శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పలనాడు జిల్లా అధ్యక్షుడు శ్రీ ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈ వారం జనత వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని గుర్రం వారి పాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది. పొలానికి వెళ్లే రహదారిలో మూడు కాలువలపై బ్రిడ్జి ల నిర్మాణం కొరకు, కొత్తలూరు పంచాయతీకి వెళ్లే రహదారి నిర్మాణం కొరకు, ఉపాధి హామీ పనులు నిధుల జమ కొరకు, గ్రామంలోని సైడ్ డ్రైనేజీల నిర్మాణం కొరకు వివిధ సమస్యలపై ఐదు అర్జీలు రావడం జరిగింది, వీటి పరిష్కారానికై బిజెపి తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది.

Share.
Leave A Reply