చిలకలూరిపేట కాపు కళ్యాణ్ మండపం పునర్ నిర్మాణ కార్యక్రమం లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు
ఈరోజు ఉదయం 10 గంటల కు స్థానిక కృష్ణారెడ్డి డొంక లో ఉన్న చిలకలూరిపేట కాపు కళ్యాణ్ మండపం పునర్ నిర్మాణ కార్యక్రమం లో భాగంగా కళ్యాణ మండపం ముఖ ద్వారాన్ని ఏర్పాటు కోసం పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది . తదుపరి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ముఖ్య కాపు నాయకులు నిర్మాణ కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలి అనే అంశంపై మీటింగు ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్య నాయకులను తాత్కాలిక కమిటీ గా ఏర్పాటు చేసుకొని ఆర్థిక వనరుల కోసం పట్టణంలోని కాపు కుటుంబ సభ్యులను అలాగే నియోజకవర్గంలో ఉన్న కాపు కుటుంబ సభ్యులను కలిసి నిర్మాణ పనుల గురించి వివరించి ఆర్థిక సహాయం కోసం తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరదామని పాల్గొన్న కాపు కుటుంబ సభ్యులందరూ తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాణ కమిటీ లో ఉన్న ముఖ్య సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు జనసేన సమన్వయకర్త తోటరాజ రమేష్ తోట రామచంద్ర బాబు కాయల తేజ మూర్తి పొన్నం చంద్రశేఖర్ ఉయ్యూరు నరసింహారావు పోతురాజు హరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share.
Leave A Reply