జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన సందర్భంగా పులిహార, మజ్జిగ , పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు – చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈరోజు జగద్గురు కాలజ్ఞానకర్త భూత భవిష్యత్ వర్తమానాలను ప్రపంచానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలియజేసిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన సందర్భంగా ఈరోజు పట్టణంలో గడియార స్తంభం సెంటర్ దగ్గర ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు గారు పాల్గొని భక్తులకు ప్రజలకు పులిహారన్న ప్రసాదము మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి వారి స్టిక్కర్లను ఆవిష్కరించి భక్తులకు అందజేశారు, ఆయన మాట్లాడుతూ గొప్ప ఆధ్యాత్మిక సామాజిక సేవా సంఘసంస్కర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు అని అనేక మహిమలు చూపి ప్రజలకు తత్వ జ్ఞానబోధలు చేసిన తపోసంపన్నులని తెలియజేశారు, ట్రస్ట్ చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు, మరో అతిథిగా కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి పాల్గొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ముస్లిం మతస్థుడైన సిద్దయ్యను, మాదిగ కులస్తుడైన కక్కయ్యను చేరదీసి , కుల మతాలకు అతీతంగావారికి ఆత్మ బోధను చేశారని తెలిపారు, ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు జంపని భాస్కరరావు, రిటైర్డ్ ఎండోమెంట్ ఆఫీసర్ కారుమంచి శివరావు, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ జిసి పెంచలయ్య, గోగినేని నాగేశ్వరరావు, తుర్లపాటి సుబ్బారావు, శానంపూడి ఆంజనేయులు, కొత్తూరి హనుమంతరావు, బహునాథం వెంకటాచారి, కనుమల్లపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని భక్తులకు ప్రజలకు పాదచారులకు పులిహార, మజ్జిగ, వీరబ్రహ్మేంద్రస్వామి వారి స్టిక్కర్లను పంపిణీ చేశారు
Trending
- పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి
- ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ గూటికి చేరిన వైసీపీ కార్యకర్తలు
- క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ప్రత్తిపాటి
- పల్నాడు జిల్లా కలెక్టర్కు జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు
- రాజ్యసభ సభ్యునిగా సాయినాథుని మొక్కులు చెల్లించుకున్నా: భాష్యం రామకృష్ణ
- పశుపోషణతో అదనపు ఆదాయం : ప్రత్తిపాటిరైతుల సహకారంతో సంగం వ్యవస్థను మరింత వృద్ధిలోకి తెస్తాం : దూళిపాళ్ల
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డీఆర్ఓ గారికి రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పణ
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్వాక్రా మహిళల సమస్యలపై జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ



