Author: chilakaluripetalocalnews@gmail.com

చిలకలూరిపేటలో తాసిల్దార్ షేక్ హుస్సేన్ కు విజ్ఞాపన పత్రం అందజేసిన జర్నలిస్టులు అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలి ఏపీయుడబ్ల్యుజే జిల్లా కమిటీ సభ్యులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడపా అశోక్ కుమార్ స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యులు షేక్ మస్తాన్ వలి చిలకలూరిపేట:రాష్ట్రవ్యాప్తంగా ఏపీయుడబ్ల్యూజే డిమాండ్స్ డే లో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు పిలుపు మేరకు చిలకలూరిపేటలో ఏపీయుడబ్ల్యుజే చిలకలూరిపేట శాఖ ప్రెస్ క్లబ్ తరఫున చిలకలూరిపేట తహసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. తాహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి నూతనంగా అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని, ఇంటి నివేసన స్థలాలు కేటాయించాలని,భీమా సౌకర్యం కల్పించాలని జర్నలిస్టుల కోరికలను వెంటనే అమలుపరిచేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యుజే జిల్లా కమిటీ సభ్యులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అశోక్ కుమార్…

Read More

పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరావు కు ఘన సన్మానంపల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియామకం పొందిన మల్లెల శివ నాగేశ్వరావు ను బాపట్ల జిల్లా కాపు నాయకులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ లక్కకుల నాగేశ్వరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి రామారావు వీరు మాట్లాడుతూ గత 40సంవత్సరాలనుండి ఓకే పార్టీ లో కొనసాగుతు పేద ప్రజలకు ఎన్నో సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షస్తున్నాము అని కొనియాడారు ఈ సన్మాన కార్యక్రమం లో జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ప్రెసిడెంట్ గోవిందు శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి వాట్టెం శ్రీనివాసరావు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read More

రాష్ట్రప్రగతికి అడ్డుపడుతూ… తప్పుడు మెయిల్స్ పెట్టేవారు ప్రజలకు అవసరమా? : ప్రత్తిపాటి నేడు నియోజకవర్గంలోని 21,614 మంది రైతులకు అన్నదాతాసుఖీభవ కింద రూ.15.13కోట్లు అందించామని, కౌలురైతులు సహా ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం తప్పక అందుతుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. జగన్ రైతుభరోసా పేరుతో రైతుల్ని దగా చేశాడని, అరకొరగా కేవలం రూ.7,500లు మాత్రమే ఇచ్చాడని, మరోఏడాది రూ.6,500లతోనే సరిపెట్టాడన్నారు. కూటమిప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా రూ.14వేలు ఇస్తుందని, కేంద్రసాయం రూ.6వేలు కలిపి మొత్తం రూ.20వేలు మూడువిడతల్లో అందిస్తుందని ప్రత్తిపాటి చెప్పారు. యడ్లపాడు మండల కేంద్రంలో నేడు ప్రభుత్వం సగర్వంగా ప్రారంభించిన అన్నదాతా సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు చెక్కులు అందించిన ప్రత్తిపాటి అనంతరం వారితో కలిసి కాడెడ్లు, అరకలతో చేపట్టిన ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం రైతుల్ని ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు. పెట్టుబడులు రాకుండా తప్పుడు మెయిల్స్ పెట్టేవారిని ఏంచేయాలో ప్రజలే ఆలోచించాలి చంద్రబాబు రేయింబవళ్లు రాష్ట్రం…

Read More

చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ షేక్ కరిముల్లా గారిని సన్మానించిన జనసేన పార్టీ నాయకులు మరియు రాధా రంగ మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ మీ అచ్చుకోల మురళీకృష్ణ.. చిలకలూరిపేట మార్కెట్ యార్డు చైర్మన్ గా నియమితులైన శ్రీ షేక్ కరిముల్లా గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలవ పూలదండతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ నాయకులు మరియు రాధా రంగ మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ గారు మరియు వారి మిత్ర బృందం.. తదనంతరం అచ్చుకోల మురళీకృష్ణ మాట్లాడుతూ.. టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి శ్రీ షేక్ కరిముల్లా గారు పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ పార్టీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు పార్టీ అధిష్టానం ఆయన సేవలను గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేయటం…

