చిలకలూరిపేట రూరల్ పరిధిలో పేకాట శిబిరాలపై దాడులు: 11 మంది అరెస్ట్ చిలకలూరిపేట:మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై రూరల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుధవారం మండలంలోని పసుమర్రు మరియు మానుకొండ వారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన పేకాట శిబిరాలపై రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు:పసుమర్రు పరిధిలో: గొర్రెల మండి రోడ్డులో కోత ముక్క పేకాటాడుతున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి ₹2,200 నగదు మరియు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మానుకొండవారిపాలెం పొలాల్లో: పొలాల్లో రహస్యంగా పేకాటాడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ₹3,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా కోడిపందాలు, పేకాట…
Author: chilakaluripetalocalnews@gmail.com
విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తాసిల్దారికి వినతి పత్రం చిలకలూరిపేట: చిత్తూరు జిల్లా వి.కోట మండల ఆంధ్రజ్యోతి (ABN) విలేఖరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కిరాతక దాడిని, ఆయన హత్యను నిరసిస్తూ చిలకలూరిపేటలో పాత్రికేయ సంఘాలు గళమెత్తాయి. ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎంజేఏ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ మొహమ్మద్ హుస్సేన్కు వినతిపత్రం అందజేశారు.మంగళవారం ఉదయం వాకింగ్కు వెళ్లి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని దుండగులు వేటకొడవళ్లతో వెంటాడి అత్యంత హేయంగా హత్య చేయడంపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీగంధం చెట్ల అక్రమ రవాణాపై ఆయన రాసిన వార్తలే ఈ హత్యకు ప్రేరణగా నిలిచాయని, వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న పాత్రికేయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు వంటివని…
చిత్తూరు జిల్లా లొ ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి దారుణ హత్యను ఖండించిన కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు చిత్తూరు జిల్లాలో ఓ పత్రికా విలేకరిని చంపేశారు. వి.కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్యకు గురయ్యారు. ఉదయాన్నే ఆయన వాకింగ్ చేసే సమయంలో కొంతమంది వ్యక్తులు వెంటాడి ఇంటికి సమీపంలోనే కత్తులతో నరికి చంపేశారు. ఈ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు..ఇలాంటోళ్ళు నెల్లూరు రూరల్ మండలం లో MLA మాదిరిగా చెలరేగి పోతున్నారు ఈ దారుణ హత్యకు పాల్పడ్డ వ్యక్తులు ఎటువంటి వారైనా సరే వదిలిపెట్టకుండా పోలీసు వారు తగు చర్యలు వెంటనే తీసుకోవాలని కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు
చిలకలూరిపేటలో మారుమోగిన గోమాత నామస్మరణ: తహసిల్దార్కు హిందూ సంఘాల వినతికార్యక్రమం లొ పాల్గొన్న సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి చిలకలూరిపేట, ఏప్రిల్ 27, 2026:భారతీయ సంస్కృతికి మూలస్తంభమైన గోమాతను సంరక్షించుకోవడమే ధ్యేయంగా నేడు చిలకలూరిపేట పట్టణంలో హిందూ సంఘాలు మరియు గో సేవకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ నుండి ప్రారంభమై దేశం నలుమూలలా సాగుతున్న ఈ గోమాత పూజా కార్యక్రమాలు మరియు ర్యాలీల పరంపరలో భాగంగా, నేడు స్థానిక పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీ విశేషాలు:భారీ ప్రదర్శన: పట్టణ ప్రధాన వీధుల గుండా వందలాది మంది గో సేవకులు, భక్తులు గోమాత చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. గోమాత శరణు ఘోష: ర్యాలీ పొడవునా భక్తులు చేసిన “గోమాత శరణు” నినాదాలతో చిలకలూరిపేట పురవీధులు మారుమోగాయి. పూజా కార్యక్రమాలు: మార్గమధ్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భారతీయ జీవన విధానంలో ఆవు యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పారు. వినతిపత్రం…
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారాధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా విజయ భాస్కర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ధార గుప్తా గారు పల్నాడు జిల్లా జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మహారాజశ్రీ పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ అధికారి గారి దివ్యసముఖమునకు వ్రాసుకున్న అర్జీ విషయం: నైపుణ్యం పెంచండి… నిరుద్యోగం తగ్గించండి రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి, స్థానిక ఉద్యోగాలు, చేతివృత్తుల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కోసం సమగ్ర…
