పల్నాడు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో, చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ వెనుక గల కాంప్లెక్స్ నందు రెండు తెలుగు రాష్ట్రాల రాధా రంగా మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు చెలికొండ ధర్మారావు అలియాస్ బుల్లెట్ ధర్మారావు ఆదేశాల ప్రకారం నేడు పట్టణంలో రాధా రంగా మిత్రమండలి నూతన కార్యాలయం చిలకలూరిపేట నియోజకవర్గ రాధా రంగా మిత్రమండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చు కోల మురళీకృష్ణ మాట్లాడుతూ ..బడుగు బలహీన వర్గాల వారి కోసం వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి ఎన్నో త్యాగాలను ,మరెన్నో ఉద్యమాలను చేపట్టినటువంటి రాధా రంగ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే నాయకులన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ఈ మిత్ర మండలి కార్యాచరణను రాబోయే కాలంలో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు, నిరుపేదలకు కుల మతాలకు పార్టీలకు అతీతంగా తమ మిత్రమండలి సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా త్వరలో నియోజకవర్గస్థాయిలో కమిటీ నియామకాలను నియమించినట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎం రాధాకృష్ణ, జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర కాపు నాయకులు మల్లెల శివ నాగేశ్వరావు, పల్నాడు జిల్లా ఎస్సీ నాయకులు అందెల శౌరి, జనసేన పార్టీ నాయకులు గోవిందు గణేష్, గిరిజన సంఘం నాయకులు శ్రీను నాయక్, రాష్ట్ర కాపునాడు నాయకులు తోట శ్రీనివాసరావు, అంకిరెడ్డి రమేషు, వట్టెం శ్రీనివాసరావు, ఏనుగుల వెంకటేశ్వర్లు, తోట సతీష్,. తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



