పల్నాడు జిల్లా SP ఆదేశాలతో సైబర్ క్రైం పై కార్మికులు కు అవగాహన నేరాలకు పాల్పడితే జైలుకే స్పిన్నింగ్ మిల్లు లో అవగాహన కల్పించిన రూరల్ CI సుబ్బా నాయుడు తిమ్మాపురం తిరుమల స్పిన్నింగ్ మిల్లు లో కార్మికులు కు నేరాల పట్ల అవగాహన కల్పించిన CI సుబ్బా నాయుడు మాదక ద్రవ్యాల వినియోగం, మద్యపానం చేసి మహిళలు పై దాడులు చేయడం, అత్యాచారం చేయడం వంటి నేరాల పట్ల అవగాహన కల్పించారు నేరాలకు అలవాటు పడవద్దని, కార్మికుల కు సుస్థిర మైన భవిష్యత్ ఉందని సూచించారు నేరాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
Author: chilakaluripetalocalnews@gmail.com
కాపుల్ని బీసీల చేర్చాలని డిమాండ్ నెరవేర్చడం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు కాపు ముద్దుబిడ్డ సానా ప్రసాద్ చిత్తూరు నుండి అమరావతి వరకు జరుగుతున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు సానా ప్రసాద్ కాపు బిడ్డ, ఒంగోలు వాస్తవ్యుడు ఆంధ్రప్రదేశ్ కాపు, బలిజ, తెలగ, ఒంటరి BC రిజర్వేషన్స్ సాధన సమితి వ్యవస్థపక అధ్యక్షుడు 08.06.’25 న చిత్తూరు నుండి అమరావతి వరకు కాపు పెద్దల సౌజన్యముతో, ఎలాంటి రాజకీయ పార్టీలకు గ్రూపులకు అతీతముగా ప్రారంభించిన శాంతియుత పాదయాత్ర తిరుపతికి కాళహస్తి రాజంపేట మీదుగా కడప కర్నూల్ తరువాత ప్రకాశం జిల్లా లో హైవే లోకి వస్తారు తిరుపతిలో రాయలసీమ కాపు పెద్దలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని తదుపరి రాజంపేట కు చేరుచున్న పాదయాత్ర. చిత్తూరు నుండి రేణిగుంట వరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల పెద్దలు,…
రెంటపాళ్ళ గ్రామాన్ని సందర్శించిన వైసీపీ నాయకులు పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రెంటపాళ్ళ గ్రామంలో ఈనెల 18 వ తారీకు ఉప సర్పంచ్ శివనాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రానున్న, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. రెంటపాళ్లలో విగ్రహావిష్కరణ పర్యటన లో భాగంగా, గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఎమ్మెల్సీ తలసరి రఘురాం , ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు విడుదల రజిని, పేర్ని నాని, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
షేక్ మహబూబ్ సుభాని గారి కుమారుల (ఖుద్దూస్ గారి మనుమళ్ళ) అఖికా వేడుక చిలకలూరిపేట పట్టణంలోని జంపాని సినీ కళ్యాణమండపం నందు జరుగుచుండగా ఆ కార్యక్రమానికి హాజరై చిరంజీవులు మహమ్మద్ అష్రాఫ్, మహమ్మద్ అసాద్ లను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారి వెంట స్పెట్స్ కరిముల్లా గారు, AVM సుభాని గారు, భక్షు మేస్త్రి గారు, అత్తలూరి షరీఫ్ గారు తదితరులు ఉన్నారు.
దేశం ఆశ్చర్యపోయేలా, మోదీ గర్వించేలా ‘యోగాంధ్ర’ చరిత్రలో నిలవాలి : ప్రత్తిపాటి దేశం గర్వించేలా, రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ల పేరు ప్రఖ్యాతులు పెంచేలా జూన్ 21న సాగరతీరాన జరిగే యోగాంధ్ర కార్యక్రమం చరిత్రలో నిలిచిపోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. యోగాంధ్ర నిర్వహణ విజయవంతంపై ఆదివారం ఆయన విశాఖపట్నంలోని గురజాడ కళాపరిషత్, స్థానిక వీ.ఆర్.డీ.ఎం.ఏ కార్యాలయంలో కూటమిపార్టీల శ్రేణులు, డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర బహిరంగ సభా నిర్వహణలో భాగంగా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహాకారం కావాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి కోరారు. సూపర్-6 అమలుతో జగన్ అడ్రస్ గల్లంతే…తల్లికి వందనం అమలుతో చంద్రబాబు చరిత్ర సృష్టించారని, సూపర్ -6 అమలైతే జగన్ అడ్రస్సే గల్లంతవుతుందని, ప్రభుత్వ పథకాల ఫలాలు అందాక ప్రజలు…
కూటమి ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై చర్యలు చేపట్టాలి . విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. అనుమతులు లేని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలి-బి.శ్రీను నాయక్. కూటమి ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్నారై సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు విద్యను వ్యాపారంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాల చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఎంతో కొంత విద్యార్థుల ఫీజులపై నియంత్రణ ఉండేదని కనీసం ఆ విధంగా లేకపోవడం చాలా దారుణం అన్నారు. విద్యార్థుల ఫీజుల భారంగా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కోరుకోవలసిన పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణపై ప్రతిష్టమైన చర్యలు…
ఈనెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు,వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ఈరోజు సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ల గ్రామంలో పార్టీ నేతలతో పాటు పర్యటించి రూట్ మ్యాప్ పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు విడదల రజిని .
తెలగ ,కాపు, బలిజ కళ్యాణ మండపం పునర్నిర్మాణ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన కుల పెద్దలైన తంగేళ్ల లింగారావు మాస్టారు, పొన్నం చంద్రశేఖర్ గారు, తోట సత్యనారాయణ గారు, తోట రామచంద్ర ప్రసాద్ గారు మరియు వారి సోదరులు రాజా గారు, గోవింద శంకర్ శ్రీనివాస్ రావు గారిని గౌరవపూర్వకంగా కలిసి ఈ యొక్క కళ్యాణ మండపం పునర్నిర్మాణం గురించి వివరించి వారి యొక్క సలహాలు మరియు సహాయ సహకారాలు కోరడం జరిగింది . మేం కలిసిన ప్రతి ఒక్కరు సానుకూలంగా స్పందించి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వెన్నంటి మేము ఉండి చేస్తామని వారి యొక్క గొప్ప మనసు చాటుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోతురాజు హరీష్, ఉయ్యూరి నరసింహారావు, కమ్మిలి శివరామకృష్ణ, పొన్నం చంద్రశేఖర్ గారు, మండల నేని జగదీష్, మిరియాల లక్ష్మీనారాయణ , రామిశెట్టి శివప్రసాద్ తదితర కాపు నాయకులు ఈ పునర్నిర్మాణం లో…
తల్లికి వందనంపై వైకాపా విమర్శలు దివాళా కోరుతనానికి నిదర్శనం: జీవీ తల్లికివందనంపై వైకాపా విమర్శలు వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఒకే రోజు 67.27 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10,091 కోట్లు జమ చేయడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అన్న జీవీ ఇంత పెద్ద ఎత్తున, ఇంత పారదర్శకంగా సంక్షేమ పథకంపై వైకాపా, జగన్ విమర్శలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. శనివారం ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో విపక్షంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారాయన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే హామీల్లో 80% అమలు చేసి, ప్రజలకు నమ్మకం కల్పించిన ఘనత సాధించిందన్నా రు. మరీ ముఖ్యంగా సూపర్సిక్స్ హామీల్లో తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు గౌరవం, విద్యావ్యవస్థకు బలం, సామాజిక సంక్షేమానికి పట్టం కట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. నిజానికి తల్లికి…
పేటలో కంపోస్టు యార్డును పరిశీలించిన అధికారుల బృందం చిలకలూరిపేట: పురపాలక సంఘ పరిధిలోని కంపోస్టు యార్డును శనివారం నాడు ఎస్. ఈ.దాసరి శ్రీనివాసరావు.ఆర్.డి. ఎస్ హరికృష్ణ,ఈ.ఈ వెంకటేశ్వర్లు. పబ్లిక్ హెల్త్ రవికుమార్. ఎండి. శ్రీనివాసరావు. (ప్రాంతీయ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు) మరియు మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరి బాబు లు పరిశీలించారు.ఈ పరిశీలనలో యార్డు నిర్వహణ, వ్యర్థాల శుద్ధి ప్రక్రియ, పారిశుద్ధ్య పనులు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. యార్డులో జరుగుతున్న పనుల పురోగతిని, వాటి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంపోస్టు యార్డు మెరుగుదలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. పారిశుద్ధ్య నిర్వహణలో కంపోస్టు యార్డు కీలక పాత్ర పోషిస్తున్నందున, దాని పనితీరును మరింత సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.









