Author: chilakaluripetalocalnews@gmail.com

చిలకలూరిపేటలో టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు చిలకలూరిపేట, జూన్ 10: హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్‌కు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు (AP 09 BV 1251) పసుమర్రు గ్రామం సమీపంలోని మలుపు వద్ద టైర్ పేలడంతో అదుపుతప్పి రోడ్డుపక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా, సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. – చిలకలూరిపేట లోకల్ న్యూస్

Read More

జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి జిల్లాలో నిర్దేశిత గడువులోగా సర్ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలని‌జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ అంశాలపై మంగళవారం క్యాంపు కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ సంజన సింహ,ఎలక్షన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో , స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బీఎల్వోలు తప్పనిసరిగా ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలను సేకరించి వాటిని 2002 ఓటరు జాబితాతో క్షుణ్ణంగా మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ అంశంపై బిఎల్వోలు పోలింగ్ కేంద్రాల పరిధిలోని వివిధ పార్టీల బూత్ ఏజెంట్ (బిఎల్ఏ)…

Read More

చిలకలూరిపేట గడియార స్తంభం సెంటర్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలుఎస్ఐ హజరత్ అయ్య ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎస్ఐ హజరత్ అయ్య ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు. అలాగే ఒకే బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్న త్రిబుల్ రైడింగ్ వాహనదారులను ఆపి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ హజరత్ అయ్య మాట్లాడుతూ, “ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. త్రిబుల్ రైడింగ్ చేయడం చట్ట విరుద్ధమే కాకుండా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన…

Read More

జనతా వారధిది. 08.06.2026 సోమవారం విషయం : గీత కులాల గౌరవం – పర్యావరణ పరిరక్షణ – స్వావలంబన కోసం వినతి తరతరాలుగా ప్రకృతితో మమేకమై జీవిస్తూ, తాటి చెట్టును ఆధారంగా చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, ఈడిగ, యాత తదితర గీత కులాల ఆకాంక్షలను మీ ముందుకు వినమ్రంగా తీసుకువస్తున్నాము. భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గీత కులాల స్థితిగతులను అధ్యయనం చేయడం జరిగింది. అలాగే గీత కులాల సంఘాలు, సొసైటీలు, పెద్దలు, మేధావులు మరియు వృత్తిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన సూచనలు, అభిప్రాయాలు మరియు ఆకాంక్షల ఆధారంగా ఈ వినతిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నాము. భారతదేశ సనాతన జీవన విధానంలో తాటి చెట్టు ఒక సాధారణ వృక్షం కాదు. అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, పర్యావరణ పరిరక్షణకు సహజ రక్షకుడు, వేలాది కుటుంబాల…

Read More

*ది.05-06-2026 వ తేదిన పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది* *ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది* *ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ సంయోజిక్ శ్రీ చిరుమామిళ్ల ఆదినారాయణ గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది* *వచ్చిన పిర్యాదులు* *నకరికల్లు మండలం నకరికల్లు గ్రామం నుంచి చాట్టు ఏడుకొండలు అనే రైతు తనకు సంబంధించిన 50 సెంట్లు భూమిని ప్రభుత్వ అధికారులు తన 10-1 అడంగల్ నుంచి తొలగించడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది* *పాల్గొన్న నాయకులు:* *ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు నరసరావుపేట పార్లమెంటు సంయోజిక్ శ్రీ చిరుమామిళ్ల…

Read More

చిలకలూరిపేట రూరల్ మండలం రాజాపేట లొ మా నామ్ కే ఏక్ పెడ్ కార్యక్రమం లొ భాగంగా మొక్కలు నాటడం జరిగింది చిలకలూరిపేట రూరల్ మండలం రాజాపేట గ్రామంలో కొత్తగా వేసిన రోడ్డు పక్కన మరియు కస్తూరిబాయ్ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది.ఈ రోజు 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా “మా నామ్ కే ఏక్ పేడ్” అంటే అమ్మ పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమం చిలకలూరిపేట మండలం రాజపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు రూరల్ మండలం ఇంచార్జ్ మల్లెల శివ నాగేశ్వరరావు మండల అధ్యక్షుడు పఠాన్ యాసిన్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బ్రహ్మాజీ మరియు బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Read More

జనతా వారధిది. 01.02.2026 సోమవారం విషయం : ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు రక్షణ – నీటి నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. రాష్ట్రంలో 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వాతావరణ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం భారీ వర్షాల అవకాశాలను దృష్టిలో ఉంచుకొని చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాల పెంపు కోసం చర్యలు చేపడుతోంది. ఈ రెండు అంశాలు రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకుంటున్న చర్యలే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు స్పష్టమైన అవగాహన లేకపోతే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు మరియు రైతులు భాగస్వామ్యంతో ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయవలసిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమం ద్వారా రైతులను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటుంది. వారి నుంచి వచ్చిన సందేశాలు దృష్ట్యా…

Read More

ది.29-5-2026 వ తేదిన పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావు గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శ్రీ వల్లెపు కృపారావు గారు జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్చార్జి కోమటి వాసు మరియు బిజెపి నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమనికి…

Read More

శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పలనాడు జిల్లా అధ్యక్షుడు శ్రీ ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈ వారం జనత వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని గుర్రం వారి పాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది. పొలానికి వెళ్లే రహదారిలో మూడు కాలువలపై బ్రిడ్జి ల నిర్మాణం కొరకు, కొత్తలూరు పంచాయతీకి వెళ్లే రహదారి నిర్మాణం కొరకు, ఉపాధి హామీ పనులు నిధుల జమ కొరకు, గ్రామంలోని సైడ్…

Read More

ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రజల దినచర్యగా మారాలి : ప్రత్తిపాటి ప్రజల భాగస్వామ్యం, వారి బాధ్యతాయుత పనితీరుతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన చిలకలూరిపేటలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో పాల్గొన్నారు. స్వయంగా చీపురు పట్టిన ప్రత్తిపాటి.. స్థానిక నాయకులతో కలిసి రోడ్డు శుభ్రం చేశారు. అనంతరం ఒక కూడలిలో తాటిముంజలు అమ్ముతున్న చిన్నారులతో మాట్లాడి, ఎక్కడి నుంచి వచ్చారు. తాటికాయలు ఎక్కడ తెచ్చారు.. అన్నీ అమ్మితే ఎంత లాభం వస్తుందని వారిని ప్రశ్నించగా, పిల్లలు ఉత్సాహంగా ప్రత్తిపాటికి సమాధానమిచ్చారు. అనంతరం వారి వద్ద ముంజలు కొనుగోలు చేసి రుచిచూసిన ప్రత్తిపాటి బాగున్నాయని వారిని మెచ్చుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలు తమ సొంతపనులుగా భావించాలిఅనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అయినా.. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర అయినా ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతాయన్నారు. ప్రభుత్వం వీధులు, పట్టణాలు, గ్రామాల శుభ్రతను ఒక ప్రాజెక్టులా నిర్వహిస్తోందని,…

Read More