వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ‘బాబు ష్యూరిటీ …మోసంగ్యారంటీ’ కార్యక్రమం సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నిస్తూ బహిరంగసభ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయాలంటూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ మోసం – గ్యారంటీ’ పేరుతోఈ రోజు గురువారం (జూలై 17) కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మాజీ మంత్రి విడదల రజిని నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్ఆర్టీ రోడ్డులోని మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద ప్రారంభం అయ్యే ఈ బహిరంగ సభలో వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జెల సుధీర్భార్గవ్రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్రెడ్డి, మాజీపార్లమెంట్ సభ్యులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి ,అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచీ పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి విడదల రజిని పిలుపునిచ్చారు. చంద్రబాబు హామీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణాలు మహిళలకు, ఉద్యోగాలు యువతకు, పెట్టుబడి సాయం రైతులకు వంటి సూపర్ సిక్స్ హామీలు కేవలం మోసపు మాటలేనని, ప్రజలు వాటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజల తరపున ఈ ప్రశ్నలు వేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నియోజకవర్గవ్యాప్తం గా ఈ కార్యక్రమం జరుతుంది అని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హామీల అమలుకు బలంగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు .
Trending
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అభినందనలు
- చిలకలూరిపేటలో దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యేకు వినతి
- పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- స్థానిక ఎన్నికల్లో సాధించే మంచి విజయమే… శ్రేణుల పనితీరుకు కొలమానం : ప్రత్తిపాటి
- చేనేత సహకార సంఘాల ప్రక్షాళన, పారదర్శక ఎన్నికలు, APCOలో ప్రజాస్వామ్య పాలన, నేతన్నల బకాయిల పరిష్కారం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా షేక్ జానీభాష నియామకం
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా బాలు నాయక్



