పురుషోత్తమ పట్నంలో సుపరిపాలనకు తొలి అడుగు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సుపరిపాలనకు తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో డీఎస్సీ, 4000 ఫింషన్స్, తల్లికి వందనం, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, కల్తీ మద్యం నుంచి నాణ్యమైన, తక్కువ ధరకే మద్యం అందిస్తూ, అన్ని కులాలకు సబ్సిడీ రుణాలు అందిస్తూ, అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరకే మించి ఆహారం అందిస్తూ, ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత,మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు రాజకీయంగా అడుగుపెట్టిన దగ్గర నుంచి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిరంతరం శ్రమిస్తు, నియోజ వర్గం పార్టీ నాయకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, ఎవరు ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తూ పార్టీని అభివృద్ధి…
Author: chilakaluripetalocalnews@gmail.com
ఈవ్ టీజింగ్కు పాల్పడిన వారిని పై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం : అర్బన్ సీఐ రమేష్ చిలకలూరుపేట: పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థినుల భద్రతకు సంబంధించి అర్బన్ సీఐ పి. రమేష్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో గాంధీనగర్, సుబ్బయ్యతోట, శారదా హైస్కూల్, ఈస్ట్ క్రిస్టియన్ పేట, బీఆర్ఐజీ పండరీపురం వంటి అనేక విద్యాసంస్థలు ఉన్నాయని, ఇక్కడ చాలా మంది యువత చదువు నిమిత్తం పాఠశాలలకు, కళాశాలలకు వస్తున్నారని ఆయన తెలిపారు. కొంతమంది ఆకతాయిలు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే, వచ్చే సమయాల్లో ఆ సెంటర్ల వద్ద నిలబడి ఈవ్ టీజింగ్కుపాల్పడుతున్నారని సమాచారం అందిందని సీఐ రమేష్ వెల్లడించారు. ఈ సమాచారం నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో కొన్ని టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీమ్లు ప్రతిరోజు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. “ఈవ్ టీజింగ్కు పాల్పడిన వారిని తీసుకువచ్చి…
పోగొట్టుకున్న బ్యాగ్ మరియు ఫోన్ రికవరీ… గంటల వ్యవధిలో రికవరీ చేసి బాధితులకు అందజేసిన ఎస్ఐ. శివరామకృష్ణ. ఎడ్లపాడు మండల పరిధిలోనికొండవీడు చిల్డ్రన్ పార్క్ సందర్శనకు పర్చూరు (బాపట్ల జిల్లా) కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు 13.07.2025 రాత్రి 7 గంటల సమయంలో,కొండవీడు చిల్డ్రన్ పార్క్ సందర్శనకు వెళ్లి, అక్కడ తన బ్యాగ్ మరియు సెల్ ఫోన్ పోయాయని రాత్రి 9 గంటలకు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ శివరామకృష్ణ మరియు సిబ్బంది హెడ్ క్వార్టర్స్ను సంప్రదించి, మొబైల్ లొకేషన్ సాయంతో ఒక గంట వ్యవధి లో బ్యాగ్ మరియు ఫోన్ ను కొండవీడు సమీపంలోనీ అరటి తోటలో గుర్తించి తిరిగి శ్రీనివాసరావు కి అప్పగించడం జరిగింది.ఈరోజు మరొక ఫిర్యాదు మధ్యాహ్నం 12 గంటలకు తిమ్మాపురం గ్రామానికి చెందిన హార్టికల్చర్ అసిస్టెంట్ శైఖ్ ఐషా తమ మొబైల్ పోయినట్లు సమాచారం ఇచ్చారు. వెంటనే…
అక్రమ పీడీఎస్ రేషన్ స్వాధీనం నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 45 కిమ్టాళ్ల పిడిఎస్ రైస్ ని స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసిన అధికారులు. వివరాల ప్రకారం చిరుమామిళ్ల గ్రామంలోని 38వ నంబర్ డిపోలో పోతిరెడ్డి అంజిరెడ్డి అనే డీలర్ పేదలకు అందువలసిన రేషన్ బియ్యాన్ని వారికి ఇవ్వకుండా అక్రమంగా నిలువ చేసి అమ్ముకుంటున్నారు, ఈ విషయాన్ని గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు,ఆయన ఆదేశాల మేరకు నాదెండ్ల వీఆర్వో పోలీస్ అధికారులతో కలిసి అక్రమంగా నిల్వ ఉంచిన డిపో మీద ఆకస్మిక తనిఖీలు చేసి నిల్వ ఉంచిన పిడిఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని 6A కేసు నమోదు చేశారు.
