నా విజయం నరసరావుపేట ప్రజలకు నాయకులకి కార్యకర్తలకి అంకితం*డాక్టర్ చదలవాడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమాభివృద్ధి కొనసాగుతుంది. శాసనసభ్యులు డాక్టర్. చదలవాడ అరవిందబాబు. విజయోత్సవ ర్యాలీకి భారీ సంఖ్యలో హాజరైన కూటమి నాయకులు, శ్రేణులు. నరసరావుపేట:వైయస్సార్సీపి విధ్వంసకర పాలనలో ప్రజలకు జరిగిన నష్టం, కృషీవలుడు చంద్రబాబు కష్టంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని శాసనసభ్యులు డా. చదలవాడ అరవింద్ బాబు అన్నారు. గురువారం పట్టణంలో ఆయన కార్యాలయము నుండి కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్స ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపారు. వందల సంఖ్యలో కార్యకర్తలతో చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. కూటమి నాయకులు, శ్రేణులు, మహిళలు, తెదేపా, జనసేన, బిజెపి జెండాలు చేతబూని కూటమి ప్రభుత్వ అనుకూల నినాదాలు చేస్తూ ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానులు ఏర్పాటు…
Author: chilakaluripetalocalnews@gmail.com
మద్యం తాగి కింద పడిన వ్యక్తిని టిడిపి వ్యక్తులు కొట్టారనడం మంచి పద్ధతి కాదు కొత్త బోధనం ఉప సర్పంచ్ తోట శ్రీనివాసరావు రాజుపాలెం మండలం కొత్త బోధనం గ్రామంలో రాంపాటి శ్రీహరి అనే వ్యక్తి మద్యం తాగి కింద పడిపోయి దెబ్బలు తగిలితే ఆ విషయాన్ని పక్కన పెట్టి వైసిపి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నేడు అతని పరామర్శించి టిడిపికి చెందిన వ్యక్తులు దాడి చేశారంటూ మాట్లాడటం మంచి పద్ధతి కాదని గ్రామ ఉపసర్పంచ్ తోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలానే శ్రీ హరి అనే వ్యక్తి తన పేరే సరిగా రాయలేనప్పుడు సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నారో ఎంత యాక్టివ్ గా ఉన్నారో తెలియజేయలన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం పని చేస్తారు కానీ ఎక్కడ కూడా దాడులకు పాల్పడరు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు మాట్లాడితే గ్రామాలలో గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని…
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగాకేక్ కట్ చేసిన కూటమి నాయకులు జగన్ హయాంలో రాక్షస ,అరాచక పాలన సాగింది.. వైసీపీ పాలనలో ఎన్నికల ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచుశారు .. జరిగిన ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పారు .. కూటమి ప్రభుత్వం లో ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది .. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆధికారంలోకి రావటంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని సమిక్షించారు .. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారం రాగానే వారిని ఘోరంగా మోసం చేసిన జగన్ను ప్రజలు తమ ఓటుతో తరిమికొట్టిన రోజు కూటమి ప్రభుత్వంపై అపార నమ్మకంతో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు
కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పడి నేటికీ సంవత్సరకాలం కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పడి నేటికీ సంవత్సరకాలం సందర్భంగా వినుకొండ పట్టణం ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ గారు మరియు కూటమి కలిసి కేక్ కట్ చేసి అనంతరం కాలువ కట్ట దగ్గర NT రామారావు గారి విగ్రహానికి మరియు పరిటాల రవి గారి విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించి మరియు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
మీ పుట్టినరోజున ఒక మొక్క నాటండి” కార్యక్రమం చిలకలూరిపేట:అమ్మి ఫౌండేషన్ చేపట్టిన మీ పుట్టినరోజున ఒక మొక్క నాటండి” ఉద్యమంలో భాగంగాపేట తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట తహసీల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ స్వయంగా మొక్కను నాటి, ఫౌండేషన్ చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని అభినందించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ప్రజలలో పర్యావరణంపై అవగాహన పెంచాలని ఆకాంక్షించారు. ప్రతి పౌరుడు మొక్కలు నాటడాన్ని అలవాటు చేసుకుంటే, మన పట్టణాలు తిరిగి పచ్చగా మారతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రోషన్, ఈశ్వర్, అమ్మి ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ షేక్ అఫ్రోజ్ తో పాటు, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ సర్వేయర్లు, VROలు, MRO కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రప్రగతికి ఇంధనం : మాజీమంత్రి ప్రత్తిపాటి కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజలు గుండెలపై చేయివేసుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారని, అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వమని, అదే రాష్ట్రప్రగతికి ఇంధనమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా పట్టణవ్యాప్తంగా జరిగిన మూడుపార్టీల విజయోవత్సవ వేడుకల్లో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతో కలిసి ప్రత్తిపాటి పాల్గొన్నారు. తొలుత పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రత్తిపాటి, కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు వీధిసహా పట్టణంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన సంబరాల్లో ప్రత్తిపాటి పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేశ్ ల చొరవ వల్లే రాష్ట్రానికి రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులు.. ప్రజల సంతోషం, సంక్షేమంతో పాటు రాష్ట్ర పునరర్నిర్మాణం…
రక్తదాన శిబిరాన్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు మండల కేంద్రమైన నాదెండ్ల ఎంపీడీవో కార్యాలయలో గురువారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు, సొసైటీ సభ్యులతో మాట్లాడిన ఆయన, రక్తదాన ఆవశ్యకతపై యువతకు అవగాహన కల్పించాలని చెప్పారు. రక్తదానాన్ని జీవితంలో కచ్చితంగా చేపట్టాల్సిన ఒక మంచి కార్యక్రమంగా నేటి యువత భావించేలా వారిలో చైతన్యం తీసుకురావాలని ప్రత్తిపాటి నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఆయన రక్తదాతలతో మాట్లాడి, వారికి ప్రశంసాపత్రాలు, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప రాణి, ఎమ్మార్వో , టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మధన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 18 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాలు చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ కార్యదర్శి గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన దేవరకొండ తిరుపతి రాయుడు అభినందనలు తెలిపిన యార్డు సిబ్బంది… ఉద్యోగులు తణుకు నుంచి చిలకలూరిపేట యార్డు కార్యదర్శిగా బదిలీపై వచ్చిన తిరుపతి రాయుడు భాద్యతలు స్వీకరించిన అనంతరం సిటీ న్యూస్ తొ మాట్లాడిన కార్యదర్శి తిరుపతి రాయుడు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని, నియోజకవర్గ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాననితెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆదేశాల కు అనుగుణంగా అభివృద్ధి కి సహకరిస్తానని, గ్రామాల్లో లింక్ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ నెల 18 నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కు చర్యలు తీసుకుంటామని చెప్పారు
చేనేత కార్మికుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మాజీమంత్రి ప్రత్తిపాటి. చేనేత దౌలిశాఖ నుండి చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని చేనేత కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా మినీ క్లస్టర్ లో 93 లక్షల రూపాయలు మంజూరు అయ్యింది. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ మాజీమంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విధివిధానాలు, దానికి సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించటం కోసం ప్రత్తిపాటి పుల్లారావు గారితో అధికారులు చర్చించారు. అతి త్వరలోనే నియోజకవర్గంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసేలా చూడాలి అని ప్రత్తిపాటి అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో జనసేన ఇన్చార్జి తోట రాజారమేష్, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, మద్దుమల రవి, కందుల రమణ, గంజి శ్రీనివాసరావు, అవ్వారు…
ప్రగడ రాజమోహన్ మృతి గత 40 సంవత్సరాలు నుంచి చిలకలూరిపేట కళానిలయం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేస్తారు. ఆయన మృతి చిలకలూరిపేట కళానిలయం కు తీరని లోటు ప్రగడ రాజమోహన్ PR మోహన్ గా అందరికి సూపరిచితుడు 87సంవత్సరాల PR మోహన్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. గత కొన్ని నెలలు గా ఆయనకు ఆరోగ్యం బగోలేదు….నివాస గృహంలో నే తుదిశ్వాస విడిచారు