ప్రజలు అవసరానికి మించిన ఇంధనం కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి ఇంధన దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మార్పిడి వంటి చేస్తే కఠిన చర్యలు. పల్నాడు జిల్లాలో 201 పెట్రోల్ బంకులు ప్రతి పెట్రోల్ బంక్ వద్ద స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు కంట్రోల్ రూమ్ నెంబర్: 08647226999 పల్నాడుజిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఏప్రిల్ 26 : జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు.జిల్లాలో పెట్రోల్, డీజల్ సరఫరా పరిస్థితిపై ఆదివారం అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఆదివారం ఉదయం రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితిపై రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) మరియు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలిపారు.ప్రజల్లో ఆందోళన రాకుండా…
మైదవోలు యువకుడికి అంతర్జాతీయ గుర్తింపు పల్నాడు జిల్లా, ఎడ్లపాడు మండలం, మైదవోలు గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాసరావు (తాత: నక్కా నాగేశ్వరరావు, తండ్రి: నక్కా గోవిందరాజు, తల్లి: నక్కా లక్ష్మి) గారు, చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన యువకుడు, అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ కోచింగ్ కోర్సుకు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది.ఏషియన్ వాలీబాల్ కాంటినెంటల్ (AVC) పరిధిలో, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ (FIVB) డెవలప్మెంట్ ఆధ్వర్యంలో చైనాలో జూలై 17 నుండి 24 వరకు నిర్వహించనున్న FIVB లెవల్-3 కోచెస్ కోర్సుకు భారతదేశం నుండి ఎంపిక కావడం విశేషం.ఈ సందర్భంగా NDA కూటమి మాజీ మంత్రి శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు మాట్లాడుతూ, ఈ లెవల్-3 స్థాయికి ఎదగడం అనేది భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) నక్కా శ్రీనివాసరావు ఒక రికార్డు సృష్టించినట్లే అని అభినందనలు తెలిపారు.అలాగే పల్నాడు జిల్లా బీజేపీ…
వైసీపీ ఒక ‘గొడ్డలి పార్టీ’.. ఎమ్మెల్సీల రాజీనామాల తిరస్కరణపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం చిలకలూరిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీని “గొడ్డలి పార్టీ” గా అభివర్ణించారు. విలువలకు తిలోదకాలిచ్చి, హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శిస్తూ, ఆ పార్టీ అసలు స్వరూపం ఈరోజు తేటతెల్లమైందని మండిపడ్డారు.రాజీనామాలపై చైర్మన్ తీరుపై విమర్శలుతాము స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి, ఆమోదం కోసం మండలి చైర్మన్కు పత్రాలు సమర్పించినప్పటికీ, వాటిని తిరస్కరించడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీల రాజీనామాలను చైర్మన్ తిరస్కరించిన విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. చైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయం నిబంధనలకు మరియు చట్టానికి విరుద్ధంగా ఉందని, స్వచ్ఛందంగా ఇచ్చిన రాజీనామాలను ఆమోదించకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.ఈ పరిణామాలన్నీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కనుసైగల్లోనే జరుగుతున్నాయని,…
పల్నాడు జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది పల్నాడు జిల్లా జిల్లా కార్యాలయంలో ఈరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లపు కృపారావు గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభ ఉపన్యాసం చేసిన వల్లెపు కృపారావు గారు జనతా వారద కార్యక్రమం ప్రతి శుక్రవారం పల్నాడు జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని తమ సమస్యలపై వినతులు సమర్పించిన పిదప వాటి పరిష్కార కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. అలాగే ప్రతి సోమవారం భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు మరియు జనత వారది కన్వీనర్లు కో కన్వీనర్లు ప్రతి రెవెన్యూ కార్యాలయం వద్ద కూడా ప్రతి సోమవారం జనతా వారది కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఈ సదవకాశాన్ని…
హెల్మెట్ ధరించని వారి దగ్గర అపరాధ రుసుము విధించిన ఎస్సై లేఖ ప్రియాంక వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్సై లేఖ ప్రియాంక అన్నారు. గురువారం చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల రహదారిపై వాహనాలను సిబ్బందితో కలిసి ఆమె తనిఖీలు చేపట్టారు. హెల్మెట్లు లేని 17 వాహనాల వద్ద రూ.10,185 జరీమాన విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, వాహనానికి సంబంధించి RC దగ్గర ఉంచుకోవాలని, త్రిబుల్ రైడింగ్ చేయరాదని వాహనదారులకు తెలిపారు. పోలీసుల సలహాలు తీసుకొని ప్రమాదాలను నివారించాలని వాహనదారులకు ఎస్ఐ సూచనలు ఇచ్చారు.