చిలకలూరిపేటలో అడ్డూ అదుపూ లేకుండా ప్లాస్టిక్ వాడకం ప్రజారోగ్యం, పర్యావరణానికి తీవ్ర ముప్పు! చిలకలూరిపేట పట్టణంలో ప్లాస్టిక్ వాడకంపై అధికారులు, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ కొరవడటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. నిబంధనలు ఉన్నప్పటికీ, ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని, దీనివల్ల ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని స్పష్టమవుతోంది. టీ కోట్లలో ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంపట్టణంలో అత్యంత సాధారణంగా కనిపించే దృశ్యం టీ దుకాణాల్లో ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం. నిత్యం వేలాది మంది ప్రజలు ఈ ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ తాగుతున్నారు. వేడి పానీయాలు ప్లాస్టిక్తో కలవడం వల్ల రసాయన కాలుష్యం జరిగి, ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా దీనివల్ల రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. పట్టణంలో ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ప్రజలు తమ ఆరోగ్యాన్ని కూడా…
ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సమస్యల పరిష్కారం అద్భుతమైన సేవలు అందిస్తున్నందుకు ఈయ సేవలకుగాను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందించి, సత్కారం పేట అర్బన్ సీఐ రమేష్ సేవలు ప్రశంసనీయం చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న నిబద్ధతకు విశేష ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను సానుకూలంగా విని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని బాధితులకు న్యాయం అందించడంలో ఆయన ముందున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్న సీఐ రమేష్ సీఐ రమేష్ తన సమర్థవంతమైన పనితీరుతో పట్టణ ప్రజల మన్ననలను పొందారు. ముఖ్యంగా, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. మాజీ మంత్రి ప్రత్తిపాటి చేతుల మీదుగా సత్కారం పత్తిపాటి గార్డెన్స్లో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు వేలాది మంది…
చిలకలూరిపేట పట్టణంలో తెలగ, బలిజ, కాపు కళ్యాణ మండప పునః నీర్మాణ సమావేశం చిలకలూరిపేట పట్టణంలో ని కృష్ణ డోంక లో గల తెలగ,బలిజ, కాపు కళ్యాణమండపం పునః నీర్మాణ సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. సమావేశంలో కాపు నాయకులు మాట్లాడుతూ 1981 వ సంవత్సరంలో ఆనాటి కాపు పెద్దలు సహకారంతో స్థలము సేకరించి కొంత నిర్మాణం చేపట్టి ఉన్నారు. రెండు తరాలు దాటి మూడోతరం కారు ఈ కళ్యాణ మండపం పునర్నిర్మాణం చేపట్టటం చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ మండపానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని కాపు నాయకులు తెలియజేశారు. కొంతమంది కాపు నాయకులు వారి యొక్క విరాళాలు లక్షల్లో ప్రకటించి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు. కాపు కళ్యాణ మండపం పునః నీర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిన వారి టీమును కాపు నాయకులందరూ అభినందించారు. చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకులందరూ పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం…
అనుమతులు లేని వెంచర్ల మీద ఉక్కు పాదం మోపుతున్న మున్సిపల్ అధికారులు. పట్టణ ములో గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్నో వెంచర్లు వేసి పట్టణ ప్రజలను మోసం చేసి వాటిని ఎలాగో అలాగా వారికి అంటగడుతూ ఉన్నారు.ఏ ప్రభుత్వం వచ్చిన రిజిస్టర్ కార్యాలయం దగ్గర నుంచి మొదలుకొని ఆయన మాటల దాటితో వెంచర్ లేసి కొనుగోలు చేయగల ఘనుడని పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో వేసిన వెంచర్లపై మున్సిపల్ అధికారులు దాడులు చేసి నిలుపుదల చేశారు.ఎవరికి తెలియకుండాకొద్ది రోజుల క్రితం పురుషోత్తపట్నం శివారు హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద వేసిన వెంచర్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ ప్రజలకి కొనుగోలు చేశారు.ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలియగా ఆ వెంచర్ పై హద్దురాళ్లను జెసిబి సహకారంతో తొలగించి, అనుమతులు లేని వెంచర్ల పైన చర్యలు తీసుకుంటామని సదరు వ్యక్తిని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.
