చిత్తూరు జిల్లా లొ ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి దారుణ హత్యను ఖండించిన కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
చిత్తూరు జిల్లాలో ఓ పత్రికా విలేకరిని చంపేశారు. వి.కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్యకు గురయ్యారు. ఉదయాన్నే ఆయన వాకింగ్ చేసే సమయంలో కొంతమంది వ్యక్తులు వెంటాడి ఇంటికి సమీపంలోనే కత్తులతో నరికి చంపేశారు. ఈ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు..ఇలాంటోళ్ళు నెల్లూరు రూరల్ మండలం లో MLA మాదిరిగా చెలరేగి పోతున్నారు ఈ దారుణ హత్యకు పాల్పడ్డ వ్యక్తులు ఎటువంటి వారైనా సరే వదిలిపెట్టకుండా పోలీసు వారు తగు చర్యలు వెంటనే తీసుకోవాలని కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు



