Author: chilakaluripetalocalnews@gmail.com

బొప్పూడి నక్షత్ర వనంలో హైకోర్టు న్యాయమూర్తి మొక్కలు నాటే కార్యక్రమం ​చిలకలూరిపేట (బొప్పూడి):పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడం ద్వారానే భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించగలమని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ బొప్పూడి కృష్ణమోహన్ గారు పేర్కొన్నారు. శనివారం చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని “నక్షత్ర వనము”ను ఆయన తన సతీమణితో కలిసి సందర్శించారు.​ఈ సందర్భంగా నక్షత్ర వనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వగ్రామంపై మమకారంతో పాటు, పర్యావరణం పట్ల ఇక్కడి ప్రజలు చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని కొనియాడారు. నక్షత్ర వనం వంటి ఆధ్యాత్మిక మరియు పర్యావరణ మేళవింపు ఉన్న ప్రాంతాలు మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Read More

వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి: మురికిపూడి ప్రసాద్ కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర సమాలోచనలు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు వినియోగదారులను మభ్యపెట్టి అధిక ధరలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసి వాటిని కమర్షియల్‌గా విక్రయిస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వినియోగదారులకు సరఫరా చేసే ప్రతి గ్యాస్ సిలిండర్‌పై ఉన్న సీరియల్ నంబర్‌ను గుర్తించి, వినియోగదారుడు తన పుస్తకంలో నమోదు చేసుకోవడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించవచ్చని సూచించారు. ఈ విధానం గతంలో ప్రభుత్వాలు…

Read More

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన జాతీయ కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా సింగరేసు పోలయ్య తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన సింగరేసు పోలయ్య. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య. అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య. సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా…

Read More

గెలుపు ఓటములకు అతీతంగా ప్రజలకోసం పోరాడే పార్టీ టీడీపీ: ప్రత్తిపాటిచిలకలూరిపేట పట్టణం నుంచి గెలుపొందిన టీడీపీ కౌన్సిలర్లు అందరూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజాభిమానం…ఆదరణ పొందిన నాయకులను వారు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గడచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణం నుంచి తెలుగుదేశం కౌన్సిలర్లుగా గెలుపొంది, ప్రస్తుతం పదవీకాలం పూర్తయిన వారికి ఉగాది పండుగను పురస్కరించుకొని టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదవులకు అతీతంగా స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకై సమిష్టిగా పనిచేయండి..పురపాలికల్లో ప్రత్యేక అధికారుల పాలన వచ్చినప్పటికీ, కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారంలో మునుపటిలానే సమర్థంగా పనిచేయాలని, 5, 6 నెలల్లో రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే పార్టీ గెలుపుకోసం సమిష్టిగా పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు. టీడీపీ తరుపున గెలిచి, గత ప్రభుత్వంలో నాటి పాలకుల అరాచకాలపై కౌన్సిలర్లు…

Read More

పల్నాడు లో యువతి కిడ్నాప్ కలకలం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామ సమీపంలో యువతి కిడ్నాప్ కావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. నరసరావుపేటలోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌లో పనిచేసే యువతి, పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కిడ్నప్ కు గురైనట్లుసమాచారం . ​​ముప్పాళ్ల గ్రామానికి చెందిన ఉయ్యాల చైతన్య 22 బాధితురాలు ప్రతిరోజూ నరసరావుపేట వెళ్లి తన పని ముగించుకుని సాయంత్రం వేళల్లో తిరిగి గ్రామానికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే, రొంపిచర్ల మండలం తుంగపాడు సమీపంలోకి రాగానే యువతి కిడ్నాప్ కు గురైనట్లు సమాచారం ,.​యువతి ఇంటికి చేరుకోకపోవడం మరియు స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన రొంపిచర్ల పోలీస్ ​ఘటనా స్థలాన్ని పరిశీలించి, తుంగపాడు – నరసరావుపేట మార్గంలోని సీసీటీవీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు రొంపిచర్ల పోలీసులు ​నిందితులు ఏ దిశగా వెళ్లారనే కోణంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు పూర్తి…

