పట్టణంలో కరెంట్ కట్ చేసే ఏరియాలు 28.05.25 బుధవారం విద్యుత్ లైన్ల మరమ్మత్తులు కారణముగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని వాసవి నగర్, అర్బన్ పోలీసుస్టేషన్ రోడ్డు, రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు, రెడ్ల బజారు,చౌత్ర సెంటర్,నెహ్రు నగర్ ప్రాంతములలో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము… . ఆర్.అశోక్ కుమార్, డీ ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట .
Author: chilakaluripetalocalnews@gmail.com
ఈ నెల 29 న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుట్టినరోజు వేడుకలు వేడుకలు కు సిద్దమవుతున్న ప్రత్తిపాటి గార్డెన్స్ జన్మదినం సందర్భంగా మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నా అర్బన్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి పెదకాకాని శంకర కంటి వైద్యశాల సహకారంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్న ప్రత్తిపాటి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా పేద ప్రజల కు మెడికల్ క్యాంప్ ద్వారా అందిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పేద వారికి ఒక వరం లా ఈ మెగా కంటి వైద్య శిబిరాలు… ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న క్యాంపు లు-కమిషనర్ శ్రీహరి
మహా ధర్నా లో పాల్గొన్న పొగాకు రైతులు రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ బర్లీ పొగాకు ను కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలన్నా పొగాకు రైతులు చిలకలూరిపేట NRT సెంటర్ ITC కంపెనీ ఎదుట ఉదయం 10గంటలనుంచిమహా ధర్నా లో పొగాకు రైతులు గుంటూరు, ప్రకాశం,, బాపట్ల ,పల్నాడు, ఉమ్మడి కర్నూలు జిల్లా ల పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి ధర్నాకు తరలివచ్చిన రైతు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల వద్ద నుంచి పొగాకు కొనాలి-రైతులు పొగాకు బోర్డు పరిధిలో కి బర్లీ పొగను ను చేర్చాలి-రైతులు ఈ డిమాండ్ లతో రైతులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా లో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు
వైద్యశాలలో కాన్పుల సంఖ్య పెంచాలి : డీఎంహెచ్వో రవి నాదెండ్ల: ప్రభుత్వ వైద్యశాలలో బయటి రోగుల (ఓపీ) సేవలతో పాటు ప్రసూతి కాన్పుల సంఖ్య గణనీయంగా పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి రవి ఆదేశించారు. నాదెండ్ల మాతా శిశు ఆరోగ్య (పీహెచ్సీ) కేంద్రాన్ని డీ.ఎం.హెచ్.వో మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, రక్త పరీక్షల కేంద్రం, శస్త్రచికిత్సల గది, ఔషద దకాణాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులుకు అందించాల్సిన సేవలపై పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ శ్వేత, డాక్టర్ జ్ఞానేశ్వరి ఎంపీహెచ్ఎస్ దిలీప్ కుమార్, యూడీసీ హనుమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
(28.05.2025, బుధవారం) ఉదయం 6.00 గం.లకు కోటప్ప కొండ శైవ క్షేత్రం వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. నరసరావు పేట: (28.05.2025, బుధవారం) ఉదయం 6.00 గం.లకు కోటప్ప కొండ శైవ క్షేత్రం వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
శ్రీ ఆంజనేయం సేవాదళ్ వారి ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం శ్రీ ఆంజనేయం సేవాదళ్ వారి ఆద్వర్యం లో ప్రతి మంగళవారం గబ్బిటివారి వీధిలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నందు మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము స్వామి వారి సేవలోఅర్వపల్లి వెంకట అప్పారావు, దత్తాత్రేయ ఫౌండేషన్ అధినేత దివ్వెల రంగా, బచ్చు శ్రీధర రావు, అర్వపల్లి నాగేశ్వరరావు, రావికింది హనుమంతరావు, మిత్తింటి రామకృష్ణ, కొల్లిపర గోపి, తాతా రాజేష్
రోడ్డు కు కొలతలు వేయండి…. త్వరతీగతిన కొలతలు వేసి రోడ్ ఇవ్వండి యడ్లపాడు తహశీల్దార్ విజయ శ్రీ ని కోరిన గ్రామస్తులు మండల కేంద్రమైన యడ్లపాడు జాతీయ రహదారి నుండి విశ్వనాథ కండ్రిక వరకు గల రోడ్డు కు కొలతలు వేయాలని కోరుతూ ఎమ్మార్వో కు వినతిపత్రం అందించిన రైతులు. ఈ విషియం పై గతంలో ఏప్రిల్ 4వ తేదీన గ్రామ పంచాయతీ నిర్ణయించిన గ్రామస్తులు. అయితే ఇంతవరకు కొలత కొలవక పోవడంతో గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ విజయశ్రీ ని కలిసి విషయం గుర్తు చేశారు. పంచాయితీ కార్యదర్శి 4వ తేదీన ఇచ్చిన పత్రం కాపీని తహసిల్దార్ కు అందజేశారు.
