శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 5 కూలీలు మృతి
వినుకొండ: గుంటూరు- కర్నూలు జాతీయ రహదారి వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి నలుగురు మహిళ కూలీలు, డ్రైవర్ మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీద పల్లి గ్రామాన్ని చెందిన నలుగురు మహిళా కూలీలు నరసరావుపేట వద్ద బొప్పాయి కోతకు బొలెరో పార్సిల్ వాహనంలో వెళుతుండగా శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో మరో ఇద్దరు మహిళ కూలీలను, బొలెరో వాహనం డ్రైవర్ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



