Author: chilakaluripetalocalnews@gmail.com

రోడ్లపై పశువులను వదిలివేస్తున్న యజమానులకు పురపాలక సంఘం వారి హెచ్చరిక చిలకలూరిపేటపట్టణంలో ఆవులు, గేదెలు రోడ్లపై తిరగడం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబుతెలిపారుపశువుల వల్ల పారిశుద్ధ్య పనులకు కూడా ఆటంకం కలుగుతోందని ఈ సమస్యను పరిష్కరించేందుకు పురపాలక సంఘం కఠిన చర్యలకు సిద్ధమైంది.రాబోయే మూడు రోజులలోపు తమ పశువులను రోడ్లపై వదిలివేయకుండా, వాటిని తమ సంరక్షణలో ఉంచుకోవాలని పశువుల యజమానులను ఆదేశించింది.ఈ ఆదేశాలను పాటించని పక్షంలో, పురపాలక సంఘం ఆ పశువులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తుందని హెచ్చరించింది.అంతేకాకుండా, సంబంధిత యజమానులపై చట్టపరమైన కేసులు కూడా నమోదు చేయబడతాయని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు స్పష్టం చేశారుపట్టణ ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం పరిరక్షణకు ఈ చర్యలు తప్పవని పురపాలక సంఘం పేర్కొంది.

Read More

ఈ నెల 18 న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అజెండాలో 27 కీలక అంశాలు… ఆమోదానికి సిద్ధంగా ఉన్న కౌన్సిల్ సభ్యులు సమావేశానికి హాజరు కావాలని ఆయా వార్డుల కౌన్సిలర్ లకు ఇప్పటికే ఆహ్వానాలు పంపిన మున్సిపల్ చైర్మన్ రఫాని అజెండా లో 27 కీలక అంశాలు చేర్చి కౌన్సిల్ ఆమోదానికి సమావేశంలో ప్రవేశపెట్టనున్న అధికారులు మున్సిపల్ చైర్మన్ రఫాని అధ్యక్షత న జరిగే ఈ కౌన్సిల్ కు 38వార్డులకు చెందిన కౌన్సిలర్ లు తప్పక హాజరు కావాలని సూచించిన చైర్మన్ అజెండా లో పలు అభివృద్ధి పనులు కు సంబంధించిన రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి శ్రీకారం చుట్ట నున్నారు. సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు ను దృష్టిలో పెట్టుకొని అజెండా రూపొందించిన మున్సిపల్ అధికారులు బృందం

Read More

ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ కార్యవర్గ సర్వసభ్య సమావేశం చిలకలూరిపేట:ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ కార్యవర్గ సర్వ సభ్య సమావేశం ఈ నెల 20వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వున్న రెడ్ క్రాస్ భవన్ లో నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్షులు, మరియు తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఈ సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటు పై చర్చ వుంటుందన్నారు. అలాగే గతంలో పనిచేసిన కార్యక్రమాల పై సమీక్ష చేయనున్నట్టు వివరించారు. గత కొంత కాలంగా రెడ్ క్రాస్ సేవలు స్థబ్దంగా ఉన్నందున నూతన కమిటీ ఏర్పాటు చేసి సేవలను విస్తృతం చేయనున్నట్టు తహసిల్దార్ తెలిపారు. సభ్యులు వచ్చేటప్పుడు తమ ఐడెంటిటీ కార్డులు తీసుకు రావాలన్నారు. అలాగే నూతనంగా సభ్యులుగా చేరేవారు సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యులుగా చేరవచ్చు అన్నారు.

Read More

నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణం: *నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ దాడి నూజెండ్ల నమస్తే పల్నాడు జులై 16 వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, ఐనవోలు గ్రామంలో తెల్లవారుజామున (జూలై 16, 2025) దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఈ దాడిలో దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు. మంటల్లో చిక్కుకున్న వారి అరుపులు వినిపించడంతో స్థానికులు వెంటనే స్పందించి, మంటలను ఆర్పేసి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి, ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి, పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి వెనుక గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వ్యక్తిగత…

Read More

చిలకలూరిపేటలో బీ శ్రీను నాయక్ జన్మదిన వేడుకలు చిలకలూరిపేట లోని అమృత దాబా వద్ద చిలకలూరిపేటలోని పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ జన్మదిన వేడుకలు పులదండలతోటి, శాలవాళతోటి సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేయటమే కాకుండా, తన కలంతో పలు సమస్యలను వెలికి తీస్తున్నారు గిరిజన సంఘాల ద్వారా గిరిజన ప్రజల ఆర్థిక, సామాజికంగా చైతన్యవంతం చేయటమే కాకుండా గిరిజన ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు మునుముందు గిరిజన ఇతర ప్రజల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించాలని నాయకులు అభివర్ణించారు భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అందరు తెలియజేశారు

