శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్, శావల్యాపుర మండల సీనియర్ నాయకులు శ్రీ అసుమల్లి వీరేంద్ర గారు ,ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు ,వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల పరిధిలోని బొందిని పాలెం గ్రామంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నేత రావినూతల ఆదాం నిర్వహణలో చేయడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఎనిమిది దరఖాస్తులు ఇవ్వడం జరిగింది పంచాయతీ ఆఫీస్ నుండి స్మశానానికి వెళ్లే రహదారిని సిసి రోడ్డు వేయించాలని, అలాగే గ్రామంలో ఉన్నటువంటి రహదారులకు సైట్ డ్రైనేజీలు నిర్మించాలని,అలాగే గత 17 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి రక్షిత మంచినీటి పథకానికి ,నిధులు మంజూరు చేయాలని, రైతు భరోసా,కిసాన్ సమ్మాన్ నిధి అమలు కొరకు రైతులు దరఖాస్తులు ఇచ్చారు.వీటి పరిష్కారం కొరకై బిజెపిపార్టీ తమవంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు చెప్పడం జరిగింది



