శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు ,వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారు, పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు ఈ వారం “జనతా వారధి” కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్తలూరు గ్రామంలో స్థానిక బిజెపి నేత శ్రీ దివ్యకోలు నాగేశ్వరావు గారి నిర్వహణలో చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఆరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. గ్రామ రైతులకు ప్రజానీకానికి అత్యంత ముఖ్యమైన కొత్తలూరు గ్రామం నుండి అంగులూరు వెళ్లేటువంటి లింకు…
Author: chilakaluripetalocalnews@gmail.com
టీడ్కో హోసింగ్ సముదయం లొ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు సభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు… శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 52 ఎకరాలు టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన పత్తిపాటి పుల్లారావు గారికి కమిటీ సభ్యులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు, వరికూటి నాగేశ్వరరావు గారు, దడబడ పుల్లయ్య గారు, సింగరేసు పోలయ్య గారు వంకాయలపాటి వంశిధర్ గారు ఇట్టే శివ నాగేశ్వరావు…
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 52 ఎకరాలు టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన మర్రి రాజశేఖర్ గారికి కమిటీ సభ్యులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు, వరికూటి నాగేశ్వరరావు గారు, దడబడ పుల్లయ్య గారు, సింగరేసు పోలయ్య గారు వంకాయలపాటి వంశిధర్ గారు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వారివెంట నిడమానూరు హనుమంతరావు…
చిలకలూరిపేటలో పెట్రోల్ బంకుల తనిఖీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చిలకలూరిపేట: పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందనే ప్రచారం నేపథ్యంలో, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ మరియు సివిల్ సప్లైస్ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి బంకుల్లోని నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా, బాటిళ్లు లేదా క్యాన్లలో పెట్రోల్ పోయడం పూర్తిగా నిషిద్ధమని, కేవలం వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేశారు. ఆసుపత్రులు, ఫైర్ స్టేషన్ మరియు పోలీసుల వంటి అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి పత్రాల ఆధారంగా సరఫరా చేయాలని ఆదేశించారు. ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించినా లేదా అక్రమంగా నిల్వ చేసినా నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం…
పల్నాడులో సాకారమవునున్న వైద్య కళాశాల 2026-27 విద్యా సంవత్సరం నుండే 100 సీట్లతో ప్రవేశాలు ఏప్రిల్ 15 నాటికి అన్ని వసతులతో కళాశాల ఏర్పాటు పిడుగురాళ్ల, మార్చి 25: పల్నాడు జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. పిడుగురాళ్లలో నిర్మిస్తున్న నూతన ప్రభుత్వ వైద్య కళాశాల పనులు తుది దశకు చేరుకున్నాయని, 2026-27 విద్యా సంవత్సరం నుండే 100 ఎంబీబీఎస్ సీట్లతో విద్యాబోధన ప్రారంభం కానుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్ గౌర్ వెల్లడించారు. బుధవారం నాడు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, ఏపీ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావులతో కలిసి ఆయన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 15 నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి, అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా…
చిలకలూరిపేటలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన – బంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు. చిలకలూరిపేట:అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు సరఫరా నిలిచిపోతుందనే ప్రచారం చిలకలూరిపేట నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. రానున్న రోజుల్లో పెట్రోల్ మరియు డీజిల్ కొరత భారీగా ఉండబోతుందనే వార్తలతో పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు.ప్రస్తుత పరిస్థితి:
52 ఎకరాల టిడ్కో హౌసింగ్ కాలనీలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేట: లోకకళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం అవతరించిన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుని జన్మదినమైన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, చిలకలూరిపేట పరిధిలోని 52 ఎకరాల టిడ్కో (TIDCO) గృహ సముదాయంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించ తలపెట్టాము. ఈ సందర్భంగా చిలకలూరిపేట కూటమి నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ, టిడ్కో నివాసితులందరి సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడుతాయని తెలిపారు కార్యక్రమ వివరాలు ముఖ్య ఉద్దేశ్యం: రామరాజ్య స్థాపనే లక్ష్యంగా, ప్రజలందరిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి మరియు టిడ్కో లబ్ధిదారులందరిలో ఐక్యతను చాటడానికి ఈ వేడుకలను నిర్వహిస్తున్నాము. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా టిడ్కో కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామచంద్రుని కృపకు…
ఉద్యాన పంటలతోనే అధిక ఆదాయం : ప్రత్తిపాటి ప్రతి ఎకరాకు అధిక దిగుబడి. ప్రతి రైతుకు మంచి లాభం రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయానికి, పాడిపోషణకు ప్రభుత్వాలు అందించే రాయితీలను రైతాంగం సద్వినియోగం చేసుకొని, తమ జీవనప్రమాణాలు మెరుగు పరుచుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. రైతన్నా మీకోసం – అన్నదాతా సుఖీభవ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట మండలం వేలూరు, యడ్లపాడు మండలం సందెపూడి గ్రామాల్లో వ్యవసాయవిభాగం నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రత్తిపాటి పాల్గొన్నారు. వేలూరులో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి, సందెపూడిలో రూ30 లక్షలతో నిర్మించ తలపెట్టిన సామాజిక భవనం (కమ్యూనిటీ హాల్), రూ.10లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు, డ్రైన్లకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రెండు గ్రామాల్లోనూ పలువురు రైతుల ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వవిధివిధానాలు, నూతనసాగు పద్ధతులను ప్రత్తిపాటి అన్నదాతలకు అర్థమయ్యేలా వివరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన గ్రామసభల్లో మాట్లాడారు.…
పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా గారికి రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన సంచార జాతుల కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం క్రోసూరు మండలంలో ప్రధాన సమస్య అయినటువంటి మరుగుదొడ్లు మరియు పంట కాలవల మెయింటినెన్స్ గురించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు క్రోసూరు మండల బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్లజిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,పల్నాడు జిల్లా విషయం: రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార మరియు డీనోటిఫైడ్ తెగల…
బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానంయషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలు చిలకలూరిపేట లోకల్ న్యూస్ పట్టణానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోవిందు శంకర శ్రీనివాసన్ తన మనవరాలు యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక చీరాల రోడ్డులో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమంలో ఘనంగా అన్నదానం నిర్వహించారు.ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులను గోవిందు శంకర శ్రీనివాసన్ స్వయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన మిత్రులతో కలిసి వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు వెంకట సత్య సాయి కిరణ్ మరియు డాక్టర్ గోవిందు తేజస్విని దంపతుల కుమార్తె అయిన యషిక క్షేత్ర పుట్టినరోజును గౌరవ వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.వృద్ధుల ఆశీస్సులు చిన్నారి భవిష్యత్తుకు మేలుకలిగిస్తాయని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.…









