ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే వేలంపాటలు నిర్వహిస్తున్నాము.మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీ హరిబాబు. పురపాలక సంఘం కార్యాలయమునకు సంభదించిన ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ కాంప్లెక్స్, గాంధీ పార్క్ దక్షిణం వైపు గల మున్సిపల్ కాంప్లెక్స్ లు లోని షాపుల లీజు కాలముగిసినందున మంగళవారం పురపాలక సంఘ కార్యాలయములో మునిసిపల్ కమిషనర్ పీ. శ్రీహరిబాబు ఆధ్వర్యంలో ప్రారంభమైన షాపు రూముల వేలం పాటలు ,షాపు రూములు దక్కించుకునేందుకు భారీగా లబ్ధి దారులు హాజరయ్యారు.మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరి బాబు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ షాపులు 25 సంవత్సరాలు పూర్తి అయిన ప్రత్తిపాటి కాంప్లెక్స్ నందు 20 షాపులు, గాంధీ పార్కునందు షాపులు 16 ఉన్నాయి.ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వేలం పాటలు చేపట్టాము.షాపుల ధరతగ్గించే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాము, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేంతవరకు పాత పద్ధతిలోని షాపుల వేలంపాట నిర్వహిస్తామని తెలియజేశారు.ప్రత్తిపాటి మున్సిపల్ షాపులను 20 మంది లబ్ధిదారులకు పాల్గొన్నారు. వేలం పాట ద్వారా…
Author: chilakaluripetalocalnews@gmail.com
భక్తిశ్రద్ధలతో పోలేరమ్మ, అంకమ్మ తల్లి తిరుణాళ్లు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రదాత మండలనేని చరణ్ తేజ నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని పడమర బజార్ వద్ద వేంచేసియున్న శ్రీ పోలేరమ్మ తల్లి మరియు అంకమ్మ తల్లి తిరుణాళ్లు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రదాత యువ నాయకులు మండలనేని చరణ్ తేజ హాజరయ్యారు.ముందుగా ఆలయానికి చేరుకున్న చరణ్ తేజకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు చరణ్ తేజను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.గ్రామస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో పడమర బజార్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే జగన్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు చేయిస్తున్నాడు : ప్రత్తిపాటి “ తన పిచ్చిప్రతిపాదన మావిగన్ ను సొంతపార్టీ నేతలే వ్యతిరేకించడం.. దాంతో ప్రజల్లో తాను మరింత అభాసుపాలవుతానన్న అక్కసు, ద్వేషంతో పాటు, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే జగన్ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ శ్రేణుల్ని దాడులకు పురికొల్పాడు. పత్రికాస్వేఛ్చను అరచేతితో అడ్డుకునే జగన్ ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవు. అదికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఇదేవిధంగా తప్పుడు రాతల నెపంతో జీవో నంబర్ 2430 ద్వారా మీడియా సంస్థల గొంతు నులిమే ప్రయత్నం చేసి, తన పతనానికి తానే బీజం వేసుకున్నాడు. ఒక పత్రిక, ఛానల్ యజమానిగా చలామణి అవుతున్న జగన్.. మీడియా సంస్థల ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించలేకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు..రాతలు నిప్పు కణికలుప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన మీడియా వ్యవస్థల సలహాలు, సూచలను గౌరవించలేని వాడు. ప్రజా భీష్టాన్ని గుర్తించలేని వాడు, సత్యాన్ని.. నిజాన్ని…
పల్నాడు జిల్లా : నరసరావుపేటలో క్రికెట్ బుకీలు అరెస్టు..! ఐలా బజార్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందని పోలీసులకు సమాచారం.. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఆరుగురు అరెస్టు..! బెట్టింగ్ ముఠా సభ్యులు షేక్ ఖాసీం, షేక్ మస్తాన్ వలీ, షేక్ రఫీ జాన్, పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి, పతేలా వెంకటేశ్వరరావు అరెస్టు. నిందితుల నుంచి రూ.4.58 లక్షల నగదు, ల్యాప్టాప్, సెల్ఫోన్లు స్వాధీనం. బెట్టింగ్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు బహుమతులు అందించిన డీఎస్పీ.
పల్నాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న జనతా వారిధి కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు శ్రీ PVN మాధవ్ గారి పిలుపు మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాలతో, పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డి ఆర్ ఓ గారికి సీనియర్ సిటీజన్స్ సమస్యలు పై మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు , పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. విషయం:కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డులు మరియు “ఆయుష్మాన్ వయో వందన కార్డ్”లను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అంగీకరించేలా…
శావల్యాపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ బిజెపి మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ గారు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు, ఈ వారం “జనతా వారధి” కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మతుకుమల్లి గ్రామంలో స్థానిక బిజెపి నేత వజ్జా వెంకటేశ్వర్లు గారి నిర్వహణలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది, అందులో భాగంగ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం కొరకు, పొలాలకు వెళ్లేటువంటి రహదారుల నిర్మాణం కొరకు, జలజీవన్ మిషన్ పూర్తిచేసి పంచాయతీకి అప్పగించడం కొరకు, పీఎం కిసాన్…
చిలకలూరిపేట పురపాలక సంఘం కౌన్సిల్ సభ్యుల సంఖ్య 38 కాదు… 48 చిలకలూరిపేట మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మున్సిపల్ కమిషనర్ల సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గణనీయంగా పెరిగిన వార్డుల సంఖ్య:గతంలో చిలకలూరిపేటలో 38 వార్డులు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను 48కు పెంచారు. అంటే మొత్తం 10 వార్డులు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో వార్డుల సరిహద్దుల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు కలిగే ప్రయోజనాలు:వార్డుల సంఖ్య పెరగడం వల్ల ప్రతి వార్డు పరిధి తగ్గుతుంది. దీనివల్ల కౌన్సిలర్లు స్థానిక సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలర్లు కృషి చేయవచ్చు. కోఆప్షన్ సభ్యుల సంఖ్య కూడా పెరిగింది:వార్డుల సంఖ్య పెరగడంతో పాటు, కోఆప్షన్ సభ్యుల సంఖ్య…
యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయ ఆభరణాల దొంగతనం.. నిందితుడి అరెస్ట్, 230 గ్రాముల సొత్తు స్వాధీనం… యడ్లపాడు: భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన వెండి,బంగారు ఆభరణాల దొంగతనంతో సంబంధం ఉన్న కేసులో ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ మరియు సిబ్బంది ఓ నిందితుడిని అరెస్ట్ చేసి 230 గ్రాముల వెండి‑బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్ వివరాలు.. యడ్లపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల మద్దుల రమణారావు (తండ్రి: మద్దుల హనుమంతరావు)ను తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న బజారు ప్రాంతంలో 2026, మార్చి 31వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.అతనిపై యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెం. 17/2026 కింద U/S 303(2), 305(d), 306 BNS సెక్షన్లతో పాటుగా దర్యాప్తు కొనసాగించండంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు.ఆభరణాల దాచిన స్థలం,స్వాధీనం అరెస్ట్ అనంతరం తన వాంగ్మూలంలో…
యడ్లపాడులో బైక్ దొంగ అరెస్ట్….. ఏడు మోటార్ సైకిళ్లు స్వాధీనం.. ఎడ్లపాడు: పలు మోటార్ సైకిళ్లు దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్థుడిని యడ్లపాడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.అతని వద్ద నుంచి సుమారు 3 లక్షల రూపాయల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.శిక్షణ డీఎస్పీ జయకృష్ణ ఆదేశాల మేరకు యడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ మరియు సిబ్బంది మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టారు.మండల పరిధిలోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ సమీపంలోని సర్వీస్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.హోండా సిబి యూనికాన్ (AP39QQ3500) మోటార్ సైకిల్ మీద ఉన్న అతను విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి చెందిన గుడిమెట్ల సాగర్ బాబు (33). అతనిపై తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ ఉంది.తనిఖీ సమయంలో మరో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడని అంగీకరించాడు. స్వాధీనమైన వాహనాలు.. మూడు హోండా యూనికాన్…
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి హిందూ దేవాలయాల భూముల ఆక్రమణ పై వినతి పత్రం సమర్పించడం జరిగింది విషయం: హిందూ దేవాలయ భూముల రక్షణ, అక్రమణల నివారణ శిధిలావస్థ లో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై వినతిపత్రం హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అయితే ప్రస్తుతం ఈ భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మధ్య ఆకివీడు రామాలయ పునఃనిర్మాణం లో జరిగిన అల్లర్లు, నవమి రోజున జరిగిన దాడులు స్వయంగా స్పీకర్ నే హత్య చేయాలనుకునే ప్రయత్నం పై యావత్ హిందు సమాజం ఆందోళనకు గురవుతుంది. సంవత్సరాలు…









