శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
. ఈవారం జనతావారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండలంలోని వయ్యకల్లు గ్రామంలో నిర్వహించడం జరిగింది ,కార్యక్రమంలో నాలుగు దరఖాస్తులు రావడం జరిగింది, ముఖ్యంగా పొలం బాటకు వెళ్లే రహదారి కొరకు, త్రాగు నీటిలో ఫ్లోరిన్ సమస్య పరిష్కారం కొరకు, సైడ్ డ్రైనేజీల మరమ్మతులు మరియు నిర్మాణం కొరకు, కిసాన్ సంబంధిది నిధులు కొరకు, దరఖాస్తులు రావడం జరిగింది, ఈ సమస్యల పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు, బిజెపి నేతలు అన్నవరపు శ్రీనివాసరావు, నార్ల సాంబశివరావు పాల్గొన్నారు.