సమస్యలను ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు సంబంధించి ఫిర్యాదులను నేరుగా collectorate నరసరావుపేట లో లేదా ఆయా మండలాల్లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కర వేదిక లో గాని ఫిర్యాదులు సమర్పించవచ్చని తెలిపారు. పరిష్కార వేదికకు హాజరు కాలేని వారు టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫోన్ చేసి ఫిర్యాదుల నమోదు చేయించుకోవచ్చని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ఇచ్చిన ఫిర్యా దులకు సంబంధించిన స్థితిని తెలుసుకు నేందుకు మరియు సమాచారం తెలుసుకొనుటకు టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అలాగే నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి సమాచారం ఏమన్నా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 (డబల్ వన్ డబల్ జీరో) కి…
మహానాడు విజయవంతం మన బాధ్యత : మాజీమంత్రి ప్రత్తిపాటి “దేవని గడప కడపలో జరిగి తొలిమహానాడు విజయవంతం మనందరి ప్రధాన బాధ్యత. తెలుగుదేశం పార్టీ జాతీయఅద్యక్ష ఎన్నిక మొదలు అనేక సంస్థాగత నిర్ణయాలకు కేంద్రబిందువు కానున్న మహానాడు మనకెంతో ప్రత్యేకం. ఈ మహానాడులో యువత, మహిళలు, రైతుల సంక్షేమం సహా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రధాన అజెండాగా పలు నిర్ణయాలను అధినాయకత్వం ప్రకటించనుంది. అదేవిధంగా కూటమిప్రభుత్వ ఏడాది పాలనా విజయాలు, భవిష్యత్ ఆలోచనలపై మహానాడులో సమగ్రచర్చ జరగనుంది. మూడురోజులు కన్నుల పండువగా జరిగే తెలుగుప్రజల మహాపండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వర్షం వచ్చినా కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోలీస్, రెవెన్యూ తదితర విభాగాలు, స్థానిక నాయకుల సహాకారంతో మహానాడుకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. కడపలో జరుగుతున్న తొలి మహానాడుకు నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు, నారా.. నందమూరి అభిమానులు…
శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ మేనేజర్ ఆత్మహత్య సుమారు40లక్షల నుంచి60లక్షల వరకు స్వాహా శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ వారు డబ్బులు కట్టాలని పదే పదే ఒత్తిడి ఒత్తిళ్లు తాళ్లలేక ఆత్మహత్య చేసుకున్న జక్క శ్రీరామ్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చున్నీ తో ఉరివేసుకొని ఆత్మహత్య గణపవరం లోని జక్క శ్రీరామ్ కుమార్ ఇంట్లో ఘటన, ఘటనా స్థలాన్ని పరిశీలించి న నాదెండ్ల SI జీ. పుల్లారావు వివరాలు ఇలా…..నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ని జక్క వారి వీధి కి చెందిన జక్క శ్రీరామ్ కుమార్ గత ఆరు సంవత్సరాల నుంచి చిలకలూరిపేట శ్రీరామ్ ఫైనాన్స్ నందు రికవరీ మేనేజర్ గా పని చేస్తున్నాడు.శ్రీరామ్ ఫైనాన్స్ కు సంబంధించి న రికవరీ డబ్బులు ఆఫీస్ కు చెల్లింపు లు చేయకుండా శ్రీరామ్ కుమార్ జల్సా లకు వాడుకున్నాడు. మొత్తం సుమారు40లక్షల నుంచి60లక్షల వరకు ఉన్న నేపథ్యంలో శ్రీరామ్…









