భారతీయ జనతా పార్టీ – పల్నాడు జిల్లా

బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే “జనతా వారధి కార్యక్రమం” పల్నాడు జిల్లా కార్యాలయం లొ మే 15 తేది శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వినుకొండ పిడుగురాళ్ల నుంచి ఫిర్యాదులు రావడం వాటిని రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసిన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ అధికారులకు పంపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా విజయ భాస్కర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నబట్ల ఆదిత్య గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు గారుపల్నాడు జిల్లా sc మోర్చా అధ్యక్షులు మేళం మధు బాబు గారు పల్నాడు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పులుగుజ్జు మహేష్ గారు యువ మౌర్చ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వంకాయలపాటి వంశీధర్ బిజెపి పార్టీ సీనియర్ నాయకులునాసారయ్య గారు యూవ మౌర్చ్ నాయకులు కోటి తదితరులు పాల్గొన్నారు.

అలాగే సోమవారం నిర్వహించబడే జనతా వారధి కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను తీసుకువచ్చి వినతిపత్రాలు అందజేయవలసిందిగా కోరుతున్నాము.

సోమవారం జరగభోవు జనతా వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.

ఇట్లు
భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా

జనతా వారధి పల్నాడు జిల్లా టీమ్

Share.
Leave A Reply