Author: chilakaluripetalocalnews@gmail.com

ప్రత్తిపాటి గట్టిగా దృష్టి పెడితే రజనీ జైలుకెళ్లడం ఖాయం రజనీ, ఆమె అనుచరులు ఒళ్లుదగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది : పిల్లి కోటి (నియోజకవర్గ ఐ-టీడీపీ కోఆర్డినేటర్) “ నియోజకవర్గ వైసీపీనాయకులు పిచ్చెక్కి, మతి భ్రమించి మదమెక్కి మాట్లాడుతున్నారు. వారంతా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టయితే మేం స్వయంగా చందాలు వేసుకొని వారి చికిత్సకు సహకరిస్తాం. రజనీ వ్యాఖ్యలు వింటుంటే నవ్వొస్తోంది. తన ఇల్లు భారీస్థాయిలో నిర్మించుకొని, ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రిని రజనీ గాలికి వదిలేశారు. చివరకు ఆసుపత్రుల నుంచి కమీషన్లు వసూలుచేసిన ఘనత ఆమెది.. ఆమె మరిదిది. తన మరిది జైల్లో ఉంటే పరామర్శకు కూడా వెళ్లని మనిషి రజనీ. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటివరకు ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా ప్రత్తిపాటి… టీడీపీ ప్రభుత్వాలు చేసిందే. రజనీ ఇకపై హద్దులు మీరి మాట్లాడితే, ఆమె నాలుక తెగ్గోయడానికి కూడా వెనుకాడం. పగలు ఒకపార్టీలో.. రాత్రి మరో పార్టీలో కొనసాగే…

Read More

30 లక్షల రూపాయల ఖర్చుతో శాశ్వత తాగునీటి పైపులైన్ల పనులను ప్రారంభించిన కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ చిలకలూరిపేట నియోజకవర్గం, లింగంగుంట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీమంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ పాల్గొన్నారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి సుభాష్, కృష్ణ తేజ, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ఏ ఒక్కరికైనా కొన్ని అనివార్య కారణాలతో సూపర్ సిక్స్ పథకాలు రావడం లేదని నాయకుల దృష్టికి కానీ నా దృష్టికి గాని తీసుకువస్తే వారికి ఆ పథకాలు ఎందుకు రావడం…

Read More

మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలపై కౌన్సిల్ ల్లో పరస్పర చర్చలు. కోర్టులకు లోబడి పని చేస్తాం: మున్సిపల్ కమిషనర్. విలీన గ్రామాలపై అర్జీల రూపంలో తెలియజేయండి: మున్సిపల్ చైర్మన్. అభివృద్ధి పరంగా నష్టపోతున్నాం: వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు. ఆనాడు విలీనమైన గ్రామాలపై మాట్లాడితే సహించలేదు.. ఈనాడు ఏలా మాట్లాడుతున్నారు. టిడిపి ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు. మున్సిపాలిటీలో విలీనమైన పసుమర్రు గణపవరం మానుకొండ వారి పాలెం గ్రామాల ప్రజలు అభివృద్ధి జరగక నష్టపోయారని మునిసిపల్ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు,మున్సిపల్ చైర్మన్ రఫానీల మధ్య శుక్రవారం జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో పరస్పర చర్చలు జరిగాయి. స్థానిక మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలులో కౌన్సిల్ సమావేశం జరిగింది.కౌన్సిల్ అజెండా చదవక ముందే పట్టణంలోని ఆక్రమణలు తొలగించాలని వైసీపీ కౌన్సిలర్ వి.కోటా నాయక్ కోరారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సమాధానం ఇచ్చారు. పట్టణంలో ని…

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృషి నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు. శుక్రవారం నరసరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన స్థానిక ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలతో వచ్చిన నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేకు తమ అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమం ప్రజలకు తమ సమస్యలను నేరుగా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించింది.ఈ ప్రజావేదిక కార్యక్రమం నరసరావుపేట నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని పరిష్కరించడానికి ఒక సమర్థవంతమైన వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్థానికుల నుంచి స్వీకరించిన వినతి పత్రాలలో రోడ్ల మరమ్మతు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, విద్యుత్ సరఫరా, భూ సంబంధిత వివాదాలు, మరియు సంక్షేమ పథకాల…

Read More

తుబాడులో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య నాదెండ్ల మండలం, తుబాడు గ్రామంలో విషాదం నెలకొంది. కొల్లి పార్వతి (24 సంవత్సరాలు) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది ఆమె భర్త పోలు రాజు.గురువారం, జూలై 17, న ఉదయం తన ఇంట్లోనే పార్వతి పురుగుల మందు సేవించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి .

