చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ నాయకత్వంలో చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాత పోలీస్ స్టేషన్ వద్ద గల వెల్లంపల్లి రాము షాపు వద్ద జిఎస్టిని పేద ప్రజలకు అనుకూలంగా మార్పు చేసినందుకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల తరఫున బిజెపి ఆధ్వర్యంలో మాన్యశ్రీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ పాలాభిషేకం కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ బిజెపి అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు పోట్రూ పూర్ణచంద్రరావు బిజెపి యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులుగుజ్జు మహేష్ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యురాలు తూబాటి రాజ్యలక్ష్మి బీజేపీ నాయకులు ఉప్పల భాస్కరరావు బిజెపి నాయకులు వరికుటి నాగేశ్వరరావు సీతారామస్వామి దేవాలయ ట్రస్ట్ మెంబర్ వెల్లంపల్లి రాము కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు యువమోర్చా నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Share.
Leave A Reply