Author: chilakaluripetalocalnews@gmail.com

ఘనంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు, పేదలకు దుస్తులు పంపిణీ-చైర్మన్ రఫాని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ స్కావెంజర్స్ వర్కర్స్ కు బట్టల పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ రఫాని నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు,జనసేన నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు నాడు పేదలకు దుస్తులు పంపిణీ చేయడం సంతోషం గా ఉందని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు.

Read More

వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన మదల కిరణ్ కుమార్ పిడుగురాళ్ల పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షులుగా నియమించినందుకు గాను మాదల కిరణ్ కుమార్ , పిడుగురాళ్ల పట్టణ నాయకులు మరియు వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కాసు మహేష్ రెడ్డి గారిని కలుసుకొని తనకు వైస్సార్సీపీ లో తాగు స్థానం కల్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తమ పూర్తి మద్దతు అందిస్తామని,కాసు మహేష్ రెడ్డి గారి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తామని వారు తెలిపారు.అలాగే గురజాల నియోజకవర్గం లో వైస్సార్సీపీ పార్టీ ని రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తాను.

Read More

యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామ వాస్తవ్యులు బండ్లమూడి కళాధర్ గారి తండ్రి సాంబశివ ప్రసాద్ గారు స్వర్గస్తులైనారు.ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యుడు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ కార్యక్రమంలో వారి వెంట కొమ్మినేని కోటయ్య గారు, ఘంటా మల్లేశ్వరరావు గారు, యడవల్లి శ్రీరామమూర్తి గారు, చాగంటి శ్రీధర్ గారు, ఘంటా వెంకటేశ్వరరావు గారు, ఘంటా శ్రీనివాస రావు గారు తదితరులున్నారు

Read More

చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని వేంకటేశ్వరుని వేడుకున్నాను : మాజీమంత్రి ప్రత్తిపాటి “రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబునాయుడి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, ఆయన నాయకత్వంలోని కూటమిప్రభుత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కలియుగదైవం వేంకటేశ్వరుని వేడుకున్నట్టు మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మహానాడు చివరిరోజైన గురువారం ఉదయం ప్రత్తిపాటి తిరుమల శ్రీవారిని దర్శించుకొని, స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం తిరుమల మాడవీధుల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమిప్రభుత్వంలో రాష్ట్రం దినదినాభివృద్ధి చెంది, దేశానికే గర్వకారణంగా నిలవాలని, ఆ దిశగా ఏపీ పురోగతిసాధనకు అవసరమైన శక్తియుక్తుల్ని ముఖ్యమంత్రికి ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. స్వామివారి అనుగ్రహంతోనే పార్టీ పండుగైన మహానాడు అనుకున్నదానికంటే ఎక్కువగా విజయవంతం అయిందని ప్రత్తిపాటి చెప్పారు. మహానాడులో తీర్మానాలన్నీ దిగ్విజయంగా అమలై లోకేశ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విధంగా ఎదగాలని స్వామిని ప్రార్థించినట్టు ఆయన చెప్పారు. అలానే…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు వినుకొండ శాసన సభ సభ్యులు & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా – పల్నాడు జిల్లా – 31-05-2025|| 25+ ప్రముఖ కంపెనీలు వేదిక: బస్టాండ్ దగ్గరలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ,వినుకొండ ,పల్నాడు జిల్లా తేదీ: 31-05-2025 (శనివారం)సమయం: ఉదయం 09:00 గంటల నుండి విద్యా అర్హతలు:SSC, ఇంటర్మీడియట్ / ITI (ఏదైనా ట్రేడ్) / డిప్లొమా (ఏదైనా శాఖ) / ఏదైనా డిగ్రీ / B.Tech / B.Pharmacy / MBA వయస్సు: 18 నుండి 35 సంవత్సరాల మధ్య కంపెనీల సంఖ్య: 25+ఖాళీల సంఖ్య: 1500+ వెబ్‌సైట్ లింక్: https://forms.gle/a6tsT1iJkML8BtDCA గమనిక: ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇవ్వబడిన వెబ్సైట్ లింకు లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను. ఎమ్మెల్యే గారి కార్యాలయం : 77805 73…