పెట్రోల్ బంక్ సిబ్బంది వినియోగదారుడుతో ఖచ్చితంగా మర్యాదగా ప్రవర్తించవలసిందే అని వినియోగదారుల చట్టం 2019 స్పష్టం చేస్తుంది. ……. మురికిపూడి ప్రసాద్కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షులుపెట్రోల్ బంకులను తరచుగా పర్యవేక్షించి కొలతలు సరిగా వస్తున్నాయా రావటం లేదా అనే అంశాన్ని నిర్ధారించి వినియోగదారులకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే .ఇటీవల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లో 400 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే అర లీటర్ పెట్రోల్ వచ్చిందని వినియోగదారుడు వాపోయాడు. ఇదే అంశాన్ని ప్రధాన వార్తా పత్రికలు చానల్స్ ప్రచారం చేశాయి.ఈ సంఘటన జరిగిన తర్వాత సంబంధిత అధికారులు ఆ బంకును పరిశీలించి కొలతలు కరెక్ట్ గానే ఉన్నాయని నిర్ధారించారు. ఈ మధ్యకాలంలో యజమానులు కొలతలు సరి చేసుకునే సరిచేసుకునే అవకాశం ఉంది. టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఉంది అంతిమంగా నష్టపోయేది వినియోగదారుడు మాత్రమే.పెట్రోల్ తగ్గినప్పుడు వినియోగదారుడు, బంక్ సిబ్బంది చొక్కా చొక్కా పట్టుకొని…
మంచి చేసేవారిని ఆశీర్వదించి మీ జీవితాలు బాగుచేసుకోండి : ప్రత్తిపాటి మంచి చేసేవారిని కాదని.. మిమ్మల్ని ముంచేవారిని నమ్మి గతంలో ఎంతో నష్టపోయారని, మరలా ఆ తప్పులు పునరావృతం కాకుండా ప్రజలు ఒకేమాటపై నిలిచి కూటమిప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. కొండవీడు కోట ఘాట్ రోడ్డు నిర్మించింది చంద్రబాబేనని, కోటను పర్యాటకంగా అభివృద్ధిచేస్తే చిలకలూరిపేట నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. నాలుగేళ్లలో కొండవీడును మరింత అభివృద్ధి చేస్తానని ప్రత్తిపాటి చెప్పారు. రూ.44 లక్షలతో చేపట్టిన సీసీరోడ్లు..డ్రైన్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ప్రత్తిపాటి సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా శనివారం ఆయన లింగారావుపాలెం, కోట, సంతపేట, చెంగిజ్ ఖాన్ పేట గ్రామాల్లో పర్యటించారు. తొలుత లింగారావుపాలెంలో దాతల సహాకారంతో ఏర్పాటుచేసిన మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించిన ప్రత్తిపాటి రూ.13లక్షలతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం కోట గ్రామంలో రూ.8లక్షలతో,…









