పల్నాడు జిల్లా కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతి తో బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే “జనతా వారధి కార్యక్రమం” పల్నాడు జిల్లా కార్యాలయం లొ మే 22 తేది శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వినుకొండ మండలం నుండి వేమా ఏడుకొండలు పిర్యాదు ఇవ్వడం జరిగింది. తనను ఒక వ్యక్తి మోసం చేసి లక్షల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది. ఈ విషయంపై ఈపూరు మండల ఎస్సై గారితో మాట్లాడి త్వరగా తనకు న్యాయం చేయాలని బిజెపి నుంచి డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసిన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు గారు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
అలాగే సోమవారం నిర్వహించబడే జనతా వారధి కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను తీసుకువచ్చి వినతిపత్రాలు అందజేయవలసిందిగా కోరిన మల్లెల శివ నాగేశ్వరావు.
సోమవారం జరగభోవు జనతా వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు.
జనతా వారధి పల్నాడు జిల్లా టీమ్



