ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి. నియోజకవర్గంలోని వాగుల్ని ఆధునికీకరించి, వ్యవసాయానికి కీలకమైన లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థల్ని బాగుచేయాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రికి విన్నవించానని, ప్రభుత్వం సకాలంలో స్పందించి వాగుల్లోని కంపచెట్లు, పూడికతీతకు రూ.2.50కోట్లు కేటాయించిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా ప్రత్తిపాటి గురువారం చిలకలూరిపేట మండలం పసుమర్రులో పర్యటించారు. స్థానిక పశువైద్యశాలలో నట్టల నివారణ మందు.. పశుగ్రాస విత్తనాల పంపిణీ ప్రారంభించిన అనంతరం, స్వయంగా ఎక్సకవేటర్ నడిపి ఓగేరు వాగు ఆధునికీకరణ పనుల్ని ప్రత్తిపాటి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని.. గత పాలకులుచేసిన విధ్వంసాన్ని మర్చిపోతే ఎలాగన్న ప్రత్తిపాటి… ప్రజలు నేడు ప్రశాంతంగా తమ పనితాము చేసుకుంటూ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తూ, హాయిగా ఉండటానికి కారణం కూటమిప్రభుత్వం చంద్రబాబు నాయకత్వమేనన్నారు. ఆగస్ట్ 15 తర్వాత…
Author: chilakaluripetalocalnews@gmail.com
కాపుల చిరకాల వాంఛ అయిన బీసీ రిజర్వేషన్ కోసం చిత్తూరు నుండి అమరావతి వరకు పాదయాత్ర ప్రముఖ విలేఖరి కాపు నాయకులు యువకుడు సానా ప్రసాద్ కూటమి ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్ గురించి గుర్తు చేయడానికి అలాగే రిజర్వేషన్ అమలు చేయటానికి విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి సానా ప్రసాద్ ఎన్నో వ్యాయ ప్రయాసలకు ఓర్చుకొని తన ఆర్థిక స్తోమతను లెక్కచేయకుండా చిత్తూరు నుండి కడప కర్నూలు ఒంగోలు మీదగా చిలకలూరిపేటకు విచ్చేయడం జరిగింది. చిలకలూరిపేటకు విచ్చేసిన సానా ప్రసాద్కు ఘనస్వాగతం తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నాయకులు తాను చేస్తున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేసి చిలకలూరిపేటలో ఉన్న కీర్తిశేషులు వంగవీటి మోహనరంగా విగ్రహాలకు పూలమాలలు వేసి తాను చేస్తున్న పోరాటం గురించి చిలకలూరిపేట కాపు నాయకులకు యువకులకు మహిళలకు తన పాదయాత్ర ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు సానా ప్రసాదు తన మిత్ర బృందం…
శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ గారి తనయుడు మర్రి శ్రీనాథ్ గారి జన్మదిన సందర్భంగా పట్టణంలోని బాపూజీ వృద్ధాశ్రమం నందు మర్రి సైన్యం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ గారి అభిమానులు, పలువురు ప్రముఖ సీనియర్ నాయకులు పాల్గొని జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ఫోన్ ద్వారా శ్రీనాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు, సోమేపల్లి వాసు గారు,గేరా లింకన్ గారు, బైరా వెంకట కోటి గారు , గొట్టిపాటి సాంబశివరావు గారు,AVM సుభాని గారు, మాజేటి నరేంద్ర గారు, వేజర్ల కోటేశ్వరరావు గారు, ఇమ్మడి జానకిపతి గారు, జాలాది సుబ్బారావు గారు, గడిపూడి దశరథ రామయ్య గారు, నార్నె హనుమంతరావు గారు, చింతల సింగయ్య గారు, జంజనం వెంకటరావు గారు, సయ్యద్ జమీర్ గారు, కొండెబోయిన ఆంజనేయులు గారు, షేక్ కరీముల్లా గారు,గ్రంధి…
జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత చిలకలూరిపేట 26వ వార్డులోని తిరుపతమ్మ గుడిలో సేవ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వృద్ధురాలి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. చరణ్ తేజ పేరు మీద తమ సొంత నిధులతో జనసేన నాయకులు బియ్యం, నిత్యావసర వస్తువులు, మరియు ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన యువనాయకులు మండల నేనిచరణ్ తేజ పేరు మీద చేపట్టిన రెండో సేవా కార్యక్రమం అని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో 26వ వార్డు జనసేన నాయకులు పీఎస్ఆర్, మీసాల రాజు, మీసాల లక్ష్మణ్, ఉపేంద్ర, బొంతు రామారావు, సంతు తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
యోగాంధ్రతో ప్రపంచ రికార్డుయోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలియోగ దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలిజనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజిచిలకలూరిపేట:యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని.. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. ఇందులో భాగంగానే ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నివిశాఖపట్నం కేంద్రంగా,రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారని, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా పలు ప్రపంచ రికార్డులు సాధించడం తోపాటు ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ కూడా పాల్గొనటం విశేషమన్నారు.యోగసాధనతో గిన్నిస్ రికార్డు..జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని బాలాజి చెప్పారు.ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.…
వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో గురువారం తాసిల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ ను సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశా రు . ఈ సందర్భంగావినియోగదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తాసిల్దార్ తో చర్చించారు . వినియోగదారుల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్లు డెలివరీ లోపాలు, పెట్రోల్ బంకులలో వినియోగదారులకుజరుగుతున్న సౌకర్య లోపాలు తదితర అంశాలపై తహసిల్దార్ తో విపులంగా చర్చించి నట్లు తెలిపారు .. సమస్యలను పరిష్కరించాలని తాసిల్దార్ ను కోరడం జరిగిందని, తాసిల్దార్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు… అనంతరం వినియోగదారుల హక్కుల పోస్టర్ ను తహసీల్దార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రవి నాయక్ కోశాధికారి బేబీ విక్రమ్, కార్యదర్శి పోలయ్య తదితర నాయకులు…
పల్నాడు పర్యటనలో ఆంక్షలు ఉల్లంఘన .. ఎస్పీ కీలక వ్యాఖ్యలు జగన్ పల్నాడు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘనలు నిబంధనల ఉల్లంఘనలపై కీలక వ్యాఖ్యలు చేసిన పల్నాడు ఎస్పీ లీగల్ ఒపీనియన్ తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నిన్న పర్యటించిన విషయం విదితమే. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ప్రదర్శించాయి. పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పర్యటన సాగింది. జగన్ జిల్లా పర్యటనపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పల్నాడు పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వగా, ఆంక్షలకు పూర్తి విరుద్ధంగా కార్యక్రమం జరిగిందని ఎస్పీ తెలిపారు. పోలీసులపై ప్రజా ప్రతినిధులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఏర్పడ్డాయని,…
పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్ల రికవరీ, బాధితులకు అందించిన : అర్బన్ సిఐ రమేష్ చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్లను పేట అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విజయవంతంగా రికవరీ చేశారు. ఈరోజు, పేట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. రమేష్ రికవరీ చేయబడిన ఈ సెల్ ఫోన్లను వాటిని పోగొట్టుకున్న బాధితులకు అప్పగించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ, సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల వాటిని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సైబర్ క్రైమ్ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఫోన్లను గుర్తించడం జరిగిందని, ప్రజలు తమ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.పోగొట్టుకున్న తమ సెల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీస్ అధికారులకు, ముఖ్యంగా ఇన్స్పెక్టర్ రమేష్ కి మరియు వారి బృందానికి తమ…
చిలకలూరిపేట భాష్యం స్కూల్ లో ఘనంగా ముందస్తు యోగ దినోత్సవం వివిధ రకాల ఆసనాలు వేసిన చిన్నారులు రాష్ట్ర వ్యాప్తంగా యోగ ను ఒక ఉత్సవంలా నిర్వహిస్తున్న భాష్యం విద్యా సంస్థలు అవగాహన కల్పించిన ZEO హృదయ రాజ్, ZCO ప్రమీల రాణి,ప్రిన్సిపాల్ సునీల్ మూడు రోజుల పాటు పాటశాల లో జరగనున్న యోగ ప్రక్రియ యోగా చేయడం వల్ల విద్యార్థులలో మానసిక ఉల్లాసం,ప్రశాంతత ,లభిస్తుందని చిలకలూరిపేట భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ నరసరావుపేట భాష్యం స్కూల్స్ జోన్ ZCO అంచా ప్రమీల రాణి తెలిపారు. గురువారం ఉదయం చిలకలూరిపేట భాష్యం స్కూల్ ఆధ్వర్యంలో భాష్యం గ్రౌండ్ నందు విద్యార్థులు, చిన్నారులు యోగ చేశారు. ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ముందస్తు గా భాష్యం స్కూల్ విద్యార్థులు యోగ చేసి యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు. ఈ సందర్భంగా ZEO హృదయ రాజ్ ,ZCO అంచా ప్రమీల రాణి…
యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ_ _నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పాల్గొని యోగా చేసారు ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాను నిత్య జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ఉద్దేశంతో యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసేలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 21 వ తేదీన వైజాగ్ మహానగరంలో యోగాంద్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు









