Author: chilakaluripetalocalnews@gmail.com

తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి గౌరవ డా. నందమూరి తారక రామారావు గారు.– పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ పల్నాడు జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డా.శ్రీ.నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినము సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి, ఘన నివాళులు అర్పించిన శ్రీ ఎస్పీ గారు, ఇతర పోలీస్ అధికారులు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు లో జన్మించిన ఆయనకు ఉమ్మడి గుంటూరు జిల్లాతో మంచి అనుబంధం ఉంది.ఆయన గుంటూరు పట్టణంలోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల నందు విద్యను అభ్యసించారు.విద్యాభ్యాసం అనంతరం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తూ నాటకరంగంపై ఆయనకున్న అభిరుచితో సినిమా రంగంలోకి అడుగుపెట్టినారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని,…

Read More

పొలాల్లోకి దూసుకుపోయిన ఆటో ఆటో లో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు పెదనందిపాడు ఆసుపత్రికి తరలింపు ఆటో ముందు వీల్ విరిగిపోవడంతో పొలాల్లోకి వెళ్లిన ఆటో చిలకలూరిపేట సమీపంలో ని ఉప్పలపాడు వద్ద ఘటన చిలకలూరిపేట నుండి పెదనందిపాడు వెళుతున్న ఆటో ఉప్పలపాడు వద్ద అడుపుతప్పింది. ఉప్పలపాడు నందనవనం దాటి వస్తుండగా ఆటో ముందు చక్రం విరిగి పోవడంతో సైడ్ పొలాల్లోకి దూసుకు పోయింది. ,ఆటోలో ఇద్దరు ప్రయాణిస్తున్నారు ఒకరికి తీవ్ర గాయాలు మరొక ఆటోలో పెదనందిపాడు ఆస్పత్రికి తరలింపు, ఎవరికి ఏలాంటి ప్రాణాపాయం లేదు

Read More

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో వైసిపి గెలుస్తుంది – మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షులుగా నియమితులైన మొగిలి ఆంజనేయులు గారు మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ యువకుడు ,ఉత్సాహవంతుడు అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న మొగిలి ఆంజనేయులు గారికి ST విభాగం అధ్యక్షులుగా నియమించడం చాలా ఆనందంగా ఉందని, 10 సంవత్సరాల నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, బాధ్యతగా పనిచేసే ,అందర్నీ కలుపుకొని పోయే వ్యక్తని ,పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ,పార్టీ కోసం కష్టపడి పనిచేసేమనస్తత్వం ఉన్న వ్యక్తిని ఎంపిక చేయటం సంతోషకరమని ,…

Read More

చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు స్వామివారి బింబపు విమాన శిఖరము, జీవ ధ్వజ పునః ప్రతిష్టా మహోత్సవం దైవజ్ఞుల నిర్ణయం మేరకు జరుగుచుండగా ఈ మహత్తర ప్రతిష్టా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మరియు గ్రామ ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి, తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ ప్రతిష్టా మహోత్సవంలో వారికి సాదర స్వాగతం పలికిన కట్టా జవహార్ బాబు గారు, కందిమళ్ళ శ్రీనివాసరావు గారు, గణేషుని లక్ష్మీనారాయణ గారు, నార్నె హనుమంతరావు గారు, దేవరకొండ గోపి గారు,కంతేటి హనుమంతరావు గారు, కొండ్రగుంట కృష్ణయ్య గారు, బోడ వీరరాఘవులు గారు, గణేషుని యజ్ఞ నారాయణ గారు, కందిమళ్ళ సత్యనారాయణ గారు తాళ్లూరి సింగారావు గారు, కట్టా నాగేశ్వరరావు గారు తదితరులున్నారు.

Read More

నేర ప్రవర్తన కల్గిన వ్యక్తులకు ప్రోత్సహించడం సిగ్గుచేటు. సోషల్ మీడియా వేదికగా కులాల మధ్య చిచ్చుపెట్టడం మానుకోవాలి. రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పునరాలోచన చేయాలి.బి.శ్రీను నాయక్. చిలకలూరిపేట:తెనాలిలో ఐత నగర్ లో పలు కేసుల్లో ముద్దాయిలు, నేల ప్రవర్తన కలిగిన యువకులు గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారు.సంఘటనను దృష్టిలో పెట్టుకొని యువకులను రోడ్డుమీదకి తీసుకొచ్చి సీఐ రాములు నాయక్, రమేష్ బాబులు కొట్టడం జరిగింది. ఆ యువకుల పట్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వారు చేస్తున్నటువంటి కొన్ని పనుల వలన భయభ్రాంతుకు లోనే ఉన్నారు. కాబట్టి సిఐలు ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన తొలగించడం కోసం రోడ్డు మీదకు తీసుకువచ్చి కొట్టడం జరిగింది. దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు కులాన్ని ఆపాదించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కులం పేరుతో తిట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చూస్తున్నారని, వారి ఆలోచన…

Read More

బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం కారు-స్కూటర్ ఢీ….ఇద్దరు యువతులు కు తీవ్ర గాయాలు ఘటన స్థలాన్ని పరిశీలించి న యడ్లపాడు పోలీసులు ఇద్దరు యువతులలో ఒకరికి పరిస్థితి విషమం స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులు హైవే అంబులెన్స్ లో గుంటూరు వైద్యశాల కు తరలింపు గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం గాయపడిన వారు సూరవరపు పల్లి గ్రామానికి చెందిన మహిళా విద్యార్థులుగా గుర్తింపు

Read More

వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామం నందు శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థాన ప్రతిష్ఠా మహోత్సవం లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. వారితో పాటు మాజీ ఎంపీ మోదుగుల వేణు గోపాల్ రెడ్డి గారు. మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి తొలిసారిగా సర్కార్ ఆఫీసులలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నివాళి అర్పించిన మున్సిపల్ ఉద్యోగులు, కౌన్సిలర్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి నివాళి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదలకు, అణగారిన వర్గాలకు చేసిన ప్రజా సేవల గురించి గుర్తు చేసుకున్నా కౌన్సిలర్లు, ఉద్యోగులు..

Read More

గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపండి! ..లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్.. తెనాలిలో గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇకనైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలను తీసుకొని నేరాలు జరగకుండా చూడాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు.గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై రౌడీ షీటర్ అనుచరులు చేసిన దాడిని మాత్రమే డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంటే సరిపోదని, గంజాయి ఇతర మత్తు పదార్థాల వలన నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అనేక కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయని విషయాన్ని గుర్తించి, గంజాయి క్రయవిక్రయాలను జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలైనా వారు కుటుంబాలలో వృద్ధులైన తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యని చావబాదుతున్న సంఘటనలు నిత్యం…

Read More

నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు…. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్… పల్నాడు జిల్లా నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. పమిడిమర్రు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ తనిఖీ లలో సరైన పత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, గొడ్డళ్లు, కర్రలు, పలుగులు మారణాయుధాలు స్వాధీనపర్చుకోవడమైనది. ఫుట్ పెట్రోలింగ్, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన చేశారు. అంతేకాకుండా… రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు…

Read More