Read More

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వరికూటి నాగేశ్వరరావు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వరికూటి నాగేశ్వరావు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా వరి కోటి నాగేశ్వరరావు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన వారికూటి నాగేశ్వరరావు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన వరికూటి నాగేశ్వరరావు. అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన వరికూటి నాగేశ్వరరావు. సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వ నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బీజేపీ యువ నాయకులు ఇంగ్గుటూరి రాజశేఖర్ రెడ్డి సంఘ రాష్ట్ర కార్యదర్శి సింగరేసు పోలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వినతి పత్రం స్వీకరించిన డిఆర్ఓ గారు వెంటనే దేవాదాయ శాఖ వారిని పిలిచి ఈ సమస్యపై స్పందించి నిధులు కేటాయించాలని కోరారు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి సమర్పించిన వినతి పత్రం విషయం: వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి – ఉగాది కొనుగోలు మార్కెట్లలో ప్రజలకు…

Read More

తక్కువ వడ్డీకి రుణాలు. అధిక వడ్డీ ఆశచూపి మోసగించిన వ్యక్తిపై ప్రత్తిపాటికి ఫిర్యాదు చేసిన పలు గ్రామాల ప్రజలు అధిక వడ్డీల ఆశ చూపడంతో పాటు.. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని తెలివిగా నమ్మించి తమ కష్టార్జితాన్ని దోచుకున్న వ్యక్తిపై పలు గ్రామాల ప్రజలు శనివారం మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటికి ఫిర్యాదు చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన సమయంలో ఎమ్మెల్యేను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగళ్ల వెంకట్రావు అనే వ్యక్తి.. రూ.10 వేలు మొదలు ఆ పైన మీస్థాయికి తగినంత ఇస్తే, ఆ మొత్తాన్ని తెలిసిన సంస్థల్లో పెట్టుబడులు రూపంలోకి మార్చి, ఎక్కువ లాభాలు అందిస్తానని నమ్మబలికి, అందినకాడికి దండుకొని ఇప్పుడు ముఖం చాటేశాడని ప్రజలు ఎమ్మెల్యే ప్రత్తిపాటికి మొరపెట్టుకున్నారు. తమకు జరిగిన మోసాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి తెలియచేశామని, వారు విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారని,…

Read More

అభిమానులకు, జనసైనికులకు ధన్యవాదాలు తెలిపిన:ప్రధాత మండలనేని చరణ్ తేజ ప్రధాత తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ మండలనేని చరణ్ తేజ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా, వ్యక్తిగతంగా శుభాకాంక్షలు అందజేసిన వ్యాపారవేత్తలకు, జనసైనికులకు, వీర మహిళలకు, అభిమానులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సభ్యుల్లాంటి కార్యకర్తలు”నాపై ఇంతటి అభిమానం చూపించి, నాపై నమ్మకంతో నా వెన్నంటే ఉండి నడిపిస్తున్న మీరందరూ నా కుటుంబ సభ్యులతో సమానం. మీ ఆదరాభిమానాలే నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన నమ్మకాన్ని కొనసాగిస్తానని, మీ అందరి అండదండలతో ప్రజా సేవలో ముందుంటానని” ఈ సందర్భంగా చరణ్ తేజ ఆకాంక్షించారు.

Read More

పంటల మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానంతోనే రైతులకు లాభాలు : ప్రత్తిపాటి ఖరీఫ్ సాగుఖర్చులకు ప్రభుత్వం అందించిన అన్నదాత సుఖీభవ సాయం ఉపయోగపడుతుందని, దుక్కిదున్ని భూమిని సాగుకు సిద్ధం చేసే రైతులకు ప్రభుత్వసాయం మేలు చేస్తుందని, ఐదేళ్లు జగన్ రైతులకు మొండిచెయ్యి చూపిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వారికి అన్నివిధాలా అండగా నిలుస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లాతో కలిసి రైతులకు అన్నదాత సుఖీభవ సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్లు రైతులతో మాట్లాడి, సాగువిధానాల గురించి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలపై రైతాంగానికి అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన రైతాంగాన్ని ఉద్దేశించి…

Read More