రూరల్ మండలాల్లో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షలు ఏలూరి శశి కుమార్ సూచనలు తో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట రూరల్ మండలంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట రూరల్ మండలం లో బిజెపి బలోపేతానికి కృషి చేస్తున్న బిజెపి నాయకులు ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట రూరల్ మండలం పోగ్రామ్ ఇంచార్జ్ పల్నాడు జిల్లా సెక్రటరీ గట్ట హేమ కుమార్ విచ్చేసి చిలకలూరిపేట రూరల్ మండలం బిజెపి అధ్యక్షులు ఉప్పాల భాస్కరరావు ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు బూత్ కమిటీలు వేయ్యటం కూడా జరిగింది పార్టీలోకి కొత్తవారిని కూడా ఆహ్వానించడం జరిగింది
కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు ప్రతి బూతులో కమిటీల బలోపేతానికి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క బిజెపి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు
ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే నినాదంతో ప్రతి గడపకు స్వదేశీ ఈవస్తువులని కొనండి అని బిజెపి నాయకులు తో కలిసి చిలకలూరిపేట రూరల్ మండలం లో స్టిక్కర్లు అంటించారు మరియు పాంప్లెంట్లు పోస్టర్లు అందజేశారు ఈ కార్యక్రమం తో పాటు పల్లెనిద్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట రూరల్ మండలం ప్రోగ్రాం ఇన్చార్జి గట్ట హేమకుమారు ప్రతి ఒక్కరు ఇంటిలో కి స్వదేశీ వస్తువులనే కొనుక్కుంటే మన దేశానికి వచ్చే లాభం మీద అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షులు, ఉప్పాల భాస్కరరావు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, చిలకలూరిపేట రూరల్ మండలం ప్రోగ్రాం ఇంచార్జ్ గట్ట హేమ కుమారు, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, , పసుమర్రు నాయకులు పుల్లారావు, , పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ సుభాని పట్టణ మాజీ ఉపాధ్యక్షులు దడబడ పుల్లయ్య చిలకలూరిపేట రూరల్ మండలం మాజీ అధ్యక్షులు కందెపు రంగారావు భార్య భర్తలు బిజెపి నాయకులు పటాన్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు



