1200 ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో నూతనంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకూ మొత్తం 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో 239 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం వారు తీసుకున్న చర్యల మేరకు 1500 ఓటర్లు పైబడి ఉన్న పోలింగ్ కేంద్రాలు స్థానంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.పట్టణ పరిధిలో 3 పోలింగ్ కేంద్రాలలో 1500 ఓటర్లు పైబడి ఉన్న కారణంగా నూతనంగా 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిన కారణంగా, ప్రస్తుతం 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇటివల ఎన్నికల సంఘం వారు తీసుకున్న చర్యలలో భాగంగా 1200 ఓటర్లు పైబడిన పోలింగ్ కేంద్రాలలో సైతం నూతనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న మార్గదర్శకాల మేరకు పట్టణంలో 27 పోలింగ్ కేంద్రాలు, చిలకలూరిపేట రూరల్ మండలం పరిధిలో 4 పోలింగ్ కేంద్రాలు, నాదెండ్ల మండలం పరిధిలో 3 పోలింగ్ కేంద్రాలు నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వారు ప్రతి నెల జరిపే రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో సదరు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులుమాట్లాడుతూ, ఓటర్లు సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు అందజేయడం జరిగింది.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు మురకొండ మల్లిబాబు,అజహరుద్దీన్,ycp నుండి విడదల శ్రీనివాసరావు, కాంగ్రెస్ నుండి M. రాధా కృష్ణ, జనసేన నుండి కోట సాంబ,సుభాని, నవతరం నుండి రావు సుబ్రమణ్యం తదితరులు పాల్గొనగా,అధికారులు ERO రమేష్,AERO లు పేట పురపాలక సంఘం కమీషనర్ పతి శ్రీ హరిబాబు,చిలకలూరిపేట తహసీల్దారు హుస్సేన్, నాదెండ్ల తహసీల్దారు చంద్ర శేఖర్, యడ్లపాడు తహసీల్దారు విజయ శ్రీ తదితరులు పాల్గొనడం జరిగింది.
Trending
- పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రజల దినచర్యగా మారాలి : ప్రత్తిపాటి
- పల్నాడు జిల్లా కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి చెరువుల మట్టి నిర్వహణ పై జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది
- భారతీయ జనతా పార్టీ – పల్నాడు జిల్లా
- సాతులూరు వద్ద కాలేజీ బస్సు ఢీకొని ఇద్దరు యువకుల మృతి



