ లో చనిపోయినట్లు, ఫిర్యాది మగ…
మాజీ మంత్రి విడదల రజిని అవినీతికి పాల్పడుతూ, అవినీతి పరులకు అండగా నిలిచారుముద్దాయిని అరెస్టు చేసే క్రమంలో రజిని వ్యవహరించిన తీరు సిగ్గుచేటు నేరస్తుడ్ని అరెస్టు చేయడం తప్పా..? సీఐపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లవేసినట్లుంది జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి చిలకలూరిపేట: రాష్ట్ర మంత్రిగా పనిచేసి, చట్టాల పట్ల అవగాహన ఉండి, రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాల్సిన మాజీ మంత్రి విడదల రజిని ఇందుకు విరుద్దంగా వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసే క్రమంలో వ్యవహరించిన తీరు సిగ్గుచేటని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని తన వాహనంలో ఉంచుకొని, పోలీసులు అరెస్టు చేయటానికి వచ్చిన సమయంలో రాద్దాంతం చేసి, ముద్దాయిని అరెస్టు చేయనీయకుండా పోలీసు విధులను ఆటంకపరిచటమే కాకుండా ఏదో…
పసుమర్రు లో దొంగలు హల్ చల్ నివాసగృహల్లో చోరీ… బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు ఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చెపట్టిన SI అనీల్ చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామ నివాసి, ఎలగాల అనసూయమ్మ భర్త పున్నయ్య 52 సంవత్సరాలు C/ యాదవ, Dt.06/05/2025 న ఉదయం 10 గంటల సమయంలో తన బంధువుల ఇంటికని వేల్చూరుకు వెళ్లి తిరిగి 11/05/2025. రాత్రి సుమారు 9 గంటల సమయానికి ఇంటికి రాగా ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో బంగారు వస్తువులు మరియు, ఇంట్లోని సామాన్లు, రాగి బిందెలు రెండు, రాగి చెంబు ఒకటే ఇత్తడిచెంబు ఒకటి, వెండి గ్లాసు ఒకటి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తాను ఇంటిలో లేని సమయంలో చూసి. దొంగిలించుకుని పోయిన విషయానికి గాను ఇచ్చిన రిపోర్ట్ మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్సై జి. అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరెస్టులు సక్రమమా…. చట్టప్రకారం ఇప్పుడు చేసేవి అక్రమమా? : టీడీపీనేతలు చిలకలూరిపేట నియోజకవర్గంలో రజనీ చేసిన అవినీతి, ప్రజలకు చేసిన మంచిపై ఆమె బహిరంగ చర్చకు రావాలన్న టీడీపీనేతలు ఏ నోటీసులు ఇచ్చి గతంలో చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారో రజనీ చెప్పాలి : షేక్ కరిముల్లా (టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి) తప్పుడు పనులు చేసిన వారిని కాపాడేందుకు మాజీమంత్రి రజనీ ప్రయత్నించడం సిగ్గుచేటని, వైసీపీ ప్రభుత్వం గతంలో ఏ నిబంధనల ప్రకారం తప్పుచేయని టీడీపీ నేతల్ని అన్యాయంగా అరెస్ట్ చేసిందో రజనీ చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా ప్రశ్నించారు. మాజీముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబు అరెస్ట్ సమయంలో వైసీపీ ఎంత నిరంకుశత్వంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజానీకం చూసిందన్నారు. పల్నాడు జిల్లా ఆత్మకూరుకు వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకొని ఆయన ఇంటి గేటుకు తాళాలు వేయించింది మీరు కాదా అని కరిముల్లా…
చిలకలూరిపేట పట్టణం, పురుషోత్తపట్నం నందు ఈరోజు ఉదయంఆశ రక్షక ప్రసాద్(51) మృతిచెందగా అక్కడకి విచ్చేసి వారి పార్థివ దేహానికి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట రాజా రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్ గారు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ గారు, గట్టి నేనీ రమేష్ గారు, తోట బ్రహ్మ స్వాములు గారు పలువురు నివాళులర్పించారు.









