పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశమని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో బుధవారం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చేయూత చక్రాలు అనే నినాదంతో రోటరీ క్లబ్ చిలకలూరిపేట, రోటరీ క్లబ్ పండరీ పురం… అద్ధంకి తదితర క్లబ్ ల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు జాస్తి రంగారావు, వెంకటేశ్వరరావు, లంక ఆదినారాయణ, వారణాసి శరత్ కుమార్,లతో పలువురు సభ్యులు పాల్గొన్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించడంజిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రత కమిటీలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గతంలో కన్నా అధికంగా జరుగుతున్న కారణంగా వాటిని నివారించడానికి జిల్లా కలెక్టర్ గారు రవాణా శాఖ, పోలీస్ శాఖ వారిని జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగినది.ఈ ఆదేశాల మేరకు తేది 18-06-2025 బుధవారం నాడు పోలీసు, రవాణా శాఖ మరియు R.T.C. అధికారులు చిలకలూరిపేట నుండి నరసరావుపేట వెళ్ళు రహదారిలో తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా ఇన్సూరెన్సు సర్టిఫికెట్ , పొల్యూషన్ సర్టిఫికెట్ పన్ను చెల్లించని, మరియు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనములు నడుపుచున్న వారి పై కేసులు నమోదు చేయడం జరిగినది. ఇందులో భాగంగా సుమారు 45 వాహనములు తనిఖీచేసి 13 వాహనములకు కేసులు నమోదు చేసినాము. ఇందులో ఇన్సూరెన్సు సర్టిఫికెట్ లేనివి 7, పొల్యూషన్ సర్టిఫికెట్ లేనివి 6, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనివి 5,…
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలిపంటలకు గిట్టుబాటు ధర కల్పించాలిరైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన చిలకలూరిపేట:అన్ని విధాలుగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు డిమాండ్ చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల, తుబాడులో ఇరువురు రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనకు నిరసనగా సీపీఐ,సీపీఎం, కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాలతో కూడిన రైతు సంఘాల సమన్వయకమిటి ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో విఫలమైందన్నారు. నకిలీ, కల్తీ విత్తనాలు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, పెట్రో ధరాఘాతం, ప్రభుత్వ నిరాదరణ.. ఈ…
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒకే రోజు ఇద్దరు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం! -మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లకు చెందిన ఆదినారాయణ,తూబాడుకు చెందిన చిరుబోయిన గోపాలరావు పొలంలోనే పురుగులు మందు తాగి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు ఆదినారాయణ,గోపాలరావుల భౌతికకాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు,ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు,రైతులు పండించిన ఏ పంటకు కనీసం గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది,రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం..మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యాడికి వెళ్లి మిర్చికు గిట్టుబాటు ధర…
ఏపీలో ముగ్గురు రైతులు ఆత్మహత్య గిట్టుబాటు ధర లేక..అప్పులు తీర్చలేమని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతులు పల్నాడు జిల్లా నాదెండ్ల మండల కేంద్రంలోని రామాపురం కాలనీకి చెందిన నాసం ఆదినారాయణ (45) అనే రైతు గిట్టుబాటు ధర లేక అప్పులు చెల్లించే పరిస్తితి లేక ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన సిరిబోయిన గోపాల్ రావు (44) అనే రైతు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవడంతో, తన ట్రాక్టర్ ను స్వాధీనం చేసిన అప్పు ఇచిన వారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన బండి కొండయ్య (52) అనే రైతు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, అప్పులు తీర్చలేనని ఆవేదనతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న…
మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో.. ముటుకూరు గ్రామం నుండి చంద్ర కుంట తండా వెళ్లే రోడ్డు.. రాళ్లు రప్పలతో, ముళ్ళ కంపలతో మూసుకుపోయి రాకపోకలకు వీలు లేక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం టిడిపి ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్వహిస్తున్న గ్రామాల్లోని పొలాలు డొంకలు అభివృద్ధిలో భాగంగా.. ఈ రహదారికి మోక్షం కలిగింది. ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు గారు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, నాయకులు, రైతులు ప్రోద్బలంతో.. సుమారు 6కి. మీ మేర గ్రావెల్ రోడ్డు గా సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందింది. ఈ రెండు గ్రామాలకు మధ్య కనెక్టివిటీ పెరిగి ప్రజలకు మార్గం ఏర్పడింది.
ఈ నెల 22, 23 తేదీల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలు చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కొనుగోలు కేంద్రాలు వెల్లడించిన మార్కెట్ యార్డ్ కార్యదర్శి దేవరకొండ తిరుపతి రాయుడు మొదటగా ఈ నెల 18 న ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలు…. కొన్ని అనివార్య కారణాల రీత్యా… వాయిదా పడింది. ఈ నెల 22,23 తేదీ లలో చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపిన కార్యదర్శి తిరుపతి రాయుడు . ప్రారంభం కాగానే రైతులు పొగాకు మార్కెట్ యార్డ్ కు తీసుకురావచ్చని కోరిన కార్యదర్శి తిరుపతి రాయుడు
భక్త మహాశయులకు విజ్ఞప్తి మన పోలిరెడ్డి పాలెం గ్రామంలోని చేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజ్ఞేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు అనగా ది 18 .6. 2025. బుధవారము స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రం పురస్కరించుకొని ఉదయము ఎనిమిది గంటల 30 నిమిషాల నుండి స్వామివారికి పంచామృతాభిషేకములు పూజా మహోత్సవ కార్యక్రమం జరుగును తదుపరి తీర్థ ప్రసాద వినియోగం జరుగును మధ్యాహ్నము 12:30 నుండి స్వామి వారి యొక్క మహా అన్నప్రసాద వికరణ జరుగును కావున భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.ఇట్లు శ్రీ అభయాంజనేయ స్వామి వారి భక్త బృందం పోలిరెడ్డి పాలెం
గత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ఫలితాలే ఈ బలవన్మరణాలు – తెదేపా నేతలునాదెండ్ల గ్రామం మరియు నాదెండ్ల మండలంలోని తుబాడు గ్రామంలో ఇరువురు రైతులు సోమవారం బలవన్మరణానికి పాల్పడటానికి కారణం గత వైకాపా ప్రభుత్వం పాలించిన 5 సంవత్సరాలలో , వారు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలే కారణం అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజిని మరియు వైకాపా నేతలు ఇటివల కొద్ది కాలం నుండి శవ రాజకీయాలు మొదలు పెట్టారని, గత 5,6 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ, నష్టాల పాలై అప్పుల ఊబిలోకి కూరుకుపోయి, తప్పని పరిస్థితులలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు ఏ విధంగా సాయం అందించి ఆదుకోవాలి అనే స్పృహ కోల్పోయి, కేవలం పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఎవరూ చనిపోయిన రైతులను పరామర్శించలేదు, ఆదుకోలేదు అని అవాకులు, చవాకులు పెడుతుందని వారు తెలిపారు. ఇరువురు రైతుల ఆత్మహత్యల పట్ల మాజీ…
ఇటు సంక్షేమం… అటు రాష్ట్రాభివృద్ధి..లక్ష్యాలతో..సుపరిపాలన తో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం తో ప్రజల్లో విశ్వాసం పెంచిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం తో హర్షం వ్యక్తం చేస్తున్నా మహిళలు సూపర్ సిక్స్ లోతల్లికి వందనం… సూపర్ సక్సస్ అవడంతో కూటమి ప్రభుత్వానికి భారీ గా పెరిగిన మైలేజ్ చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటి వరకు 9827 మందికి చేరుకూరిన తల్లికి వందనం లబ్ది ఈ 9827 మంది విద్యార్థులు కు ఒక్కొక్కరికి 13000 చొప్పున 12,77,5100 రూపాయలు వారి తల్లుల ఖాతాల్లో జమ అత్యధికంగా మద్దినగర్ ఏరియాలో 747 మంది విద్యార్థులు కు…. అత్యల్పంగా పండరీ పురం ఏరియాలో 85మంది విద్యార్థులు కు లబ్ది వార్డులవారీగా …సచివాలయాల ద్వారా లబ్ది పొందిన విద్యార్థులు వారి వివరాలు మొత్తం పట్టణ పరిధిలో34వార్డులకు గాను …. 29 సచివాలయాలు ఉన్నాయి… సచివాలయం 1పరిధిలోకుమార కాలనీ, ఎన్టీఆర్ కాలనీఈ ప్రాంతంలో…









