నరసరావుపేట జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

నరసరావుపేట జిల్లా కార్యాలయంలో ఈ శుక్రవారం అనగా మే 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి 12 గంటలవరకు జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల నుండి భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త అయినటువంటి ఉడత ప్రసాదరావు తన తండ్రి మిలటరీలో పని చేసిన సందర్భంగా ప్రభుత్వం ద్వారా దుర్గి మండలం కోలగుట్ల గ్రామంలో సర్వే నెంబరు 989 లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వటం జరిగింది

సదరు తనకిచ్చిన ఈ భూమి రెవెన్యూ వారు సర్వే చేసి తనకు అప్పగించవలసినదిగా కోరుతూ జనతా వారధి కార్యక్రమం లో పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది

సదరు విషయాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు రెవెన్యూ వారిని సంప్రదించగా సర్వే నిమిత్తం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు

జనతా వారది కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది

ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జనతా వారి కార్యక్రమం ప్రతి గురువారం అన్ని మండలాలలో పార్టీ కార్యాలయం లో అలాగే ప్రతి శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది తెలియజేసిన పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు

మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అలాగే శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయం వచ్చే ఫిర్యాదులను అన్నింటిని సోమవారం జరిగే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రభుత్వం వారికి ఫిర్యాదులు అందజేయడం జరుగుతుందని పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు తెలియజేశారు

Share.
Leave A Reply