ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ కమిటీ సమావేశం లో భాగంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న జనతా వారధి కార్యక్రమం గురించి చర్చించడం జరిగినది . ప్రజలకు అధికారులుకు మధ్య వారధి గా వ్యవహరించటం ప్రజా సమస్యలను సంబంధిత అధికారులవద్దకు తీసుకువెళ్లి సమస్యలకు పరిష్కారం చూపాలని పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరావు పాల్గొని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించినారు ఈ కార్యక్రమం మండల బిజెపి పార్టీ అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు ఐలవరపు రామారావు రావువారి సుబ్బారావు నేలటూరి ఏసు రత్నం బందెల శ్రీనివాసరావు కామినేని సుధాకర్ చెక్క ఆంజనేయులు బండి కోటయ్య నక్క అనూష వై హనుమంత రాయుడు తులాబందుల ధనలక్ష్మి నక్క శ్రీనివాసరావు మద్దు చెన్నకేశవరావు మొదలగు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.

Share.
Leave A Reply