శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

,పార్టీ ఆదేశాల మేరకు, ఈవారం జనతా వారధి కార్యక్రమాన్ని ,శావల్యాపురం మండలంలోని తుమ్మలకుంట గ్రామంలో నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు పొలాలకు వెళ్లేటువంటి రహదారులు అద్వాన్నంగా ఉన్నాయని రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకం కింద ఈ పొలాలకు వెళ్లే రహదారులు నిర్మించాలని దరఖాస్తు ఇవ్వడం జరిగింది అలాగే గ్రామంలోని ఎస్సీ కాలనీకి విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో రావడంలేదని లో వోల్టేజీ సమస్యతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నామని దరఖాస్తు ఇవ్వడం జరిగింది . ఈ సమస్యల పరిష్కారం కొరకు బిజెపి తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు మరియు స్థానిక బిజెపి నేతలు సిద్దయ్య ఆంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు

Share.
Leave A Reply