మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన షేక్ కరీముల్లా గారు…
చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన షేక్ కరీముల్లా ( టీడీపీ కరీముల్లా ) గారు, మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికైన కరీముల్లా గారిని ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు వివిధ హోదాల్లోని నాయకులు సత్కరించి అభినందించారు, కరీముల్లా గారు మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని తెలిపారు…
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మానం వెంకటేశ్వర్లు గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, గుర్రం నాగపూర్ణాచంద్రరావు గారు, కందుల రమణ గారు, మద్దిరాల సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు…

Share.
Leave A Reply