Read More

మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన షేక్ కరీముల్లా గారు…చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన షేక్ కరీముల్లా ( టీడీపీ కరీముల్లా ) గారు, మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికైన కరీముల్లా గారిని ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు వివిధ హోదాల్లోని నాయకులు సత్కరించి అభినందించారు, కరీముల్లా గారు మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని తెలిపారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మానం వెంకటేశ్వర్లు గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, గుర్రం నాగపూర్ణాచంద్రరావు గారు, కందుల రమణ గారు, మద్దిరాల సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు…

Read More

1200 ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో నూతనంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుచిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకూ మొత్తం 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో 239 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం వారు తీసుకున్న చర్యల మేరకు 1500 ఓటర్లు పైబడి ఉన్న పోలింగ్ కేంద్రాలు స్థానంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.పట్టణ పరిధిలో 3 పోలింగ్ కేంద్రాలలో 1500 ఓటర్లు పైబడి ఉన్న కారణంగా నూతనంగా 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిన కారణంగా, ప్రస్తుతం 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇటివల ఎన్నికల సంఘం వారు తీసుకున్న చర్యలలో భాగంగా 1200 ఓటర్లు పైబడిన పోలింగ్ కేంద్రాలలో సైతం నూతనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న మార్గదర్శకాల మేరకు పట్టణంలో 27 పోలింగ్ కేంద్రాలు, చిలకలూరిపేట రూరల్ మండలం పరిధిలో 4 పోలింగ్ కేంద్రాలు, నాదెండ్ల…

Read More

వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ‘బాబు ష్యూరిటీ …మోసంగ్యారంటీ’ కార్యక్రమం సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై ప్రశ్నిస్తూ బహిరంగసభ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలను అమలు చేయాలంటూ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ మోసం – గ్యారంటీ’ పేరుతోఈ రోజు గురువారం (జూలై 17) కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు మాజీ మంత్రి విడదల రజిని నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్‌ఆర్‌టీ రోడ్డులోని మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద ప్రారంభం అయ్యే ఈ బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జెల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్‌ పరిశీలకులు పూనూరు గౌతమ్‌రెడ్డి, మాజీపార్లమెంట్‌ సభ్యులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ,అధికార ప్రతినిధి…

Read More

అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చిన జగన్.. ముఖ్యమంత్రి కుర్చీ దక్కగానే ప్రజల నోట్లో మట్టికొట్టాడు : ప్రత్తిపాటి ఏం చేసైనా.. ప్రజల్ని ఎంతగా మోసగించైనా, ఏ విధంగా ఏమార్చైనా సరే ముఖ్యమంత్రి కావాలన్న దురాశతో జగన్ 2019లో ప్రజలకు అడ్డగోలుగా హామీలిచ్చాడు. ఏ ఊరికి వెళ్తే.. అక్కడి సమస్య పరిష్కరిస్తానన్నాడు. కొన్నిచోట్ల ప్రజలు అడగకుండానే వారి మెప్పుకోసం నోటికి పనిచెప్పాడు. తీరా అధికారం దక్కగానే హామీలన్నింటినీ కట్టగట్టి తాడేపల్లి ప్యాలెస్ లో అటకెక్కించాడు. అలాంటి వ్యక్తి నేడు నిస్సిగ్గుగా 80శాతం హామీలు అమలుచేసిన చంద్రబాబును హామీలపై ప్రశ్నిస్తున్నాడు. ఏరుదాటే దాక… ఏటిమల్లన్న. దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా 2019 ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిన జగన్.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే.. వారికి ముఖం చాటేశాడు. ఎక్కడ తాను చెప్పిన వాటిపై తనను నిలదీస్తారోనన్న భయంతో పరదాలు.. పోలీసు పహారాల మధ్య దాక్కొని పాలన చేశాడు. చంద్రబాబు 143 హామీలిచ్చాడని…

Read More

పల్నాడు జిల్లాలో రైళ్లలో తిరుగుతున్న నకిలీ TTE పట్టివేత మచిలీపట్నం నుండి ధర్మవరం వెళుతున్న ఎస్ప్రెస్ రైల్లో జనరల్ బోగీల్లో తనికీలు నిర్వహిస్తున్న నకిలీ టీటీఈ అదే రైల్లో తనికీలు నిర్వహిస్తున్న గుంటూరుకి చెందిన అసలు టిటీఈ జాన్ వెస్లీకి తారసపడ్డ నకిలీ టీటీఈ టీటీఈగా గుర్తింపు కార్డు చూపాలని నకిలీ టీటీఈని ప్రశ్నించిన జాన్ వెస్లీ విధుల్లో ఉన్న జాన్ వెస్లీతో వాదనకు దిగిన నకిలీ టీటీఈ రైలు నరసరావుపేటకి రాగానే దూకి పరారైయ్యేందుకు ప్రయత్నం నరసరావుపేటలో నకిలీ టీటీఈని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం నరసరావుపేట రైల్వే పోలీసుల అదుపులో ఉన్న నకిలీ టీటీఈ కొన్ని రోజులుగా టీటీఈగా చెలామణి అవుతూ రైళ్లలో తిరుగుతున్న నిందితుడు అవినాష్ కృష్ణ గుప్తా అనే వ్యక్తి నకిలీ టీటీఈగా అవతారం ఎత్తాడని నిర్దారణకు వచ్చిన రైల్వే పోలీసులు అవినాష్ కృష్ణ గుప్తా గతంలో బిలాస్ పూర్ పరిధిలో రైల్వే గార్డుగా పనిచేసి…

Read More