మేడం రమేష్ పై హత్యాకు కుట్ర.. పల్నాడు జిల్లా,వినుకొండ: సీనియర్ నాయకుడు, వైశ్య ప్రముఖుడు, ప్రముఖ అపరాల వ్యాపారి మేడం రమేష్ పై హత్యకు కుట్ర పన్నారు. కుట్ర గుట్టు రట్టు కావడం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం వినుకొండ పోలీసులు క్రైమ్ నెంబర్ 91/2026, 506-308 సెక్షన్ల క్రింద ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వినుకొండ మండలం జాలలపాలెం గ్రామానికి చెందిన గొట్టం గోవిందరాజులు 2020లో లేని భూమిని ఉన్నట్టుగా చూపి అక్రమంగా జగనన్న కాలనీకి ప్రభుత్వానికి అమ్మి సుమారు 90 లక్షలు స్వాహా చేశారు. ఈ అవినీతిని మేడం రమేష్ బయటకు తీసి గత ఏడాది అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అవినీతి నిగ్గు తేలింది. దీనితో కక్ష కట్టిన గొట్టం గోవిందరాజులు, B. వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కలిసి మేడం రమేష్ హత్యకు కుట్ర పన్ని సుపారి ఇచ్చి హత మార్చే ప్రయత్నం చేశారంటూ, తనకు…
Author: chilakaluripetalocalnews@gmail.com
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారది కో కన్వినర్ గారు పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు గుమ్మడి నాసారయ్య గారు దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా నెల్లటూరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్ల , ఐ.ఏ.ఎస్.,జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,పల్నాడు జిల్లా విషయం:పల్నాడు జిల్లాలోని గ్రామాల్లో చెత్త నిర్వహణ (SLWM) మరియు కంపోస్ట్ యూనిట్ల నిర్వీర్యం పై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి. అమ్మ , భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా జిల్లా గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాము. ఈ పర్యటనల సందర్భంగా పారిశుధ్యం విషయంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామాల్లో…
ఆర్డీవో గా డివిజన్ లో మంచి పేరు తీసుకురావాలి నరసరావుపేట డివిజన్ లో ప్రజలకు మంచి సేవ చేయాలని నూతన ఆర్డీవో బాలకృష్ణ ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టిన అనంతరం బాలకృష్ణ ఆదివారం చిలకలూరిపేట లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని , డివిజన్ కి మంచి పేరు తీసుకురావాలని ఆర్డీవో కు ఎమ్మెల్యే సూచించారు.
“పోదాం పోదాం సర్కారు బడికి పోదాం” నినాదాలతో అవగాహన ర్యాలీ చిలకలూరిపేట లోకల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు మేరకు ఈనెల 18నుంచి23వరకు పాఠశాల ఆవాస్ ప్రాంతంలో బడి ఈడు కలిగిన పిల్లలను బడి బయట ఉండకుండా బడిలో చేర్చుకునే విధంగా బడిబాట ర్యాలీ నిర్వహించాలని అదేవిధంగా చదువు మధ్యలో ఆపేసిన డ్రాప్స్ తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా ఈ ర్యాలీ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు నూతన 2026-27విద్యా సంవత్సరంలో పాఠశాల ఆవాస ప్రాంతంలో బడి ఈడు కలిగిన పిల్లలందరూ బడిలోనే ఉండాలని బాల కార్మికులు కానీ నవ ఎన్రోల్మెంట్ గాని ఉండకూడదని ఉద్దేశంతో అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పోదాం పోదాం -సర్కారు బడికి పోదాం,డబ్బులు ఎందుకు దండగ -సర్కారు బడి ఉండగా వంటి నినాదాలతో విద్యార్థులు పోలిరెడ్డి పాలెం లో బడిబాటర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ అడ్మిషన్ ప్రక్రియ…
భూగర్భ జలాల పెంపు ప్రజల కనీస బాధ్యత : ప్రత్తిపాటి పరిశుభ్రత..నీటి భద్రతను ప్రజలు తమ జీవనవిధానంగా మార్చుకోవాలని, భూగర్భ జలాల పెంపు దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని, నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి, పారిశుధ్య సిబ్బంది, ప్రజలతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో తవ్విన ఇంకుడు గుంతను పరిశీలించారు.అనంతరం నీటి భద్రత.. పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్, సచివాలయ సిబ్బందికి ప్రత్తిపాటి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జల సంరక్షణ చర్యల్ని సమర్థవంతంగా అమలుచేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశానికే మార్గదర్శిగా నిలిచారని, గతంలోనే ఆయన ఇంకుడు గుంతల తవ్వకంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, జన్మభూమి కార్యక్రమంతో నీటి పొదుపు మార్గాలను ప్రజలు పాటించేలా చేశారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రజలు పరిసరాల…
చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. మాజీ కమిషనర్తో సహా తొమ్మిది మందిపై వేటు! చిలకలూరిపేట మున్సిపాలిటీలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మును కాజేసిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నకిలీ రసీదులు సృష్టించి ఏకంగా రూ.34 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన ఘటనపై కఠిన చర్యలకు ఆదేశిస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. నకిలీ రసీదులతో నయా దందా: పురపాలక సంఘం పరిధిలో ఆస్తి పన్ను, కుళాయి పన్ను తదితర పన్నులు చెల్లించడానికి వచ్చిన అమాయక ప్రజలకు మున్సిపల్ సిబ్బంది నకిలీ రసీదులు చేతిలో పెట్టారు. వసూలైన నగదును ఖజానాకు జమ చేయకుండా రూ.34 లక్షల వరకు పక్కదారి పట్టించారు. మాజీ కమిషనర్పై యాక్షన్: ఈ భారీ స్కామ్కు బాధ్యులను చేస్తూ అప్పటి మున్సిపల్ కమిషనర్…
శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ ,శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని కనుమర్లపూడి గ్రామంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలోని సమస్యలపై నాలుగు అర్జీలు ఇవ్వడం జరిగింది ,లంబాడీ డొంక కాల్వపై బ్రిడ్జి నిర్మాణం మంజూరుకై, ఆంజనేయస్వామి గుడి వెనక బజారులో అసంపూర్ణంగా ఉన్నటువంటి సైడ్ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని, బొడ్డు రాయి వెనుక వీధిలో సైడ్ డ్రైనేజీ…
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతీష్ నాయుడు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా తోట సతీష్ నాయుడు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన తోట సతీష్ నాయుడు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన తోట సతీష్ నాయుడు. అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన…
ప్రజల కోసం ఇంటింటి జనగణనపై యానిమేటర్లకు ప్రత్యేక శిక్షణ.. హాజరైన అధికారులు. చిలకలూరిపేట రూరల్ మండలం లో జనగణన-2027 శిక్షణా తరగతులు రెండో రోజు చిలకలూరిపేటపట్టణంలోని అసిస్ట్ మీటింగ్ హాలు నందు జనగణన-2027కు సంబంధించి చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని సూపర్ వైజర్లు మరియు యానిమేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఇండ్ల జనగణన ప్రక్రియపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు.డిజిటల్ జనగణన: ఈ సందర్భంగా చిలకలూరిపేట తహశీల్దారు మాట్లాడుతూ, ‘డిజిటల్ భారత్’లో భాగంగా ఈసారి జనగణన ప్రక్రియను పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ఇండ్ల గణన ప్రక్రియ జరుగుతుందని, ప్రధాన జనగణన 2027 ఫిబ్రవరిలో* ఉంటుందని ఆయన వివరించారు.సెల్ఫ్ ఎన్యూమరేషన్: ఈసారి జనగణనలో ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం కల్పించడం ఒక ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు శిక్షణా కార్యక్రమములో ఫీల్డ్…
అనితర సాధ్యుడు అజరామరుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర్ శ్రీనివాసన్. సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి అసామాన్యునిగా ప్రపంచ ప్రజల నీరాజనాలు అందుకున్న మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర్ శ్రీనివాస్ అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి కార్యక్రమం చిలకలూరిపేట కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్న అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర శ్రీనివాస్ రైజ్ సంస్థ డైరెక్టర్ చుక్కా విన్సెంట్ పాల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్న రాష్ట్ర కాంగ్రెస్ మాజీ కార్యదర్శి ఉప్పుటూరి అనిల్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోవూరి శ్రీధర్ పూలమాలలు…