Read More

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పి వి ఎన్ మాధవ్ గారు పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జన సమీకరణ సమీక్షలుఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పల్నాడు జిల్లా ఆగస్టు 4వ తేదీ పర్యటన సందర్భంగా జన సమీకరణ గురించి బిజెపి ముఖ్య నాయకులను కలవడం కోసం పసుమర్రు గ్రామ ముఖ్య నాయకులైన కక్కెర పుల్లారావు గారిని కలిసి జన సమీకరణ ఎలా చేయాలనే అంశంపై వివరించడం జరిగింది తదుపరి ఎడ్లపాడు మండలం ముఖ్య నాయకులైన మర్త సుబ్బారావు తో జన సమీకరణ ఎలా చేయాలి అనే దానిమీద నియోజకవర్గ ముఖ్య నాయకులైన కన్వీనర్ తాడిపర్తి జయరాం రెడ్డి పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్ మాజీ పట్టణ అధ్యక్షులు పోత్తూరు బ్రహ్మానందం తదితరులు మండలాల పర్యటన చేయడం జరిగింది.

Read More

ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పల్నాడు జిల్లా పర్యటన సమీక్ష సమావేశం స్థానిక చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కామినేని హనుమంతరావు పాల్గొన్నారు పాల్గొని మన పల్నాడు జిల్లా కి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ బిజెపిరాష్ట్ర అధ్యక్షులు పి వి న్ మాధవ్ గారు 04/08/25 తారీఖున పల్నాడు జిల్లా నరసరావు పేటకు విచ్చేయు సందర్భంగా ఆరోజు జరిగే కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి పార్టీ నాయకులతో కార్యకర్తలతో చర్చించడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం సన్నాహాలు చేశారు, అందరూ సమావేశం అయి పార్టీ నాయకులు అందరూ కలిసి జన సమీకరణ గురించి చర్చించి ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా జయప్రదం చేయాలని సన్నాహాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న…

Read More

చిలకలూరిపేట: పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో 29వ వార్డులో ఖాళీ స్థలాల శుభ్రత చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు 29వ వార్డులో ముమ్మరంగా ఖాళీ స్థలాల శుభ్రత కార్యక్రమం కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వార్డులోని పలు ఖాళీ స్థలాల్లో పిచ్చి చెట్లు ఏపుగా పెరిగిపోయి, ఇళ్లలోకి పాములు వస్తున్నాయని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లారు.ప్రజల సమస్యలను తక్షణమే పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఆయా ఖాళీ స్థలాలను వెంటనే శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి స్వయంగా పర్యవేక్షిస్తూ, ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించి, పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. “వర్షాల వల్ల ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు పెరిగిపోయి పాముల బెడద పెరిగిందని…

Read More

జనసేన నుండి వైసీపీలోకీ భారీ చేరికలు చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో జనసేన లో ఉన్న నాయకుల విధి,విధానాలు నచ్చక జనసేన నుండి వైఎస్ఆర్సిపి పార్టీలోకి పారి చేరికలు జనసేన పార్టీలో అధికారం వచ్చినప్పటికీ ప్రాధాన్యత లేకపోవడంతో మాజీ మంత్రి విడదల రజిని సిద్ధాంతాలు నచ్చి గణపవరం నుండి పాతిక కుటుంబాలుజనసేన పార్టీ నుండి వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరాము అని మీడియాకు తెలియజేసిన జనసేన పార్టీ నాయకులుపసుపులేటి సాయి

Read More

నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో సివిల్ రైట్ డే కార్యక్రమం పాల్గొన్నా పోలీసు, రెవెన్యూ అధికారులు పలు విషయాలపై గ్రామస్తులు కు అవగాహన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో జరుగుతున్న అన్యాయలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలనిSI పుల్లారావు సూచించారు అదేవిధంగా CR కళాశాలలో చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హ్యూమన్ ట్రాఫిక్, హ్యూమన్ సేఫ్టీ చైల్డ్ లేబర్ పై విద్యార్థులు కు అవగాహన సదస్సు జరిగింది చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు పోలీసులు పాల్గొని విద్యార్థులు కు అవగాహన కల్పించారు

Read More

నేరాల నియంత్రణే ధ్యేయంగా పల్నాడు జిల్లాలో కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు: ఎస్పీ శ్రీనివాసరావు పల్నాడు జిల్లా, జూలై 30, 2025: పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు తెలిపారు. సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించి, ప్రజలకు “మేమున్నాము” అనే భరోసా కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీకటి కాలనీలో మరియు నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంకలగుంట గ్రామాలలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్డెన్ & సెర్చ్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆపరేషన్లలో రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచి, వారి ఇళ్లు మరియు పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ…

Read More