Read More

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 1995 నుంచి 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా అసమాన నాయకత్వంతో తెలుగుదేశం పార్టీని దేశంలోనే అగ్రగామి రాజకీయ శక్తిగా తీర్చిదిద్దిన చంద్రబాబు గారి నాయకత్వం అనితరసాధ్యం. చంద్రబాబు గారి నాయకత్వం, విజనరీ ఆలోచనలు, రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి యావత్ తెలుగు జాతికి స్ఫూర్తిదాయకం. ఆయన నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించేందుకు పునరంకితం అవుతాం. జీవీ ఆంజనేయులుప్రభుత్వ చీఫ్‌ విప్,వినుకొండ శాసనసభ్యులు

Read More

తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి గౌరవ డా. నందమూరి తారక రామారావు గారు.– పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ పల్నాడు జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డా.శ్రీ.నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినము సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి, ఘన నివాళులు అర్పించిన శ్రీ ఎస్పీ గారు, ఇతర పోలీస్ అధికారులు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు లో జన్మించిన ఆయనకు ఉమ్మడి గుంటూరు జిల్లాతో మంచి అనుబంధం ఉంది.ఆయన గుంటూరు పట్టణంలోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల నందు విద్యను అభ్యసించారు.విద్యాభ్యాసం అనంతరం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తూ నాటకరంగంపై ఆయనకున్న అభిరుచితో సినిమా రంగంలోకి అడుగుపెట్టినారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని,…

Read More

పొలాల్లోకి దూసుకుపోయిన ఆటో ఆటో లో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు పెదనందిపాడు ఆసుపత్రికి తరలింపు ఆటో ముందు వీల్ విరిగిపోవడంతో పొలాల్లోకి వెళ్లిన ఆటో చిలకలూరిపేట సమీపంలో ని ఉప్పలపాడు వద్ద ఘటన చిలకలూరిపేట నుండి పెదనందిపాడు వెళుతున్న ఆటో ఉప్పలపాడు వద్ద అడుపుతప్పింది. ఉప్పలపాడు నందనవనం దాటి వస్తుండగా ఆటో ముందు చక్రం విరిగి పోవడంతో సైడ్ పొలాల్లోకి దూసుకు పోయింది. ,ఆటోలో ఇద్దరు ప్రయాణిస్తున్నారు ఒకరికి తీవ్ర గాయాలు మరొక ఆటోలో పెదనందిపాడు ఆస్పత్రికి తరలింపు, ఎవరికి ఏలాంటి ప్రాణాపాయం లేదు

Read More

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో వైసిపి గెలుస్తుంది – మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షులుగా నియమితులైన మొగిలి ఆంజనేయులు గారు మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ యువకుడు ,ఉత్సాహవంతుడు అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న మొగిలి ఆంజనేయులు గారికి ST విభాగం అధ్యక్షులుగా నియమించడం చాలా ఆనందంగా ఉందని, 10 సంవత్సరాల నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, బాధ్యతగా పనిచేసే ,అందర్నీ కలుపుకొని పోయే వ్యక్తని ,పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ,పార్టీ కోసం కష్టపడి పనిచేసేమనస్తత్వం ఉన్న వ్యక్తిని ఎంపిక చేయటం సంతోషకరమని ,…

Read More

చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు స్వామివారి బింబపు విమాన శిఖరము, జీవ ధ్వజ పునః ప్రతిష్టా మహోత్సవం దైవజ్ఞుల నిర్ణయం మేరకు జరుగుచుండగా ఈ మహత్తర ప్రతిష్టా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మరియు గ్రామ ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి, తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ ప్రతిష్టా మహోత్సవంలో వారికి సాదర స్వాగతం పలికిన కట్టా జవహార్ బాబు గారు, కందిమళ్ళ శ్రీనివాసరావు గారు, గణేషుని లక్ష్మీనారాయణ గారు, నార్నె హనుమంతరావు గారు, దేవరకొండ గోపి గారు,కంతేటి హనుమంతరావు గారు, కొండ్రగుంట కృష్ణయ్య గారు, బోడ వీరరాఘవులు గారు, గణేషుని యజ్ఞ నారాయణ గారు, కందిమళ్ళ సత్యనారాయణ గారు తాళ్లూరి సింగారావు గారు, కట్టా నాగేశ్వరరావు గారు తదితరులున్నారు.

Read More