Read More

మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబుకు అభినందనలు తెలియజేసిన: చైర్మన్ రఫాని చిలకలూరిపేట : ప్లాస్టిక్ నిషేధం పై కఠిన చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్పి. శ్రీహరి బాబుకు, మునిసిపల్ చైర్మెన్ షేక్ రఫానీ అభినందనలు తెలియజేసి సచివాలయ సిబ్బంది మెప్మా రిసోర్స్ పర్సనల్ చేత చప్పట్లతో హర్షవర్ధన్ చేయించారు. స్థానిక పురపాలక సంఘంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో మెప్మా సిబ్బంది సచివాలయా సెక్రటరీలతో మునిసిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని నేడు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం చర్యలో భాగంగా నేడు వ్యాపారస్తుల దుకాణాలపై తనిఖీలు పంపించిన కమిషనర్ కు సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ అభినందించడమే కాకుండా చప్పట్లతో హర్షం ప్రకటించిన ఘటన చోటుచేసుకుంది.. పట్టణ ప్రజల ప్రజారోగ్యంపై చిత్తశుద్ధితో వివరించే ఇటువంటి అధికారులను అభినందించడం అందరి బాధ్యతఅని కొనియాడారు..

Read More

వినుకొండ నియోజకవర్గం లో సొసైటీ డైరెక్టర్లుగా ఎన్నుకోబడ్డ జనసైనికులు…. ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారి సూచనల మేరకు ఎన్నుకోపడ్డ సొసైటీ డైరెక్టర్లు ఈపూరు సొసైటీ : చిందుకూరి నరసింహారావు జనసేన పార్టీ తరఫున ఎన్నుకోబడ్డ సొసైటీ డైరెక్టర్లకి వినుకొండ జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

Read More

పురుషోత్తమ పట్నంలో సుపరిపాలనకు తొలి అడుగు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సుపరిపాలనకు తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో డీఎస్సీ, 4000 ఫింషన్స్, తల్లికి వందనం, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, కల్తీ మద్యం నుంచి నాణ్యమైన, తక్కువ ధరకే మద్యం అందిస్తూ, అన్ని కులాలకు సబ్సిడీ రుణాలు అందిస్తూ, అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరకే మించి ఆహారం అందిస్తూ, ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత,మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు రాజకీయంగా అడుగుపెట్టిన దగ్గర నుంచి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిరంతరం శ్రమిస్తు, నియోజ వర్గం పార్టీ నాయకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, ఎవరు ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తూ పార్టీని అభివృద్ధి…

Read More

ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన వారిని పై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం : అర్బన్ సీఐ రమేష్ చిలకలూరుపేట: పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థినుల భద్రతకు సంబంధించి అర్బన్ సీఐ పి. రమేష్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో గాంధీనగర్, సుబ్బయ్యతోట, శారదా హైస్కూల్, ఈస్ట్ క్రిస్టియన్ పేట, బీఆర్ఐజీ పండరీపురం వంటి అనేక విద్యాసంస్థలు ఉన్నాయని, ఇక్కడ చాలా మంది యువత చదువు నిమిత్తం పాఠశాలలకు, కళాశాలలకు వస్తున్నారని ఆయన తెలిపారు. కొంతమంది ఆకతాయిలు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే, వచ్చే సమయాల్లో ఆ సెంటర్ల వద్ద నిలబడి ఈవ్ టీజింగ్‌కుపాల్పడుతున్నారని సమాచారం అందిందని సీఐ రమేష్ వెల్లడించారు. ఈ సమాచారం నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో కొన్ని టీమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీమ్‌లు ప్రతిరోజు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. “ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన వారిని తీసుకువచ్చి…

Read More

పోగొట్టుకున్న బ్యాగ్ మరియు ఫోన్ రికవరీ… గంటల వ్యవధిలో రికవరీ చేసి బాధితులకు అందజేసిన ఎస్ఐ. శివరామకృష్ణ. ఎడ్లపాడు మండల పరిధిలోనికొండవీడు చిల్డ్రన్ పార్క్ సందర్శనకు పర్చూరు (బాపట్ల జిల్లా) కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు 13.07.2025 రాత్రి 7 గంటల సమయంలో,కొండవీడు చిల్డ్రన్ పార్క్ సందర్శనకు వెళ్లి, అక్కడ తన బ్యాగ్ మరియు సెల్ ఫోన్ పోయాయని రాత్రి 9 గంటలకు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ శివరామకృష్ణ మరియు సిబ్బంది హెడ్‌ క్వార్టర్స్‌ను సంప్రదించి, మొబైల్ లొకేషన్ సాయంతో ఒక గంట వ్యవధి లో బ్యాగ్ మరియు ఫోన్‌ ను కొండవీడు సమీపంలోనీ అరటి తోటలో గుర్తించి తిరిగి శ్రీనివాసరావు కి అప్పగించడం జరిగింది.ఈరోజు మరొక ఫిర్యాదు మధ్యాహ్నం 12 గంటలకు తిమ్మాపురం గ్రామానికి చెందిన హార్టికల్చర్ అసిస్టెంట్ శైఖ్ ఐషా తమ మొబైల్ పోయినట్లు సమాచారం ఇచ్చారు. వెంటనే…

Read More